logo

వైకాపా ప్రచారానికి వెళ్తున్న కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

వైకాపా ప్రచారానికి వెళ్తున్న ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రామ్‌భూపాల్‌ వివరాల మేరకు.. శెట్టూరు మండలం కనుకూరుకు చెందిన ఓబన్న, భార్య నాగమణి, కోడలు అనురాధ ద్విచక్ర వాహనంలో కళ్యాణదుర్గం వెళుతున్నారు.

Published : 02 May 2024 03:40 IST

గాయపడిన నాగమణి, అనురాధ

శెట్టూరు, న్యూస్‌టుడే: వైకాపా ప్రచారానికి వెళ్తున్న ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రామ్‌భూపాల్‌ వివరాల మేరకు.. శెట్టూరు మండలం కనుకూరుకు చెందిన ఓబన్న, భార్య నాగమణి, కోడలు అనురాధ ద్విచక్ర వాహనంలో కళ్యాణదుర్గం వెళుతున్నారు. అదే సమయంలో శెట్టూరు మండలంలో వైకాపా ప్రచారానికి వస్తున్న ఇన్నోవా వీరి వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని