logo

దిగివచ్చిన కరోనా

వారం రోజులుగా రాష్ట్రాన్ని వణికిస్తూ అంతకంతకూ పెరిగిన కరోనా ఒక్కసారిగా దిగివచ్చింది. శనివారం కేవలం 253 పాజిటివ్‌ కేసులే నమోదు కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిలో 611 మంది పూర్తిగా కోలుకున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య

Published : 26 Jun 2022 04:46 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : వారం రోజులుగా రాష్ట్రాన్ని వణికిస్తూ అంతకంతకూ పెరిగిన కరోనా ఒక్కసారిగా దిగివచ్చింది. శనివారం కేవలం 253 పాజిటివ్‌ కేసులే నమోదు కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిలో 611 మంది పూర్తిగా కోలుకున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య 4,822కు తగ్గింది. పాజిటివిటీ 3.71 శాతంగా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 50,710 మంది టీకా వేయించుకున్నారు. సాంకేతిక కారణాలతో కొవిడ్‌ టెస్టులు చేయించుకున్న వారి నివేదిక పూర్తి స్థాయిలో రాకపోవడంతో 253 కేసులు మాత్రమే నమోదయ్యాయనేది మరో సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని