పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు
వర్షాకాలంలో దోమలతో మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. దీనికి కారణం పారిశుద్ధ్యం లోపించడం, తాగునీరు కలుషితం కావడం.
‘న్యూస్టుడే’తో డీపీవో దేవరాజ్
న్యూస్టుడే, జగిత్యాల గ్రామీణం
వర్షాకాలంలో దోమలతో మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. దీనికి కారణం పారిశుద్ధ్యం లోపించడం, తాగునీరు కలుషితం కావడం. వర్షాకాలంలో వైద్యశాఖతో పాటు పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకుని పారిశుద్ధ్యం లోపించకుండా, తాగునీరు కలుషితం కాకుండా చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు? పారిశుద్ధ్య నిర్వహణ, శుభ్రమైన తాగునీరు అందించే చర్యలపై జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. ఆ వివరాలు..
ప్రశ్న: జిల్లాలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు.?
జవాబు: జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా 1670 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామానికో పంచాయతీ కార్యదర్శి ఉండగా ఎన్నికలు ముగియటంతో సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు రహదారులు, మురుగు కాలువల శుభ్రం చేస్తున్నాం. బ్లీచింగ్ పౌడర్ చల్లటం, దోమల నివారణకు బైటిక్స్ పించికారీ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ సూచన మేరకు వైద్యఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని వైద్యశిబిరాలు నిర్వహిస్తాం.
ప్ర: పైపులైన్ల లీకేజీతో తాగునీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతుంటారు.?
జ: జిల్లాలో తాగునీటి ట్యాంకులను నెలలో 1, 11, 21 తేదీల్లో శుభ్రం చేయిస్తున్నాం. ట్యాంక్లోకి వస్తున్న మిషన్ భగీరథ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలిపి సరఫరా చేస్తున్నాం. తాగునీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారా లేదా అనేది నిత్యం మానిటరింగ్ చేస్తున్నాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలు ఉంటే సరి చేశాం. ఇంకా ఎక్కడైనా లీకేజీలు ఉంటే సరిచేస్తాం. తాగునీటి ట్యాంకు దగ్గర నీరు నిల్వకుండా, పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉండేలా చూస్తాం. రహదారులపై గుంతలు లేకుండా పూడ్చి శుభ్రత పాటించాలని ఆదేశాలు జారీ చేశాం.
ప్ర: గ్రామాల్లో దోమలు స్వెరవిహారం చేస్తున్నాయి.?
జ: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి వీధిలోనూ దోమల నివారణ మందును పిచికారీ చేస్తున్నాం. పిచ్చి మొక్కలు తొలగించి వీధులను శుభ్రంగా ఉంచుతున్నాం. మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నాం.
ప్ర: సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారా.?
జ: సీజనల్ వ్యాధులపై వైద్యఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఏఎన్ఎంలతో ఇంటింటి సర్వే చేపట్టి సమస్య రాకుండా చూస్తాం.
ప్ర: వేసవిలో మొక్కల రక్షణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?
జ: వేసవిలో మొక్కలు ఎండి పోకుండా ట్యాంకర్ల ద్వారా నీళ్లు పట్టిస్తున్నాం. 380 పంచాయతీలకు పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టాం. మొత్తం 22 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కలు నాటుతాం. అవెన్యూ ప్లాంటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాం. వర్షాలు పడగానే మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు హనుమాన్ జయంతి.. కాషాయమయంగా కొండగట్టు
[ 01-06-2024]
నేడు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో కొండగట్టు క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రామనామజపంతో కాషాయమయమైంది. -
మది నిండుగ.. దశాబ్ది పండుగ!
[ 01-06-2024]
దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయింది.. ఆదివారం పదకొండో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబవుతోంది. ఇన్నేళ్ల ఘన కీర్తిని.. ఉద్యమ ఖ్యాతిని గుర్తు చేసుకుంటూనే భవిష్యత్తు దిశగా పడే అడుగులపై ఉమ్మడి జిల్లావాసుల్లో ఆశలు పెరుగుతున్నాయి.. -
కాషాయ వర్ణం.. కొండగట్టు
[ 01-06-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలు కాషాయ శోభను సంతరించుకుంటున్నాయి. వివిధ జిల్లాల నుంచి దీక్షాపరులు పాదాలకు వస్త్రాలు చుట్టుకుని, హనుమాన్ జెండాను చేతపట్టుకుని పాదయాత్రగా ‘రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్కీ’ అంటూ ఘాట్రోడ్డు, మెట్లదారిన కొండపైకి చేరుకున్నారు. -
116 టేబుళ్లు.. 153 రౌండ్లు
[ 01-06-2024]
కరీంనగర్ లోక్సభ స్థానానికి సంబంధించి ఈనెల 4న ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
ఉత్తమ ఫలితాలు.. మౌలిక వసతులు
[ 01-06-2024]
పక్కా భవనాలు.. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా బోధన, ఉత్తమ ఫలితాలు ఉన్నాయంటూ అధ్యాపకులు ఇంటింటి ప్రచారం చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఆయా కళాశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు మే 9 నుంచి ఇంటర్ విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. -
ముంపు ముప్పు తప్పేనా?
[ 01-06-2024]
వర్షం కురిస్తే చాలు సిరిసిల్ల పురపాలక సంఘంలోని లోతట్టు కాలనీలు జలమయం కావడం, ప్రధాన రహదారులపైకి, ఇళ్లలోకి నీరు చేరడం సర్వసాధారణంగా మారింది. పట్టణం చుట్టూ ఉన్న చెరువుల శిఖం ఆక్రమణలతో వాటిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. -
అతివల ఆర్థిక అభ్యున్నతికి అండ
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి రుణాలు అండగా నిలుస్తున్నాయి. అత్యవసర వేళల్లో తోడ్పాటునందిస్తున్నాయి. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి లేకుండా చిరు వ్యాపారాల నిర్వహణతో ఆర్థిక బలోపేతం వైపు అడుగులు పడేలా సహకరిస్తున్నాయి. -
సుల్తానాబాద్లో లారీ బీభత్సం
[ 01-06-2024]
డ్రైవర్ మద్యం మత్తుతో శుక్రవారం సుల్తానాబాద్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. -
67 గోవులు, ఎద్దుల పట్టివేత
[ 01-06-2024]
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వాహనాల్లో తరలిస్తున్న 67 గోవులు, ఎద్దులను పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ టోల్ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. -
వడదెబ్బతో నలుగురి మృతి
[ 01-06-2024]
ఎండలు మండిపోతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు నలుగురు మృత్యువాత పడటం విషాదం నింపింది. -
47.1 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాలో భానుడిప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 47.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా ముత్తారంలో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం
-
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
-
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవచ్చు : కాంగ్రెస్ వర్గాలు
-
ధోనీ స్క్వాడ్ అలా.. రోహిత్ సేన ఇలా..
-
పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు