ఇక లారీలన్నీ పట్టణానికి వెలుపలే...
జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులో ఇక రోడ్ల వారగా భారీ వాహనాల నిలిపివేత సమస్య వైదొలగనుంది. ఈ పరిణామం వచ్చి పోయే వాహనదారులకు, పట్టణ వాసులకు ఎంతో ఊరట నిచ్చే అంశం..
తగ్గనున్న ట్రాఫిక్ సమస్య ● పార్కింగ్కు 12 ఎకరాల స్థలం కేటాయింపు
న్యూస్టుడే, తాండూరు
తాండూరులో ప్రధాన రహదారి వారగా నిలిచిన వాహనాలు
జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులో ఇక రోడ్ల వారగా భారీ వాహనాల నిలిపివేత సమస్య వైదొలగనుంది. ఈ పరిణామం వచ్చి పోయే వాహనదారులకు, పట్టణ వాసులకు ఎంతో ఊరట నిచ్చే అంశం.. స్థానికంగా అవసరాలకు తగ్గట్టు లారీ పార్కింగ్ లేక పోవడంతో వివిధ రాష్ట్రాల నుంచి తాండూరుకు వచ్చి పోయే వాహనాలను చోదకులు ప్రధాన రహదారులకు ఇరు వైపులా నిలిపివేస్తున్నారు. దీంతో ఎదురు నుంచి వేగంగా వస్తున్న వాహనాలను నిలిచి ఉన్న వాహనాలను ఢీకొట్టడంతో చాలా మంది గాయపడుతున్నారు. కొందరైతే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం పట్టణానికి వెలుపల 12 ఎకరాల్లో ‘లారీ పార్కింగ్’ ఏర్పాటు చేయడానికి నిర్ణయించి స్థలాన్ని కేటాయించింది. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
రద్దీ ఎందుకంటే..
తాండూరు పట్టణానికి సమీపంలోనే ఐదు సిమెంటు కర్మాగారాలు, వందల కొద్దీ నాపరాళ్లు, సుద్ద, లేటరైట్ గనులున్నాయి. 800కు పైగా నాపరాళ్ల పరిశ్రమలు ఉన్నాయి. సిమెంటు కర్మాగారాలకు ముడిసరకు లారీల్లోనే వస్తుంది. ఉత్పత్తులు కూడా వివిధ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు తరలుతాయి. అలాగే ముడి నాపరాయి, నునుపు నాపరాయి దేశంలోని వివిధ రాష్ట్రాలకు నిత్యం వందల కొద్దీ లారీల్లో ఎగుమతి జరుగుతోంది. గుజరాత్, కాకినాడకు సుద్ద ఎగుమతి సాగుతోంది. వీటికి తోడు ముంబయి, బెంగళూరు జాతీయ రహదారులకు తాండూరు పట్టణం కూడలిగా ఉంది.
* అన్ని రకాల భారీ వాహనాలు కలిపి నిత్యం 5000కు పైగా తాండూరు పట్టణం మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. భారీ వాహనాలను చోదకులు ప్రధాన రహదారుల వారగా నిలువరిస్తున్నారు. తాండూరు-సంగారెడ్డి, తాండూరు- కొడంగల్, తాండూరు- చించోళి, తాండూరు-హైదరాబాద్, తాండూరు-కరణ్కోట వంటి ప్రధాన రహదారులకు ఇరువైపులా వందల కొద్దీ వాహనాలు ఆగుతున్నాయి. అన్ని వాహనాలను నిలపడానికి పట్టణంలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం సరి పోవడం లేదు. దీంతో చేసేది లేక చోదకులు ఎక్కడబడితే అక్కడే ఆపుతున్నారు. ఫలితంగా రహదారులు కుచించుకు పోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిస్థితిని చక్క దిద్దడానికి పట్టణానికి దూరంగా ప్రభుత్వం 12 ఎకరాల్లో లారీ పార్కింగ్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఆమేరకు తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 58లోని 15 ఎకరాల్లో 12 ఎకరాలను కేటాయించింది. ఎకరాకు రూ.25 లక్షల చొప్పున రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ చెల్లించనుంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో లారీ పార్కింగ్ ఏర్పాటైతే ప్రధాన రహదారుల వారగా నిలిపే వాహనాల రద్దీ తగ్గిపోయి వచ్చి పోయే వాహనాల రాకపోకలు సౌకర్యంగా జరుగుతాయి. ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి.
ఆటో నగర్ అక్కడే
లారీ పార్కింగ్ ఏర్పాటు చేసే స్థలానికి సమీపంలోనే 3 ఎకరాలను ప్రభుత్వం ఆటో నగర్కు కేటాయించింది. దీంతో పట్టణంలో ఉన్న వాహనాల మరమ్మతు కేంద్రాలు, విడి భాగాల విక్రయ దుకాణాలు అక్కడికే తరలుతాయి. ఈ పరిణామంతో పట్టణంలో నిలిచే వాహనాల రద్దీ మరింత తగ్గుతుంది. ప్రస్తుతం పట్టణంలోని వివిధ రకాల వాహనాల మరమ్మతు కేంద్రాలు, విడి భాగాల దుకాణాల వద్ద అడ్డదిడ్డంగా వానాలు ఆగుతున్నాయి. ఇది ఒకరకంగా ఇబ్బందిగా ఉంటోంది. ఆటోనగర్ ఏర్పాటుతో విడిభాగాల విక్రయ దుకాణాలు కూడా అక్కడికే తరలుతాయి. వాహనాలు నిలిచే పరిస్థితి ఉండదు కాబట్టి ఇన్నాళ్లుగా ఎదుర్కొన్న సమస్య పరిష్కారమౌతుంది. కాలుష్యం కూడా తగ్గుతుందని స్థానికులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు