భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది.
ఉద్యోగుల కొరతతో ఉన్నవారిపైనే అదనపు భారం
రిటైర్మెంట్ వయసులో పని ఒత్తిడి
మెగా డీఎస్సీ విడుదల చేయాలని తిరుపతిలో ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న నిరుద్యోగులు ( పాతచిత్రం)
ఈనాడు డిజిటల్, తిరుపతి: ‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. అయ్యగారు అధికారం చేపట్టి ఐదేళ్లు గడిచినా ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల చావులు చూస్తున్నారు. మరోపైపు పోస్టులు భర్తీ చేయకపోవడంతో అధిక పనిభారం పడుతూ ఉన్న ఉద్యోగులు ఆసుపత్రులపాలవుతున్నారు.
ఖాళీలిన్ని.. మరీ భర్తీలేవీ?
ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచి, వారితో అదనపు పనులు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఖాజానా ఖాళీ కాకుండా ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు చేసే పనులు ఒక్కరే చేయాలని పైస్థాయి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మావల్లకాదు అంటే బెదిరించి పనులు చేయించుకుంటూ పోతున్నారు. జిల్లాలోని తితిదే మొదలుకొని అన్ని విభాగాల్లో సుమారు 22 వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
- ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే జాబ్చార్ట్తో స్పష్టత ఉండేది. నేడు అవేవీ పట్టించుకోవట్లేదు. శాఖల్లో సిబ్బంది కొరత నెలకొనడంతో సమస్యల పరిష్కారం సకాలంలో కనిపించడం లేదు. బోధనలో నిమగ్నం కావాల్సిన ఉపాధ్యాయులకు లెక్కకు మిక్కిలి పనులు అప్పగిస్తున్నారు. పోస్టులు రద్దుచేసి రోజుకొక పాఠశాలకు పంపుతున్నారు. మధ్యాహ్న భోజన వివరాలు, నాడు-నేడు పనుల పర్యవేక్షణ, విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు వేసేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. దానికితోడు నిర్ణీత కాలంలో సిలబస్ పూర్తిచేయాలని ఒత్తిళ్లు. ఎప్పటికప్పుడు మారిపోయే సిలబస్ సరేసరి.
- ఆర్టీసీలో పనిభారంతో సిబ్బంది సతమతమవుతున్నారు. వారి విధులు మరింత కష్టతరమైనవి కాగా సరైన విశ్రాంతి లేకపోవడం, కుటుంబ సమస్యలు, పనిఒత్తిడి, నాణ్యమైన వైద్యం అందకపోవడం, ప్రభుత్వ ప్రయోజనాలు సకాలంలో అందకపోవడం వంటి కారణాలతో గుండెపోటు మరణాలు పెరిగినట్లు ఉద్యోగులు వాపోతున్నారు.
దస్త్రాలు కదలడం లేదు
- బాలాజీ, ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు
జగన్మోహన్రెడ్డి మఖ్యమంత్రి అయిన తరవాత ఖాళీల భర్తీని అటకెక్కించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో చాలావరకు దస్త్రాలు కదలడం లేదు. దాంతో ఇతర ఉద్యోగులపై ఒత్తిడి పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అధిక ఖాళీలు తోడు ప్రభుత్వం చెప్పే నాడు-నేడు, యాప్ల ఆప్లోడ్ వంటి పనులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు.
జీవో 117నే కారణం
- సాంబిరెడ్డి, ఉపాధ్యాయుడు, తిరుపతి
జీవో 117 అమలుతో పాఠశాలల విలీనం చేశారు. అంతకుముందు ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల చేత బోధన జరిగేది. గణితం, సామాన్య, సాంఘిక, హిందీ సబ్జెక్టు నిపుణుల బోధనలో నాణ్యత కనిపించేది. నేడు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులే బోధన చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులు సైతం తగ్గించారు. విద్యార్థుల నిష్పత్తికనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలి.
ఖాళీలు కనిపించడం లేదా?
- జయచంద్ర డీవైఎఫ్ఐ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు
జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో మాట ఇచ్చి, అధికారంలోకి రాగానే మడమ తిప్పారు. ఖాళీలను భర్తీ చేయకుండా యువత ఆశలు విచ్ఛిన్నం చేశారు. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని మాయమాటలు చెప్పారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు తగిన బుద్ధిచెబుతారు. హామీలను నెరవేర్చేవారికే యువత మద్దతు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బలి తీసుకునే పన్నాగం.. ఇంటింటా పంపిణీకి ఎగనామం
[ 01-05-2024]
తనలాంటి మానవతావాది, దయార్ద హృదయుడు లేడని మాటల్లో చెప్పే ముఖ్యమంత్రి జగన్.. ఆచరణలో మాత్రం ఆమడదూరంలో ఉన్నారు. పేదలకు పంపిణీ చేసే పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. -
రాజీనామా చేయాలంటూ వాలంటీర్లకు కౌన్సిలర్ బెదిరింపులు
[ 01-05-2024]
రాజీనామా చేయాలంటూ నలుగురు మహిళా వాలంటీర్లపై కౌన్సిలర్ ఒత్తిడి తీసుకురాగా.. వారు విబేధించారు. దీంతో అతను వచ్చేది మా ప్రభుత్వమే అప్పుడు చూసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. -
సకల జనులకు మేలు.. సూపర్ సిక్స్ పథకాలు
[ 01-05-2024]
సూపర్ సిక్స్ పథకాలతో ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఏన్డీయే కూటమి తాజాగా విడుదల చేసిన మ్యానిఫెస్టో మరింత ఆకర్షణగా నిలిచింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. -
ఆమె ఓటే శాసనం
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు.. పలమనేరు నియోజకవర్గంలో అధిక ఓటర్లు ఉండగా, నగరిలో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. -
వైకాపా.. కుతంత్రాలకు పెట్టింది పేరు
[ 01-05-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాకు భంగపాటు తప్పదని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. విపక్ష తెలుగుదేశానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండటంతో వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
మడమ తిప్పి.. నిండా ముంచేసి
[ 01-05-2024]
జగనన్న మాటలకు.. చేష్టలకు ఆర్టీసీ ఉద్యోగులు నిండా మునిగారు.. ప్రభుత్వంలో విలీనం చేస్తామంటే అందరూ ఆశపడ్డారు.. తమ తలరాతలు మారాయని సంబరపడ్డారు.. తీరా ప్రభుత్వంలో చేరాక అక్కడి ఆదేశాలతో ఉద్యోగుల జీవితాలు చతికిల పడ్డాయి. -
వైకాపాకు ఓటేస్తే మీ భూములు కొట్టేస్తారు
[ 01-05-2024]
ప్రజలు వైకాపాకు ఓటేస్తే మీ భూములే కొట్టేస్తారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. బైరెడ్డిపల్లె మండలం ధర్మపురిలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. -
బాలకృష్ణను కలిసిన తెదేపా నాయకులు
[ 01-05-2024]
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిత్తూరు నుంచి ఒంగోలు పర్యటన నిమిత్తం మంగళవారం బయలుదేరి వెళ్లారు. -
బాధితులను పరామర్శించిన చల్లాబాబు
[ 01-05-2024]
చౌడేపల్లెలో జరిగిన దాడి సంఘటనలో సబ్జైల్లో ఉన్న తెదేపా మండల అధ్యక్షుడు రమేశ్రెడ్డి, మంజునాథరెడ్డి, మణికంఠ, సునీల్కుమార్, ఆదిశేషులను పుంగనూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు పరామర్శించారు. -
జగన్.. అవ్వాతాతలను ఏడి‘పింఛెన్’
[ 01-05-2024]
ప్రతి నెలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వివిధ రకాల పింఛన్ల లబ్ధిదారులు ఈసారి టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం అయిన వారికి మాత్రమే బ్యాంకుల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. -
రాజీనామా చేసి.. ప్రచారంలో తిరగాల్సిందే
[ 01-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్నకొద్దీ వాలంటీర్లపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. రాజీనామా చేసి.. పార్టీ ప్రచారంలో భాగస్వాములు కావటంతో పాటు పోలింగ్ రోజున దగ్గరుండి ఓట్లు వేయించాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి వాలంటీర్లకు హుకుం జారీ చేశారు. -
రాజీనామా చేసిన వాలంటీర్లకు వైకాపా తాయిలాలు
[ 01-05-2024]
కుప్పం నియోజకవర్గ పరిధి నాలుగు మండలాల్లో రాజీనామా చేసిన వాలంటీర్లకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ సోమ, మంగళవారాల్లో ఒక్కో వాలంటీరుకు రూ.5 వేల చొప్పున అందించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య