కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు.
బండీపుర పర్యాటకం జోరు
బండీపుర జాతీయ ఉద్యానవన ప్రవేశ ద్వారం
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. పడమటి కనుమలు- నీలగిరి కొండల సంగమ ప్రాంతంగా విరాజిల్లే బండీపురలో ప్రకృతి సిద్ధమైన వనాలు, విహరించే వన్యజీవులు ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడికి విహారానికి వచ్చే వారి కోసం అటవీ, పర్యాటక శాఖలు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాయి. మైసూరుకు సమీపంలోనే.. చామరాజనగర జిల్లా పరిధిలో విస్తరించిన ఈ బండీపుర జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించడం ఎంతో సులువు. కర్ణాటకలోని వివిధ జిల్లాలతో పాటు సమీప కేరళ, తమిళనాడు ప్రాంతాల నుంచి రహదారుల సౌకర్యం ఉండటంతో సందడి పెరుగుతోంది. బండిపుర అటవీ వసతిగృహాలు (జంగల్ లాడ్జెస్) రిజర్వు చేసుకునే వెసులుబాటు కల్పించారు. రాత్రిపూట కీకారణ్యంలో విశ్రాంతి తీసుకోవడం అందరిలోనూ ఆసక్తికి కారణం. ఇక్కడికి వచ్చేవారు పులులు, ఏనుగుల సఫారీ ఎంచుకోవడానికి ముందుకొస్తుంటారు. ఈ చుట్టుపక్కల 73 పులులున్నట్లు లెక్కతేలింది. అందులో ఎన్నో కొన్ని సఫారీ వేళ ఎదురు పడుతుంటాయి. దేశంలోనే అరుదైన నల్లపులులనూ చూడొచ్చు. సుమారు 874 చదరపు కిలోమీటర్లు విస్తరించిన జాతీయ ఉద్యానవనం సస్యందాలూ తక్కువేమీకాదు. ఎత్తైన కొండలు, లోయల్లో సాగే చిరు జలపాతాలు, వాటి దిగువన చెరువులు, అక్కడికి వచ్చి వెళ్లే జంతువులతో ఒకటే సందడి. పులుల అనుపానలు ఎప్పటికిప్పుడు తెలుసుకోవడానికి గుర్తించిన వాటన్నింటికీ మైక్రో చిప్స్ అమర్చారు. వాటి సాయంతో కదలికలను సులువుగా గమనిస్తుంటారు. వేటగాళ్లను నియంత్రించేందుకు, పర్యాటకుల భద్రత కోసం కీలక ప్రదేశాల్లో 68 నిఘా కెమెరాలను అమర్చారు. బండీపుర మధ్యలోనే జాతీయ రహదారి (181) కేరళ దిశగా సాగుతుంది. వన్యజీవుల సంరక్షణ కోసం రాత్రిపూట ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధించారు. వన్యధామంగా 1973లో దీని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అర్ధశతాబ్దంలో ఎంతో అభివృద్ధి సాధించి, విహార కేంద్రంగా రూపుదాల్చింది.
సంచరిస్తున్న ఏనుగుల దండు
వనసీమలో అరుదైన నల్ల పులి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగమొండి ప్రజ్వల్.. విచారణకు సహకరించడం లేదన్న సిట్
[ 02-06-2024]
వందలాది మందిపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు తెలిపారు. -
అంచనాల్లో.. కూటమిదే కోట!
[ 02-06-2024]
కర్ణాటకలో లోక్సభ ఎన్నికల ఎగ్జిట్పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. వివిధ సంస్థల శ్యాంపుల్ సమీక్షల ఫలితాలు ఎన్డీఏ కూటమి ఆధిపత్యాన్ని చాటుతుందని తేల్చాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి భాజపా సాధించిన స్థానాల కంటే తక్కువ స్థానాలకు పరిమితమవుతుందని ఈ సమీక్షలు వెల్లడించాయి. -
సీఈటీ ర్యాంకుల్లో అబ్బాయిల జోరు!
[ 02-06-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయం, పశువైద్యం, నర్సింగ్, ఫార్మసీ, యోగా, నేచురోపతి విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కర్ణాటక ఉమ్మడి ప్రవేశ (కే-సీఈటీ)పరీక్షల్లో అబ్బాయిలు ర్యాంకుల్లో సత్తా చాటారు. -
విచారణకు హాజరైన సిద్ధు, డీకే
[ 02-06-2024]
విధానసభ ఎన్నికల సమయంలో ‘భాజపా నేతలు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు’ అంటూ ప్రకటనలు విడుదల చేసిన కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై నమోదైన కేసు విచారణ శనివారం ప్రారంభమైంది. -
పాలకుల మాటలు.. నీటి మూటలు
[ 02-06-2024]
రాజధాని నగరం ఈసారి వాననీటి ముంపునకు గురిచేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎన్నికలకు ముందే అధికారులు, ఏలికలు భీకర ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికలయ్యాక.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు ముంపు ముప్పు ఎదురయ్యే ప్రాంతాలను చుట్టేసి ఈసారి సమస్య ఎదురుకాకుండా చూడడానికి అనేక ఆదేశాలిచ్చారు. -
నకిలీ ఖాతాలకు నగదు బదిలీ
[ 02-06-2024]
రాష్ట్ర వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో అక్రమాలకు పాల్పడి, నకిలీ ఖాతాలకు బదిలీ చేసిన నగదులో కొంత భాగం హస్తినలోని కాంగ్రెస్ నేతలకు చేరిందని విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆరోపించారు. -
భవ్య సేవలే ఓ సైన్యం!
[ 02-06-2024]
కాంగ్రెస్ పార్టీ మహిళా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన భవ్య నరసింహమూర్తి భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టారు. డైరెక్టరేట్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ 2022లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళగా ఆమె నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్.. పసికూనపై చెమటోడ్చి నెగ్గిన విండీస్
-
గాజాలో దాడులు.. ‘ఇజ్రాయెల్’పై మాల్దీవులు కీలక నిర్ణయం!
-
93 ఏళ్ల వయస్సులో.. మీడియా దిగ్గజం మర్దోక్కు ఐదో పెళ్లి
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్