5 హత్యలు.. ఆరుగురికి కత్తిపోట్లు.. వణికిన రాజధాని
మహానగరం బుధవారం వరుస హత్యలతో వణికిపోయింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. కేవలం 15 గంటల వ్యవధిలో అయిదు హత్యలు, ఆరుగురికి కత్తిపోట్ల ఘటనలు కలకలం సృష్టించాయి.
ఒకేరోజు 15 గంటల వ్యవధిలో వేర్వేరు ఘటనలు
న్యూస్టుడే, కార్వాన్, కాటేదాన్, చాదర్ఘాట్
మహానగరం బుధవారం వరుస హత్యలతో వణికిపోయింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. కేవలం 15 గంటల వ్యవధిలో అయిదు హత్యలు, ఆరుగురికి కత్తిపోట్ల ఘటనలు కలకలం సృష్టించాయి. శాంతిభద్రతల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండే గ్రేటర్ పోలీసులకు సవాల్ విసిరాయి. హత్యకు గురైన వారిలో ఇద్దరేసి హిజ్రాలు, వలస జీవులు, ఒకరు ఆటోడ్రైవర్ ఉన్నారు. పెళ్లికి నిరాకరించినందుకు నార్సింగిలో పల్నాడుకు చెందిన ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ సమీపంలో మందుబాబుల వీరంగంతో అయిదుగురు కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బైక్పై వచ్చి కత్తితో పొడిచి..
మీర్చౌక్ కాలికబర్ ప్రాంతానికి చెందిన యూసుఫ్(30) ఆటో డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన అక్రమ్ కారు డ్రైవింగ్ స్కూల్ నడిపిస్తున్నాడు. వీరు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం యూసుఫ్ మీర్చౌక్ నుంచి ఆజంపురా వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఫిర్దౌస్ హోటల్ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనంపై వచ్చిన అక్రమ్(30) అతని స్నేహితుడు సోహెబ్(30) యూసుఫ్ను కత్తితో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిపుణుల బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో అక్రమ్కు, యూసుఫ్ భార్యకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న యూసుఫ్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారమే హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రేమను తిరస్కరించిందని..
పుప్పాలగూడలో ప్రేమోన్మాది ఘాతుకం
గణేశ్
నార్సింగి, న్యూస్టుడే: తన ప్రేమను ఒప్పుకోమని కొన్నేళ్లుగా వెంటపడుతున్నాడు. ఆమె తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో చోటు చేసుకుంది. నార్సింగి ఎస్సై అనిల్కుమార్ వివరాల ప్రకారం.. ఏపీ పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యువతి(22) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. గుంటూరు జిల్లా చిలుకలూరిపేటకు చెందిన ఆమె బంధువు కొత్త గణేశ్(27) జొమాటోలో డెలివరీ బోయ్గా పనిచేస్తూ గచ్చిబౌలి ఇందిరానగర్ రోడ్డు నెం.2లోని హాస్టల్లో ఉంటున్నాడు. గణేశ్ పదేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నా ఆమె తిరస్కరిస్తోంది. యువతి తల్లిదండ్రులు కూడా పెళ్లికి నిరాకరించారు. ఆమె మనసులో వేరే ఎవరో ఉండటం వల్లే తనను వద్దంటోందని భావించి అనుమానం, పగ పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి మొక్కలు నరికే కత్తిని బ్యాగులో పెట్టుకుని యువతి ఉంటున్న హాస్టల్కు వచ్చాడు. మాట్లాడాలంటూ ఆమెను బైక్పై ఎక్కించుకుని టిగ్రిల్ హోటల్ వెనక్కి తీసుకెళ్లాడు. అక్కడ వాగ్వాదం జరగడంతో కత్తిని ఆమె గొంతుపై పెట్టి బెదిరించాడు. అడ్డుకునే యత్నంలో ఆమె చెంప, గొంతు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే గణేశ్ డయల్ 100కు ఫోన్ చేసి తెలపడంతో గచ్చిబౌలి ప్యాట్రోలింగ్ పోలీసులు వచ్చి నార్సింగి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి బాధితురాలిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి, నిందితుడిని పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి రిమాండ్కు తరలించారు. యువతికి ప్రాణాపాయం లేదన్నారు.
బండరాయితో మోది..
హత్యకు గురైన ప్రకాష్, మతి స్థిమితంలేని వ్యక్తి
రంగారెడ్డి జిల్లా కాటేదాన్ మైలార్దేవుపల్లి ఠాణా పరిధిలో ఇద్దరు హత్యకు గురయ్యారు. గంజాయి మత్తులో ఉన్న ఉన్మాది దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మైలార్దేవుపల్లి ఇన్స్పెక్టర్ మధు కథనం ప్రకారం. మత్తులో తూలుతూ గుర్తుతెలియని వ్యక్తి(35) పాత కర్నూలు రహదారి నుంచి దుర్గానగర్ చౌరస్తాకు చేరుకున్నాడు. అదే ప్రాంతంలోని రంగుల దుకాణం వద్ద మధ్యప్రదేశ్కు చెందిన ప్రకాష్(50) పగలంతా దుప్పట్లు అమ్ముకుని రాత్రిపూట ఫుట్పాత్పై నిద్రపోతుంటాడు. అక్కడికెళ్లిన నిందితుడు అరగంట సేపు అతని పక్కనే నిద్రపోతున్నట్లు నటించాడు. ప్రకాష్ను నిద్రలేపి డబ్బు ఇవ్వమంటూ బెదిరించాడు. పిచ్చివాడిగా భావించిన అతడు కొంత డబ్బు ఇచ్చి తిరిగి నిద్రపోయాడు. ఇంకా డబ్బులున్నాయని భావించి బండరాయితో తలపై మోదాడు. అతడు మరణించినట్టు గుర్తించాక డబ్బు తీసుకొని పారిపోయాడు. అదే అగంతకుడు కాటేదాన్ స్వప్న టాకీస్ పక్కనే ఫుట్పాత్పై నిద్రిస్తున్న మతిస్థిమితంలేని వ్యక్తి(40)ని ఇదే తరహాలో హతమార్చాడు. మృతుడు చాలాకాలం క్రితం వలస వచ్చాడని మతిస్థిమితం లేకున్నా చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. భిక్షాటన చేసేవారిని నిందితుడు బెదిరిస్తూ డబ్బులు గుంజుకుంటాడని స్థానికులు పేర్కొన్నారు.
ఇద్దరు హిజ్రాలు...
టప్పాచబుత్రలోని కిషన్నగర్ ప్రాంతానికి చెందిన ట్రాన్స్జెండర్లు రియాజ్ అలియాస్ సోఫియా (25), యూసుఫ్ అలియాస్ డాలీ(24) స్నేహితులు. మెహబూబ్కాలనీలో నివసించే సయ్యద్ హినాయత్ (25), ఎండీ హినాయత్(24)లతో పరిచయాలున్నాయి. వీరిద్దరు గృహోపకరణాల దుకాణంలో పనిచేస్తున్నారు. సయ్యద్ హినాయత్, డాలీ ప్రేమికులు. రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అతడి బలహీనతను ఆసరా చేసుకున్న డాలీ తరచూ డబ్బులు డిమాండ్ చేసేది. కొద్దికాలంగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తీసుకురావటంతో హినాయత్ భరించలేకపోయాడు. ఇంట్లో ఒప్పుకోరంటూ చెప్పేశాడు. అప్పటి నుంచి వేధింపులు ఎక్కువ కావటంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే పథకం వేశాడు. మంగళవారం రాత్రి ఇద్దరు హిజ్రాలను దాయిబాబ్ వద్దకు రప్పించారు. నలుగురూ కలిసి అక్కడే మద్యం తాగారు. బుధవారం తెల్లవారుజామున హిజ్రాలతో గొడవ మొదలైంది. కత్తులతో హిజ్రాలపై దాడి చేశారు. రక్తపు మడుగులో పడిపోయిన వారిపై బండరాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హిజ్రాలు మృతి చెందారు. సౌత్ వెస్ట్ డీసీపీ కిరణ్కరే, ఏసీపీ సతీష్కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.