గ్రానైట్ పరిశ్రమలపై గునపం
చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం.
తాడిపత్రిలో 70 శాతం మూసివేత
రోడ్డున పడిన వేలాది కుటుంబాలు
ఇదీ జగన్ పాలనలో పరిస్థితి
పరిశ్రమ మూతపడటంతో నిరుపయోగంగా యంత్రాలు
చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం. 20 వేల మందికి కొత్తగా ఉపాధి కల్పిస్తాం.
2019, మార్చిలో తాడిపత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ హామీ
తాడిపత్రి, న్యూస్టుడే: జగన్ ప్రభుత్వం పరిశ్రమలపై పగపట్టింది. హామీలను నెరవేర్చక పోగా ఇస్టానుసారం రాయల్టీ, విద్యుత్తు ఛార్జీలు పెంచడంతో యజమానులు కుదేలవుతున్నారు. రాయలసీమలోనే తాడిపత్రి గ్రానైట్, నాపరాళ్ల పరిశ్రమలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో సజావుగా కొనసాగిన పరిశ్రమలు.. వైకాపా అధికారంలోకి రాగానే అన్నీ పెంచేసి..గునపం దించింది. నిర్వహణ భారమై, నష్టాలు భరించలేక 70 శాతం మంది యజమానులు తమ యూనిట్లను నిలిపివేశారు. మరికొందరు శాశ్వతంగా మూసేశారు. 2019కు ముందు తాడిపత్రిలో కళకళలాడిన పరిశ్రమలు వైకాపా ప్రభుత్వం విధానాలు శరాఘాతంగా మారాయి. రాయల్టీ పెంపు, విద్యుత్తు ఛార్జీల బాదుడు, ఎండీఎల్లు రద్దు, సీనరేజీ వసూళ్ల బాధ్యతను ప్రయివేటు సంస్థకు అప్పగించడం.. తదితర కారణాలతో పరిశ్రమలు నడపడం సాధ్యం కాదని యజమానులు వాపోతున్నారు. ప్రత్యక్షంగా పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది కూలీల కుటుంబాలకు పని లేకుండా పోయింది. లారీలు, చిన్న వాహనాల యజమానులు, వాటిని నడిపేవారికి ఉపాధి కరవైంది.
రాయల్టీ పెంపుతోనే..
తెదేపా హయాంలో 2,750 గ్రానైట్, నాపరాళ్ల పరిశ్రమలు నడిచేవి. ప్రత్యేక్షంగా, పరోక్షంగా 30 వేల మంది వాటిపై ఆధారపడి జీవించేవారు. అప్పట్లో విద్యుత్తు ఛార్జీలు తక్కువే ఉన్నప్పటికీ రూ.12 కోట్ల బిల్లులు చెల్లించేవారు. వైకాపా ప్రభుత్వంలో గ్రానైట్పై రాయల్టీ పెంచడంతో నిర్వహణ భారంగా మారింది. గతంలో రూ.2,300 ఉన్న రాయల్టీని రూ.3,500కు పెంచారు. ఒక్కో పరిశ్రమ నిర్వాహకుడికి నెలకు కనీసం రూ.60 వేలు అదనపు భారమైంది. విద్యుత్తు ఛార్జీలను యూనిట్కు రూ.3 చొప్పున పెంచేశారు. ఇంత పెంచినా ప్రస్తుతం రూ.2 కోట్లకు మించి బిల్లులు రావడం లేదు. అంటే ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయో అర్థం చేసుకోవచ్చు. గతంతో ఒక్కో యూనిట్కు సగటున రూ.1.30 లక్షలు బిల్లు వచ్చేది. జగన్ ప్రభుత్వం పలుమార్లు ఛార్జీలు పెంచడంతో ఇప్పుడు రూ.1.80 లక్షలు వస్తోందని కొందరు యజమానులు వాపోయారు. విద్యుత్తును వినియోగించకపోయినా కనీస ఛార్జీ కింద ఒక్కో యూనిట్కు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు.
ఆదుకోవాల్సింది పోయి అధఃపాతాళానికి తొక్కారు
జగదీశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను ఆదుకోవాల్సింది పోయి అట్టడుగుకు తొక్కేసింది. పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన జీవో వచ్చినప్పటికీ నాలుగేళ్లు గడుస్తున్నా అమలు కాలేదు. ఎలాంటి ప్రోత్సాహకాలు అందించలేదు. దీంతో పరిశ్రమలు మూతపడ్డాయి. రాయల్టీని పెంచి ఇప్పటికీ పరిశ్రమలపై ఆర్థిక భారం మోపుతున్నారు.
ఆరుగురికి ఉపాధి కల్పించేవాడిని..
మహమ్మద్, మెకానిక్
యంత్రాలకు మరమ్మతులు చేస్తూ జీవనం సాగించేవాడిని. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఆరుగురికి ఉపాధి కల్పించేవాడిని. ప్రస్తుతం నాకే ఉపాధి లేకుండా పోయింది. నెలలో నాలుగు రోజులు కూడా పని దొరకడం లేదు. చాలా మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాలి.
కుటుంబ పోషణ భారమైంది
వీరన్న, కార్మికుడు
గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తూ కుంటుంబాన్ని పోషించుకునేవాడిని. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిశ్రమలు మూతపడటంతో ఉపాధి కోల్పోతున్నాం. వారంలో ఒకటి రెండు రోజులే పని దొరుకుతోంది. మిగతా రోజుల్లో ఇతర పనులకు వెళితే రోజుకు రూ.300 మించి రావడం లేదు. పరిశ్రమలు బాగా నడిచే సమయంలో రోజూ రూ.1,000 పైగా సంపాదించేవాడిని.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదమ్ముల ఘర్షణ.. ఒకరు మృతి
[ 03-05-2024]
గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
వైకాపా కుట్రకు పండుటాకుల విలవిల
[ 03-05-2024]
ఎన్నికల్లో లబ్ధి కోసం జగన్ ప్రభుత్వం చేసిన కుట్రకు పింఛనుదారులు బలవుతున్నారు. గురువారం మండుటెండలో బ్యాంకుల వద్ద బారులు తీరారు. బ్యాంకింగ్ సేవలపై అవగాహన లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. -
సహజ వనరు.. అడ్డంగా మేశారు
[ 03-05-2024]
వైకాపాలోని ఇసుకాసురులు బకాసురుడిని మించిపోయారు. ఇసుకను అమాంతం మింగేస్తున్నారు. నదీతీరాలను నామరూపాల్లేకుండా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక అక్రమ రవాణా సాగిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. -
‘జగన్ కుయుక్తులు తిప్పికొట్టండి’
[ 03-05-2024]
జగన్ తిరిగి అధికారంలోకి రావడానికి నానా కుయుక్తులు పన్నుతున్నాడని, ముస్లిం మైనార్టీలు తిప్పికొట్టాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ మహమ్మద్ షరీఫ్, తెదేపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ పిలుపునిచ్చారు. -
ఓపీఓలు ఓటేసేది ఎక్కడ?
[ 03-05-2024]
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ కోసం రికార్డు స్థాయిలో ఫాం-12 దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈనెల ఒకటో తేదీతో ఫాం-12 దరఖాస్తు చేసుకోడానికి తుది గడువు ముగిసింది. -
తెదేపా హయాంలో నీరు.. వైకాపా పాలనలో కన్నీరు
[ 03-05-2024]
ఘన చరిత్ర కలిగిన కణేకల్లు శ్రీచిక్కణ్ణేశ్వర వడియార్ చెరువుకు భద్రత కరవైంది. రైతుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్న జగన్ సర్కారు ఐదేళ్లుగా చెరువు అభివృద్ధి, నిర్వహణకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. -
రూ.2 వేల కోట్ల నగదు పట్టివేత
[ 03-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పామిడి మండలంలోని గజరాంపల్లి గ్రామ 44వ జాతీయరహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా నాలుగు కంటైనర్లు వరుసగా వెళ్లడంతో అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేశారు. -
వలస జీవులు.. వేదన బతుకులు
[ 03-05-2024]
పరిశ్రమలు తీసుకొస్తాం.. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.. స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ చేసిన వాగ్దానాలన్నీ బూటకమేనని తేలిపోయింది. -
చెరువులకు కృష్ణా జలాలు తీసుకువస్తాం
[ 03-05-2024]
కరవు కోరల్లో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు వైకాపా ప్రభుత్వానికి చేతులు రాలేదని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన ఉరవకొండ మండలం కోనాపురం, చిన్నముష్టూరు, లత్తవరం, లత్తవరం తండా, షేక్షానుపల్లి తదితర గ్రామాల్లో రోడ్షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ అధర్మ పాలనను తరిమికొట్టాలి
[ 03-05-2024]
ధర్మ మార్గాన్ని అనుసరించిన బసవేశ్వరుడి స్ఫూర్తితో అధర్మానికి నిలువెత్తు రూపం జగన్ పాలనను తరిమికొట్టి, ధర్మానికి మారుపేరైన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు వీరశైవులంతా సమాయత్తం కావాలని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
నీరివ్వడంలో జగన్ ప్రభుత్వం కాలయాపన
[ 03-05-2024]
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీటీపీ కాలువ పనులు ఆపి ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం కాలయాపన చేసిందని, భూములు కోల్పోయిన కొంత మంది రైతులకు మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. -
రాప్తాడు నుంచే మార్పు మొదలు: సునీత
[ 03-05-2024]
ప్రజలంతా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆ మార్పు రాప్తాడు నియోజకవర్గం నుంచే మొదలైందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
ఎంత పని చేశావమ్మా?
[ 03-05-2024]
మండలంలోని కల్లుదేవనహళ్లి గ్రామంలో ఓ తల్లి బిడ్డకు విషమిచ్చి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
అక్షరాలా మాట తప్పి.. నిస్సిగ్గుగా మడమ తిప్పి
[ 03-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అని ఊదరగొట్టి ప్రజలను మోసం చేసిన జగన్.. నిత్యం ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే రక్షకభటులకు అరచేతిలో స్వర్గం చూపించాడు. -
ఉన్నాయా కళ్లు.. ఏంచేశారు.. ఐదేళ్లు?
[ 03-05-2024]
నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీల ప్రభుత్వమని సీఎం జగన్ గొప్పలు చెబుతారు. అలాంటి ఆర్భాటపు ముఖ్యమంత్రి నోరు మూయించే చిత్రమిది. -
మడకశిరలో తెదేపాదే విజయం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు నామినేషన్ ఉపసంహరించుకున్నామని, మడకశిర అభ్యర్థి ఎంఎస్ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే ఈరన్న తెలిపారు. -
ప్రచార లోపం.. ఓటెక్కడ వేయాలో గందరగోళం
[ 03-05-2024]
జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం కోసం ఫాం-12 దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు ముగిసింది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 16,150 మంది ఉద్యోగులను నియమించారు. -
వంద పడకలన్నారు.. హామీతో సరిపెట్టారు..
[ 03-05-2024]
ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులను మంచాల కొరత వేధిస్తోంది. ఆసుపత్రిలో రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో ఒకదానిపైనే ఇద్దరు, ముగ్గురికి చికిత్సలు అందించాల్సిన దుస్థితి నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!