logo

వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి

రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.

Published : 27 Apr 2024 04:50 IST

చిక్కబళ్లాపుర : రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది. గౌరీబిదనూరు శివారు ప్రాంతంలో ఒక బాలిక (14)పై అత్యాచారానికి పాల్పడిన రవి (19) అనే యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తన ఇంటి ముందున్న బాలికకు మాయమాటలు చెప్పి, తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో గౌరీబిదనూరు గ్రామీణ ఠాణా పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

బెంగళూరులోనూ.. బెంగళూరు (యశ్వంతపుర): పానీపురి ఇప్పిస్తానని ఆశ చూపించి ఓ బాలిక (7)ను వెంటబెట్టుకెళ్లిన వ్యక్తి (54) చివరికి ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై లైంగిక దాడికి తెగించిన సంఘటన అశోక్‌నగర పోలీసుఠాణాలో శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. ఆ నిందితుడి వివరాలు సేకరించిన పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లి మూగ. తల్లి, బిడ్డ గరుడమాల్‌ వద్ద భిక్షాటన చేసేవారు. బాలిక ఆరోగ్యం విషమంగా కనిపించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆ బాలిక జరిగిన సంఘటన చెప్పింది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి భిక్షగాడిగా గుర్తించారు. బాలికకు వైద్య పరీక్షలు చేసేందుకు బౌరింగ్‌ ఆసుపత్రిలో పోలీసులు చేర్పించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని