ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు.
పెరవలి మండలం ఖండవల్లిలో నేలకొరిగిన అరటితోటలు
ఉండ్రాజవరం, పెరవలి, న్యూస్టుడే: ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని లంకభూముల్లో సారవంతమైన నేలల్లో వీటిని పండిస్తారు. సుమారు 30 వేల ఎకరాల్లో కూర అరటి, కర్పూర, చక్కెరకేళీ, బొంత, అమృతపాణి తదితర రకాలు సాగవుతున్నాయి. ఈదురుగాలులు, వర్షాలకు గెలలు పడిపోవడం, చెట్లు వాలిపోవడంతో రైతులను నష్టాల భయం వెంటాడుతోంది. ఎకరానికి సుమారు 750 పిలకలు (విత్తనం) నాటితే 10 నెలలకు పంట వస్తుంది. ఇందుకోసం ఎకరానికి రూ.90 వేలు అవుతుంది. చెట్లు పడిపోకుండా వెదురు కడతారు. చెట్టుకు రూ.120 చొప్పున ఖర్చు చేస్తారు. మొత్తంగా ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. గెల ఒక్కదానికి రూ.130 పెట్టుబడి అవుతోంది. ప్రస్తుతం టోకు ధర రూ.100 నుంచి రూ.110గా ఉంది. ఓపక్క సరైన ధర లేకపోవడం, మరోపక్క చెట్లు పడిపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.
రూ.3 లక్షలు పెట్టాను..
రెండు ఎకరాల్లో కర్పూర అరటి సాగు చేస్తున్నా. రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. సరిగ్గా నెలరోజులు దాటితే పంట చేతికొచ్చేది. ఇంతలో ఈదురుగాలులు రావడంతో చెట్లు పడిపోయాయి. ఏం చేయాలో తెలియట్లేదు.
భూపతిరాజు వెంకటసూర్యనారాయణరాజు, ఖండవల్లి
తీవ్రనష్టం
రెండు ఎకరాల్లో కూర అరటి పండిస్తున్నా. వారంలో గెలలు దించుదామని అనుకున్నాం. ఇంతలో వర్షానికి పంట దెబ్బతింది. ఇప్పుడు పెట్టుబడి కూడా వస్తుందో రాదో తెలియదు.
కరుటూరి సుబ్బారావు, తీపర్రు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్ విజయం కోరుతూ.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి
[ 01-06-2024]
ఎన్నికల్లో పవన్కల్యాణ్ గెలవాలని కోరుతూ తూర్పుగోదావరికి చెందిన ఓ యువతి మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి స్థానికంగా ఆర్ఎంపీ వైద్యం చేస్తుంటారు. -
ఏ కాలువ చూసినా మేటలు.. మైదానాలే
[ 01-06-2024]
రైతుల కష్టాలు పట్టించుకున్నది లేదు.. సాగునీటి పారుదల వ్యవస్థ నిర్వహణపై ప్రణాళిక లేదు.. నిధులు విదిల్చిందీ లేదు.. వైకాపా ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఇది. రబీ పూర్తయిన తరువాత లాకులు, స్లూయిస్లు, ఇతర నిర్మాణాల నిర్వహణతో పాటు కాలువల్లో పూడికతీత చేపట్టాల్సి ఉన్నా విస్మరించింది. -
పింఛను సొమ్ముకు యాతన పడాల్సిందే..
[ 01-06-2024]
పింఛను కోసం ఈసారీ లబ్ధిదారులు అవస్థలు పడాల్సిన పరిస్థితే. అసలే రోహిణీ కార్తె.. ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఉండగా.. ఇలాంటి తరుణంలో బ్యాంకుల వరకు వెళ్లి పింఛను డబ్బుల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం మళ్లీ కల్పించింది. -
నిన్న కందిపప్పు.. నేడు గోధుమ పిండి
[ 01-06-2024]
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై అందించే నిత్యావసర సరకులను కుదించుకుంటూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత నెలకు గోధుమ పిండిలోనూ కోత పెట్టింది. రేషన్లో ఇచ్చేది నాలుగు రకాల సరకులే అయినప్పటికీ వాటిలో బియ్యం మినహా మిగతావి అరకొరగానే సరఫరా చేస్తూ వచ్చింది. -
ఫలితం.. ఉత్కంఠభరితం
[ 01-06-2024]
ఓటరు తీర్పు వెల్లడయ్యే రోజు సమీపిస్తోంది.. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులతోపాటు.. ఓటేసినవారిలో సైతం ఉత్కంఠ నెలకొంది. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. ఈనెల 4న ఓట్ల లెక్కింపు- ఫలితాల వెల్లడి ప్రక్రియ చేపట్టనున్న విషయం తెలిసిందే. -
నాణ్యతకు నీళ్లొదిలేశారు..
[ 01-06-2024]
నాసిరకం నీటిని విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నిర్వాహకులపై ఎట్టకేలకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఉమ్మడి జిల్లాలో ప్రమాణాలకు తిలోదకాలిస్తూ జోరుగా నీటి వ్యాపారం సాగిస్తున్న వైనంపై మే 27న ‘ఊరూవాడ జలమాఫియా’ శీర్షికన ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. -
విద్యుత్తు కోతలపై కదం తొక్కిన జనం
[ 01-06-2024]
ఓ పక్క భానుడి భగభగలతో జనం అల్లాడుతుంటే మరోపక్క విద్యుత్తు కోతలతో విలవిల్లాడుతున్నారు. విద్యుత్తు కోతలపై జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రజలు కదం తొక్కారు. వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలంలో చాలా గ్రామాలకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరఫరా నిలిచిపోయింది. -
మండుటెండకు మరెందరు బలికావాలో..?
[ 01-06-2024]
ప్రతి నెలా ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా.. పింఛను డబ్బుతో మందులు, నిత్యావసరాలు కొనుక్కోవాలని ఆశగా ఎదురుచూసే పండుటాకులకు ఈ నెల కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. సామాజిక భద్రతా పింఛను డబ్బులు తీసుకునేందుకు రెండు నెలలుగా లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
చౌకబారు మాటలు.. పేదల కడుపుమాడ్చే చేతలు
[ 01-06-2024]
పేదల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని గొప్పలు చెప్పుకొన్న జగన్మోహన్రెడ్డి సర్కారు పేదలకు అందించే నిత్యావసరాల్లో కోతలు విధిస్తూ వారిపై ఆర్థిక భారం మోపింది. -
పొగాకు వినియోగం క్యాన్సర్కు కారకం
[ 01-06-2024]
ఏటా క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారిలో 25 శాతం మంది పొగాకు వినియోగదారులే ఉంటున్నారని డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి తెలిపారు. శుక్రవారం అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పొగాకు వినియోగ వ్యతిరేక దినం నిర్వహించారు. -
గోధుమపిండికి ఎగనామం
[ 01-06-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల పాలన ముగింపు దశకు వచ్చినా రేషన్ సరకుల పంపిణీలో కోతలు విధిస్తూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో చౌక దుకాణాల ద్వారా 14 సరకులను పంపిణీ చేయగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక మూడు సరకులకే పరిమితం చేశారు. -
నిప్పులుచెరిగే ఎండలో బ్యాంకులకు వెళ్లాల్సిందే..!
[ 01-06-2024]
రోహిణ కార్తెతో ఎండలు మండుతున్నాయి. కాకినాడ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్న సమయాల్లో వృద్ధులు, నడివయస్కులు, దివ్యాంగులు పింఛను కోసం ఇంటి నుంచి బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. -
తెలుగుతల్లి.. తల్లడిల్లి..
[ 01-06-2024]
పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. మహామహులకు విద్యనందించిన ఈ సాహిత్య పీఠం ఉనికిని కాపాడుకోవడానికి నానాపాట్లు పడుతోంది. -
ఉష్.. ఉక్కిరిబిక్కిరి
[ 01-06-2024]
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కబోతతో ప్రజల ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి 7 దాటినా వేడి గాలులు వీస్తునే ఉన్నాయి. చిన్నారులు, వృద్ధులతోపాటు బయట తిరిగేవారు డీహైడ్రేషన్, వడదెబ్బకు గురై అనారోగ్యం బారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో 10వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్రాజ్
-
ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన యూనియన్ బ్యాంక్.. లేటెస్ట్ రేట్లు ఇవే..
-
గంభీర్ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్ చేయగలడు: గంగూలీ
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ