అరాచక పాలనకు అంతం తప్పదు
రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే అంతం తప్పదని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెన్నంశెట్టిపల్లెలో తెదేపా నేత వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కరపత్రాలు చూపుతున్న మల్లెల రాజశేఖర్ తదితరులు
ఓర్వకల్లు, న్యూస్టుడే: రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే అంతం తప్పదని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెన్నంశెట్టిపల్లెలో తెదేపా నేత వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెదేపా సూపర్-6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు హయాంలో ఓర్వకల్లును పారిశ్రామిక హబ్గా ప్రకటించి ఎన్నో పరిశ్రమలకు నాంది పలికారని చెప్పారు. వైకాపా హయాంలో ఏ ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదన్నారు. ఎన్నికల్లో వైకాపాను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నాయకులు పుల్లారెడ్డి, తిమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహులు, శివ, సిద్ధయ్య, నాగయ్య పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి పెద్దపీట: బీవీ
ఎమ్మిగనూరు, న్యూస్టుడే: తెదేపా విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానన్నారు. 45 రోజుల కిందట ఎమ్మిగనూరుకు వచ్చిన వైకాపా అభ్యర్థి బుట్టా రేణుకను ఓడించాలన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆరాచకాలకు ఎమ్మిగనూరు అడ్డాగా మారిందన్నారు. సాగు, తాగునీరు కోసం రూ.2 వేల కోట్లుతో ఆర్డీఎస్ పథకం మంజూరు చేస్తే ఆ పథకానికి ఐదేళ్లలో పైసా నిధులు ఇవ్వలేదన్నారు. జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టోలో అమ్మఒడి పథకం కుటుంబంలో ఒకరికి ఇచ్చి కోత విధిస్తున్నారని మండిపడ్డారు. ఈసారి తెదేపాను గెలిపిస్తే ఆడబిడ్డ నిధి, మహిళలకు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తామన్నారు. వైకాపా ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోలో రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంతో తెదేపా మహిళ సంఘం నాయకురాళ్లు సరోజమ్మ, శంకరమ్మ, రేష్మ, పార్వతమ్మ, బడేబీ, తదితరులు పాల్గొన్నారు.
గెలుపు తీరాలు చేరాలి
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: పార్టీ నేతలను సమన్వయం చేసుకుని ఎన్నికల్లో గెలుపు తీరాలు చేరాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తెదేపా గెలుపునకు కృషి చేయాలన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డిని ఆయన కర్నూలులో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెదేపా నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఎన్నికల ప్రచారంపై చర్చించారు.
గెలిపిస్తే ప్రజాసేవ చేస్తాం
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: కులమత బేధాలు చూడకుండా రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ కోరారు. కర్నూలు 13వ వార్డులోని ప్రశాంత్ టవర్స్, నంద్యాల గేటు, మేడం కాంపౌండ్, రాజవిహార్ తదితర ప్రాంతాల్లో ఆయన ఆదివారం భరోసా యాత్ర చేపట్టారు. ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి తెదేపాకు ఓటేయాలని కోరారు. సరైన నాయకుడు, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకమన్నారు. టీజీవీ సంస్థల తరఫున కొంతవరకే ప్రజాసేవ చేయగలమని, అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేసేందుకు, కర్నూలును అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, బూత్ ఇన్ఛార్జులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా‘రీచ్’లపై కన్నేయండి
[ 17-05-2024]
నదీతీరాల్లో ఇసుకను యంత్రాలతో తవ్వొద్దని ఎవరెన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఎన్జీటీ హెచ్చరించినా.. కోర్టులు మొట్టికాయలు వేసినా తవ్వకాలు ఆపలేదు. -
కత్తి దూస్తున్న కక్షలు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.. అనంతరం పల్లెల్లో కక్షలు కత్తి దూస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పార్టీల ఫిరాయింపులు మొదలుకొని ఇరువర్గాల మధ్య గొడవలు, ఘర్షణలతో రాజకీయ వైరం పెరిగింది. -
భూసార పరీక్షలనేలచూపులు
[ 17-05-2024]
పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. నేల లక్షణాలు.. ఇందులో లోపించిన సూక్ష్మధాతువుల వివరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. -
ఏపీఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏపీఈఏపీ సెట్ గురువారం ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో మొత్తం 3,675 మంది దరఖాస్తు చేసుకోగా 3,419 మంది హాజరయ్యారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
పారిశ్రామిక శిక్షణ సంస్థలు వృత్తివిద్యలో తర్ఫీదును ఇస్తూ స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించేందుకు మార్గాన్ని చూపుతున్నాయి. -
వైకాపా నాయకుల తీరుతోనే హింసాత్మక ఘటనలు
[ 17-05-2024]
వైకాపా నాయకుల తీరు కారణంగానే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ అన్నారు. -
కూటమిదే అధికారం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన కూటమి విజయం సాధిస్తుందని.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి అన్నారు. -
అతిసారంతో 16 మందికి అస్వస్థత
[ 17-05-2024]
బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో అతిసారం ప్రభలడంతో గురువారం 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. -
తెదేపా కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి
[ 17-05-2024]
ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న తెదేపా అనుచరులపై పలువురు మూకుమ్మడి దాడిచేసిన ఘటన మహానంది మండలం గోపవరం గ్రామంలో గురువారం జరిగింది. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం భద్రత
[ 17-05-2024]
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నియమించిన పోలీసు బలగాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన పేర్కొన్నారు. -
గడప చేరని బియ్యం
[ 17-05-2024]
పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు.