మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు.
1-5 విద్యార్థులకు ‘లిటరసీ క్లౌడ్’ కార్యక్రమం అమలు
పుస్తకం పఠిస్తున్న విద్యార్థులు
పాల్వంచ, న్యూస్టుడే: ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. నైతికత, ఆత్మవిశ్వాసంతో పాటు జీవిత విలువలు నేర్పే పుస్తక పఠనానికి బాలలు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్య, పరిశోధన శిక్ష మండలి (ఎస్సీఈఆర్టీ) వేసవి ప్రత్యేకంగా ‘లిటరసీ క్లౌడ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆన్లైన్లో కథలు చదవడం, వినడం ద్వారా ‘ప్రాథమిక’ స్థాయి విద్యార్థుల్లో మౌఖిక భాషా వికాసం, అభ్యసనా సామర్థ్యాల అభివృద్ధికి ఆ సంస్థ కృషిచేస్తోంది.
ఖమ్మం జిల్లాలో 813, భద్రాద్రిలో 778 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం ‘లిటరసీ క్లౌడ్’ కార్యక్రమం అమలు చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. డీఈఓ కార్యాలయ అకడమిక్ మానిటరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో బాలల అభ్యసనా సామర్థ్యం మరుగున పడకుండా వారిలో ఆసక్తి కలిగించే కథలను చదివించడం, వినేలా చూడటమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ‘రూం టూ రీడ్ ఇండియా ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఎస్సీఈఆర్టీ ‘లిటరసీ క్లౌడ్’ను రూపొందించింది. ఒకటి నుంచి అయిదో తరగతి పిల్లల స్థాయిలో కథలు రూపొందించారు. వాటిని చదివితే సృజనాత్మకత, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల సాయంతో https//literacycloud.org/stories?language=telugu/sort=new లింక్ ఆధారంగా వెబ్సైట్ను సందర్శించాలి. దీంతో ఆన్లైన్లో విభిన్న కేటగిరీల కథల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. లేదంటే 040-45209722 నంబరుకు ఫోన్చేసి కథలు వినొచ్చు. ఈ సమాచారం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు చేరేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని విద్యా విభాగం అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతోమంది విద్యార్థులు తెలుగు చదవడం, రాయడంపై వెనకబడుతున్నట్లు ‘విద్యాస్థితిగతి (అసర్), ‘న్యాస్’ తదితర నివేదికల్లో తేలింది. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లోనూ తెలుగు సబ్జెక్టులో చాలామంది విద్యార్థులు అనుత్తీర్ణులైన విషయం తెలిసిందే. ప్రాథమిక స్థాయిలోనే కథల ద్వారా మాతృభాషపై పట్టును పెంపొందిస్తే పై తరగతుల్లో బాగా రాణించగలుగుతారని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
‘లిటరసీ క్లౌడ్’ కార్యక్రమం విజయవంతం అనేది పిల్లల తల్లిదండ్రుల చొరవపై ఆధారపడి ఉంటుంది. పఠనాసక్తి ప్రతి ఒక్కరి జీవితానికి వెలుగులు పంచుతుంది. ఏదైనా అంశాన్ని ధారాళంగా చదివే వారికి పద వినియోగం, వాక్య నిర్మాణం, సరైన పద్ధతిలో రాయడం వంటి నైపుణ్యాలు అలవడతాయి. తెలుగు భాషపై పట్టు లభించడంతో పాటు నైతిక విలువలు బోధపడతాయి. నేర్చుకోవాలన్న జిజ్ఞాస బాలల్లో కలుగుతుంది. ఆన్లైన్ గేమ్లకు బదులు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల సాయంతో కథనాలు పఠించేలా చూడాలి.
నాగరాజశేఖర్, ఏఎంఓ, భద్రాద్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్కారు బడుల తడబాటు..!
[ 14-06-2024]
బడులు తెరిచే రోజు పండగ వాతావరణం కల్పిస్తాం.. పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం.. ఇందుకోసం సంసిద్ధత కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం.. బడులు లేని గ్రామాలు ఉండవు.. విద్యార్థులకు సకల వసతులు సమకూర్చుతామని అధికారులు పదేపదే చెప్పినా ఆచరణలో విఫలమయ్యారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. -
గోదావరి జలాలతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం
[ 14-06-2024]
గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను సస్యశ్యామలం చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటిపారు దలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరందించటానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. -
రైతులకు న్యాయం చేస్తాం: మంత్రులు
[ 14-06-2024]
సీతారామ ప్రాజెక్టు అనుసంధాన కాలువ భూనిర్వాసితులు ఏ ఒక్కరూ నష్టపోకుండా నీళ్లు రాకముందే అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
‘ఆశా కార్యకర్తలకు పరీక్షలు నిర్వహించొద్దు’
[ 14-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు పరీక్షలు నిర్వహించాలని యోచించటం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మా విష్ణువర్ధన్, కల్యాణం వెంకటేశ్వరరావు అన్నారు. -
మదింపుపై రెట్టింపు సన్నద్ధం
[ 14-06-2024]
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబడి పెరగాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయ భూములు, ప్లాట్లు, స్థలాల మార్కెట్ విలువ పెంచాలని, తద్వారా రిజిస్ట్రేషన్ల సమయంలో ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది. -
2.44 కుటుంబాలకు గృహ జ్యోతి
[ 14-06-2024]
వేసవి అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్తు వినియోగం గత మూడు నెలల్లో ఎక్కువగా ఉంది. అందుకే జీరో బిల్లు పొందే వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. వాతావరణం చల్లబడటంతో జూన్ నుంచి జీరో బిల్లు పొందేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. -
పాత ఇంటికి ‘వంద’నం
[ 14-06-2024]
అది ఓ చిన్న పల్లెటూరు.. ఇప్పటికే చాలా మంది పాతతరం నాటి ఇళ్లను ఖాళీ చేసి వారి పిల్లలు ఉద్యోగాలు చేస్తున్న చోటకు వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
అరుదైన దాతలు
[ 14-06-2024]
రక్తం.. మానవ శరీరం కోల్పోయినా, తగ్గిపోయినా, పాడైపోయినా దాని విలువ నిండు ప్రాణం.. రక్తం పంచుకుని పుట్టకున్నా ఆపదలో ఉన్నవారికి రక్తం పంచి, వారి ఆయువును పెంచే మహదవకాశం మనకే.. మనుషులకే ఉంది.. అందుకే రక్తదాతను ‘ప్రాణదాత’కు పర్యాయపదంగా పిలుస్తాô. -
పూసుగుప్ప అడవుల్లో బూబీట్రాప్స్ వెలికితీత
[ 14-06-2024]
చర్ల మండలంలోని మారుమూల పూసుగుప్ప అడవుల్లో భద్రతా బలగాలు మరోమారు మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీట్రాప్స్ను గుర్తించి వెలికితీశారు. ఈనెల 10వ తేదీన ఇక్కడి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, చర్ల పోలీసులు పెద్దఎత్తున బూబీట్రాప్స్ను గుర్తించి వెలికితీసిన విషయం తెలిసిందే. -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. మహిళ దుర్మరణం
[ 14-06-2024]
పెళ్లి వేడుకకు వెళ్లి సంతోషంగా తిరిగొస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పాల్వంచ మండలంలోని మొండికట్ట వద్ద ఓ మూలమలుపులో సంఘటన చోటుచేసుకుంది. -
అటకెక్కిన కరకట్టల నిర్మాణం
[ 14-06-2024]
గోదావరి పరివాహకంలోని గ్రామాలకు ముంపు ముప్పు నివారణకు తలపెట్టిన కరకట్టల నిర్మాణం అటకెక్కింది. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల పరిధిలో గోదావరికి రెండువైపులా కరకట్టల నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.