ఎత్తుకు పైఎత్తు.. ప్రచారానికి కసరత్తు
రాజధాని పరిధిలోని నాలుగు లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించాయి. సభలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నాయి.
ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీల కార్యాచరణ
రాజధాని పరిధిలోని నాలుగు లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించాయి. సభలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ కంటోన్మెంట్ అభ్యర్థితోపాటు మూడు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. హైదరాబాద్ స్థానానికి ఆ పార్టీ నగర అధ్యక్షుడు సమీర్వాలీ ఉల్లాను అభ్యర్థిగా ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించింది. భారాస నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కంటోన్మెంట్ శాసనసభ అభ్యర్థిగా దివంగత నేత సాయన్న కుమార్తె నివేదితను బుధవారం ప్రకటించింది. భాజపా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా కంటోన్మెంట్ అభ్యర్థిగా ఎవరనేది ఇంకా తేల్చలేదు.
సభల ఏర్పాటుతో కాంగ్రెస్ దూకుడు
తుక్కుగూడ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆ స్థాయిలో కాకపోయినా అన్ని లోక్సభ స్థానాల పరిధిలో వచ్చే 20 రోజుల్లో భారీ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. పోలింగ్కు ముందు కంటోన్మెంట్లోనూ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా అనుకున్నారు. ఇప్పటివరకు లోక్సభ నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించింది. సీఎం రేవంత్రెడ్డి కూడా ప్రతి లోక్సభకు సంబంధించిన నేతలతో ప్రత్యేకంగా సమావేశమై గెలుపు కోసం దిశానిర్దేశం చేశారు. చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. బల్దియా పరిధిలోనే కొంత చేరికలు తక్కువగా ఉన్నాయి. మేయర్ విజయలక్ష్మి మాత్రం హస్తం గూటికి చేరుకున్నారు. ఇప్పుడు చేరికలపై కాంగ్రెస్ అగ్రనేతలు దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున ప్రచారాన్ని మొదలు పెట్టలేదని శ్రేణుల్లో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఈ నెల 15 నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయించారు.
చేవెళ్ల సభపైనే భారాస దృష్టి
ఈ నెల 13న చేవెళ్లలో భారీ సభను నిర్వహించడానికి భారాస ప్రణాళికను రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ తక్కుగూడలో నిర్వహించిన సభ కంటే భారీ స్థాయిలో నిర్వహించి గ్రేటర్ పార్టీలో నూతనోత్సాహాన్ని తీసుకురావాలని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. కేటీఆర్, హరీష్రావుతోపాటు మరికొంతమంది నేతలు జనసేకరణపై దృష్టిసారించారు. దీని తరువాత శాసనసభ నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. గ్రేటర్లో 19 చోట్ల భారాసకు ఎమ్మెల్యేలున్నారు. వీరంతా ఆశించిన స్థాయిలో ప్రచారం పర్వంలో దిగలేదు. చేవెళ్ల సభ తరువాత నియోజకవర్గాల వారీగా మినీ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్లో విజయాన్ని చేకూర్చే బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు.
ఇంటింటి ప్రచారానికి భాజపా
భారీ సభలను నిర్వహించడం కంటే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తే ఫలితం ఉంటుందన్న భావనలో భాజపా ఉంది. ఒక సభను నిర్వహించాలంటే కనీసం రెండు మూడు రోజులు కీలకమైన నేతలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికంటే కాలనీల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెబుతున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మూడు నాలుగు చోట్ల మరో పది రోజుల తరువాత సభలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ రంజాన్ తరువాత వచ్చే సోమవారం నుంచి హైదరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా తమ ఎమ్మెల్యేకు దిశానిర్దేశం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.