పరిశ్రమలతో ప్రగతి!
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్వశక్తి సంఘాలకు రుణ లక్ష్యం ఖరారు
అంతర్గాం మండలం గోలివాడ సమావేశంలో పాల్గొన్న మహిళలు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు సంఘ సభ్యులందరికి కలిసి రుణాలు ఇస్తుండగా కొందరు మహిళలు ఖర్చు చేసే విధానంతో వారు పూర్తిస్థాయి లాభాన్ని పొందలేకపోతున్నారు. ఫలితంగా ఆశించిన ఆర్థికాభ్యున్నతి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఒక్కో సభ్యురాలికి వ్యక్తిగతంగా చిన్నతరహా పరిశ్రమలతో లబ్ధి చేకూరేవిధంగా ప్రోత్సహించాలని సంకల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ లక్ష్యం ఖరారైంది. ఈ సారి తొలిసారిగా ఔత్సాహిక పరిశ్రమలను స్థాపించేందుకు రుణాలు కేటాయించారు.
40,664 సంఘాలు..రూ. 2,548.84 కోట్లు
స్వశక్తి సంఘాల్లోని మహిళల కిరాణం, కంగన్హాల్, వస్త్ర దుకాణాలు, పిండి గిర్ని, బేకరి, విస్తారాకుల తయారీ, వస్త్ర, జనపనార, పుట్టగొడుగులు తయారీ, వ్యవసాయం, పిల్లల చదువులు, కుటీర పరిశ్రమలు నెలకొల్పుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. పొదుపు ఆధారంగా ఒక్కో సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల రుణం మంజూరు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,664 స్వశక్తి సంఘాలకు రూ.2,548.84 కోట్లు లక్ష్యం విధించారు. గతేడాది 36,996 సంఘాలకు రూ.2,116.85 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. గతేడాది కంటే రుణ లక్ష్యం పెరిగింది. ఈ ఏడాది లక్ష్యాలను చేరుకునేందుకు ఆరంభం నుంచి ప్రణాళిక రూపొందిస్తున్నారు. గ్రామ స్థాయిలోని సీఏ మొదలుకొని సీసీలు, ఏపీపీఎం, డీపీఎంలతో పాటు జిల్లా అధికారులు పర్యవేక్షించనున్నారు.
ఔత్సాహిక మహిళలకు ప్రోత్సాహం
బ్యాంకు రుణాలతో మరింత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ ఏడాది వ్యక్తిగత రుణాలకు ప్రాధాన్యం కల్పించారు. జాతీయ జీవనోపాధుల మిషన్లో భాగంగా మహిళలను సొంతంగా చిన్నతరహా పరిశ్రమలు స్థాపించేందుకు ఈసారి ‘ఎంటర్ప్రైజెస్’ రుణాలను అందిస్తున్నారు. ఈ రుణాలతో కొత్తగా పరిశ్రమలు స్థాపించడం, ఒకవేళ ఇప్పటికే ఏదైనా ఒక పరిశ్రమ ఉన్నట్లైతే మరింతగా ఆధునికీకరించేందుకు ప్రోత్సహించనున్నారు. ఒక్కొక్కరికి రూ.5-10 లక్షలలోపు రుణం పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా 31,141 మహిళలకు రూ.622.78 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బల్దియా అక్రమాలపై నజర్
[ 17-06-2024]
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యకలాపాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల అభివృద్ధి పనులు, పట్టణ ప్రణాళికపై వరుస ఫిర్యాదులు వస్తుండటంతో ఆ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. -
ఆడపిల్లలపై వీడని వివక్ష
[ 17-06-2024]
జిల్లాలో బాలికల సంఖ్య తగ్గుతోంది. ఆడపిల్ల అంటేనే కొందరు తల్లిదండ్రులు నిరాసక్తత చూపడంతో వారి సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. -
సిబ్బంది కొరత.. శిథిల భవనం
[ 17-06-2024]
గంగాధరలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమస్యలు వేధిస్తున్నాయి. సరిపడా సిబ్బంది లేక.. శిథిల భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కనీస వసతులు లేక కార్యాలయానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఆలయ మాన్యాలకు శఠగోపం
[ 17-06-2024]
దేవుడి మాన్యాలకూ రక్షణ కరవైంది. రూ.కోట్ల ఆస్తులున్నప్పటికీ ఆదాయం లేక ఆలయాల నిర్వహణ భారంగా మారింది. -
పేద విద్యార్థుల ప్రతిభకు పట్టం
[ 17-06-2024]
వారంతా పేద విద్యార్థులు.. అయినా వారిలో ప్రతిభకు కొదవలేదు. చదివేది ప్రభుత్వ పాఠశాలలోనైనా పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని జాతీయ ప్రతిభ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. -
సాగులో సస్యరక్షణ చర్యలే కీలకం
[ 17-06-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పత్తి, ఇతర పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కొద్దిపాటి వర్షానికే ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు విత్తుకున్నారు. వరి సాగుకు నారును సిద్ధం చేశారు. తీరా వర్షం కురవకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. -
సృజన ఆవిష్కృతం.. విజ్ఞాన సమ్మిళితం
[ 17-06-2024]
ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసేందుకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
భార్య జ్ఞాపకం.. గుడితో పదిలం
[ 17-06-2024]
భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె జ్ఞాపకాలు గుర్తుండేలా గుడి నిర్మించాడు ఓ భర్త.. నిత్యం ఆ గుడిలో దీపం వెలిగించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. -
శాశ్వత చర్యలు ఎక్కడ?
[ 17-06-2024]
వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఏటా వరదలు సంభవించి కాలనీలు జలమయమవడం, ఇళ్ల నుంచి ప్రజలు బయటకురాని పరిస్థితులు నెలకొన్నా ముప్పు నివారణకు పాలకులు శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. -
సంస్కరణల అమలుతోనే అభివృద్ధి
[ 17-06-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ఆలయాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురిలో రానున్న రోజుల్లో పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అరకొర వసతులు.. మొక్కుబడి పరీక్షలు
[ 17-06-2024]
ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక వాహనాల రిజిస్ట్రేషన్లతో యూనిట్ కార్యాలయం నుంచి ఆర్టీవో స్థాయికి ఉన్నతి పొందిన పెద్దపల్లి రవాణా శాఖ అద్దె భవనంలో అరకొర వసతులతోనే కాలం వెళ్లదీస్తోంది. -
ధరణి సమస్యలకు పరిష్కారం లభించేనా!
[ 17-06-2024]
ధరణి సమస్యల పరిష్కారంపై కదలిక వచ్చింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్ దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
దుకాణాలను మింగిన రహదారి
[ 17-06-2024]
మండల కేంద్రమైన రుద్రంగి ప్రధాన రహదారి గుట్టను ఆనుకొని ఎత్తు ప్రదేశంలో ఉంటుంది. ఇలాంటి రహదారిని ఎత్తుగా నిర్మించే క్రమంలో పాత రహదారిపై ఉన్న మట్టిని తొలగించకుండానే కొత్తగా వేయడంతో మరింత ఎత్తు పెరిగి దాని వెంబడి దుకాణాలు నిండా మునిగాయి. -
నీరు పారదు.. పంట తడవదు
[ 17-06-2024]
కాల్వల్లో పెరిగిన చెట్లు.. పూడికతో నిండిన మట్టి.. పగుళ్లు బారిన లైనింగ్, ధ్వంసమైన డిస్ట్రిబ్యూటరీలు. కొన్ని చోట్ల అసలు కాల్వల నామరూపాల్లేకుండా పోయాయి. -
చెక్డ్యాంల రక్షణ గోడలకు మరమ్మతులు
[ 17-06-2024]
భూగర్భ జలాలను పెంపొందించేందుకు, వ్యవసాయ, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉండేలా ప్రభుత్వం మూలవాగులో చెక్డ్యాంల నిర్మాణం చేపట్టింది. అయితే గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రక్షణ గోడలు కోతకు గురయ్యాయి. -
మంత్రికి మగ్గంపై నేసిన చిత్రపటం బహూకరణ
[ 17-06-2024]
చేనేత మగ్గంపై నేసిన బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాన్ని ఆదివారం టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ హుస్నాబాద్లో ఆయనను కలిసి బహూకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!
-
పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు
-
క్రికెట్లో మా ప్రాభవం తగ్గుతోంది.. పీసీబీ లుక్కేయాలి: పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్
-
బస్టాండ్లో గర్భిణికి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు
-
ఉద్యోగాన్వేషణలో తోడుగా.. లింక్డిన్లో కొత్త ఏఐ టూల్స్
-
ఘోర రైలు ప్రమాదం.. మృతులకు రైల్వేశాఖ ఎక్స్గ్రేషియా ప్రకటన