గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సన్నద్ధం
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ పమేలా సత్పతి, చిత్రంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షకు ముందు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి పరీక్షల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పాలనాధికారి జిల్లా అధికారులతో పరీక్షల నిర్వహణపై మాట్లాడారు. కరీంనగర్లో పరీక్షకు 36 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 18,663 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. తగిన భద్రత మధ్య ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలను తరలించాలన్నారు. అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా ప్రధాన గేటు ద్వారానే పరీక్ష కేంద్రంలోకి పంపించాలని సూచించారు. పోలీసు సిబ్బంది నిశితంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని, 10 గంటలకు పరీక్ష కేంద్రాల ప్రధాన గేట్లు మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో లైట్లు, పంకాలు, తాగునీరు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మే 22న హైదరాబాద్లో బయోమెట్రిక్ పోలీసు అధికారులకు, పోలీసు నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్, డీఆర్వో పవన్కుమార్, డీసీపీ లా అండ్ ఆర్డర్ లక్ష్మీనారాయణ, జగిత్యాల జేఎన్టీయూ కళాశాల ఆచార్యులు సతీష్కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కాళీచరణ్, కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ శ్రీధర్రావు, రజనీ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ స్థానంలో టీజీని తక్షణమే అమలు చేయండి
కరీంనగర్ కలెక్టరేట్: టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’ని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. జిల్లాలో ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫారంలు, ఏదైన ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ను టీఎస్కు బదులుగా టీజీ అని వాడాలని కలెక్టర్ కోరారు. లెటర్హెడ్లు, రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్సైట్లు, పాలసీ పేర్లు, జీవోలు, ఇతర అధికారిక అంశాలన్నింటిపై టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీలోపు అన్ని శాఖల జిల్లా అధికారులు తగిన నివేదికలు పంపాలని, ఆ నివేదికలు క్రోడికరించి ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు హనుమాన్ జయంతి.. కాషాయమయంగా కొండగట్టు
[ 01-06-2024]
నేడు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో కొండగట్టు క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రామనామజపంతో కాషాయమయమైంది. -
మది నిండుగ.. దశాబ్ది పండుగ!
[ 01-06-2024]
దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయింది.. ఆదివారం పదకొండో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబవుతోంది. ఇన్నేళ్ల ఘన కీర్తిని.. ఉద్యమ ఖ్యాతిని గుర్తు చేసుకుంటూనే భవిష్యత్తు దిశగా పడే అడుగులపై ఉమ్మడి జిల్లావాసుల్లో ఆశలు పెరుగుతున్నాయి.. -
కాషాయ వర్ణం.. కొండగట్టు
[ 01-06-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలు కాషాయ శోభను సంతరించుకుంటున్నాయి. వివిధ జిల్లాల నుంచి దీక్షాపరులు పాదాలకు వస్త్రాలు చుట్టుకుని, హనుమాన్ జెండాను చేతపట్టుకుని పాదయాత్రగా ‘రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్కీ’ అంటూ ఘాట్రోడ్డు, మెట్లదారిన కొండపైకి చేరుకున్నారు. -
116 టేబుళ్లు.. 153 రౌండ్లు
[ 01-06-2024]
కరీంనగర్ లోక్సభ స్థానానికి సంబంధించి ఈనెల 4న ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
ఉత్తమ ఫలితాలు.. మౌలిక వసతులు
[ 01-06-2024]
పక్కా భవనాలు.. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా బోధన, ఉత్తమ ఫలితాలు ఉన్నాయంటూ అధ్యాపకులు ఇంటింటి ప్రచారం చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఆయా కళాశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు మే 9 నుంచి ఇంటర్ విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. -
ముంపు ముప్పు తప్పేనా?
[ 01-06-2024]
వర్షం కురిస్తే చాలు సిరిసిల్ల పురపాలక సంఘంలోని లోతట్టు కాలనీలు జలమయం కావడం, ప్రధాన రహదారులపైకి, ఇళ్లలోకి నీరు చేరడం సర్వసాధారణంగా మారింది. పట్టణం చుట్టూ ఉన్న చెరువుల శిఖం ఆక్రమణలతో వాటిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. -
అతివల ఆర్థిక అభ్యున్నతికి అండ
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి రుణాలు అండగా నిలుస్తున్నాయి. అత్యవసర వేళల్లో తోడ్పాటునందిస్తున్నాయి. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి లేకుండా చిరు వ్యాపారాల నిర్వహణతో ఆర్థిక బలోపేతం వైపు అడుగులు పడేలా సహకరిస్తున్నాయి. -
సుల్తానాబాద్లో లారీ బీభత్సం
[ 01-06-2024]
డ్రైవర్ మద్యం మత్తుతో శుక్రవారం సుల్తానాబాద్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. -
67 గోవులు, ఎద్దుల పట్టివేత
[ 01-06-2024]
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వాహనాల్లో తరలిస్తున్న 67 గోవులు, ఎద్దులను పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ టోల్ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. -
వడదెబ్బతో నలుగురి మృతి
[ 01-06-2024]
ఎండలు మండిపోతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు నలుగురు మృత్యువాత పడటం విషాదం నింపింది. -
47.1 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాలో భానుడిప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 47.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా ముత్తారంలో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత
-
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
-
రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ ప్రకటన చేయనన్న అల్లు అర్జున్
-
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
-
ఏ విషయమైనా.. ఎవరికీ అతిగా చెప్పేందుకు ప్రయత్నించను: జస్ప్రీత్ బుమ్రా
-
తెలంగాణలో 10వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్రాజ్