శిక్షణకు జక్కూరు సై
ఏడు దశాబ్దాల క్రితమే ప్రారంభమైన జక్కూరు వైమానిక శిక్షణ శాల (జక్కూరు ఫ్లైయింగ్ ట్రైనింగ్ స్కూల్-జీఎఫ్టీఎస్) పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. విధానపరమైన అడ్డంకులతో ఐదేళ్లుగా మూసి ఉంచిన ఈ స్కూల్ పునరుద్ధరణ ప్రక్రియ అనంతరం ఆదివారం నుంచి సేవలకు సిద్ధమవుతోంది.
ఐదేళ్ల తరువాత నేడు పునః ప్రారంభం
పిల్లల్లో ఆసక్తి పెంచే శిబిరాలు
ఈనాడు డిజిటల్, బెంగళూరు: ఏడు దశాబ్దాల క్రితమే ప్రారంభమైన జక్కూరు వైమానిక శిక్షణ శాల (జక్కూరు ఫ్లైయింగ్ ట్రైనింగ్ స్కూల్-జీఎఫ్టీఎస్) పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. విధానపరమైన అడ్డంకులతో ఐదేళ్లుగా మూసి ఉంచిన ఈ స్కూల్ పునరుద్ధరణ ప్రక్రియ అనంతరం ఆదివారం నుంచి సేవలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, యువజన క్రీడాశాఖ మంత్రి నారాయణగౌడ దీన్ని ప్రారంభిస్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి, అమృత మహోత్సవాల నేపథ్యంలో జీఎఫ్టీఎస్ను పునఃప్రారంభిస్తున్నారు.
అడ్డంకులు అధిగమించి..
శిక్షణ కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అనుమతి, కమర్షియల్ పైలెట్ లైసెన్స్(సీపీఎల్), ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్టీఓ)ల అనుమతి తప్పనిసరి. ఈ అనుమతి పొందిన ఆరు నెలల్లోనే చీఫ్ ఫైయింగ్ శిక్షకుని(సీఎఫ్ఐ) నియామకం, శిక్షణ తరగతులు పూర్తి చేయాలి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనువైన పరిణతి కలిగిన సీఎఫ్ఐల నియామకంలో సర్కారు విఫలమైంది. విదేశాల్లో ఇచ్చే సీఎఫ్ఐ వేతనాలు రూ.3 లక్షలకు పైగా ఉండగా, సర్కారు రూ.1.8 లక్షలు మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనితో సీఎఫ్ఐ నియామక ప్రక్రియ నిలిచిపోయింది. డిసెంబరు 2020న లైసెన్స్ గడువు కూడా పునరుద్ధరించలేకపోయారు. వీటికి రన్ వే విస్తీర్ణ వివాదం కూడా న్యాయస్థానంలో ఉండటంతో శిక్షణ తరగతుల నిర్వహణ కష్టమైంది. బీఎంఆర్సీఎల్(మెట్రో) సహకారంతో ఈ అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు శిక్షణ ప్రక్రియను ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రకటించిన జీఎఫ్టీఎస్ ఆరు నెలల వ్యవధిలోనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకోవటం గమనార్హం.
రూ.25 కోట్ల వ్యయం
జీఎఫ్టీఎస్ ఆవరణలో ఎయిర్ స్క్వాడ్రన్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యూనిట్, జూపిటర్ ఏవియేషన్ సేవలు, డెక్కన్ కార్టర్, అగ్ని ఏవియేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. హెలి టూరిజమ్, లాంజ్, 874 మీటర్ల రన్ వే, ఐదు సింగిల్ ఇంజిన్ విమానాలు, మరో రెండు ట్విన్ ఇంజిన్ విమానాల మరమ్మతు కోసం రూ.25 కోట్లు వ్యయం చేశారు.
గ్రామీణ ఔత్సాహికులకు అనుకూలం
ప్రభుత్వ నేతృత్వంలో ఫ్లైయింగ్ శిక్షణ కోసం వేలాది మంది ఔత్సాహికులు ఎదురుచూస్తున్నారు. రూ.లక్షల వ్యయంతో కూడిన పైలెట్ శిక్షణ అంటే గ్రామీణ విద్యార్థులకు నెరవేరని కలగా మిగిలింది. 18 నెలల శిక్షణకు రూ.32 లక్షల ఫీజు వసూలు చేస్తారు. బీపీఎల్ కుటుంబ విద్యార్థులు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఓ బ్యాచ్కు గరిష్ఠంగా వంద మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం 35 మందితోనే ప్రారంభిస్తారు. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ 2023 ఆగస్టులో ముగుస్తుంది.
జక్కూరు పరిసరాల్లో విహరిస్తున్న శిక్షణ లోహవిహంగాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు