గడప చేరని బియ్యం
పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు.
రేషన్ సరకుల పంపిణీకి నేడే ఆఖరు
గడువు పెంచాలని పేదల వినతి
కర్నూలు మార్కెట్, న్యూస్టుడే : పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు. కొందరు ఎండీయూ ఆపరేటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములవడం.. పౌరసరఫరాల అధికారులు పట్టించుకోకపోవడంతో సరకుల పంపిణీ అధ్వానంగా సాగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 760 ఎండీయూ వాహనాలు ఉండగా వివిధ కారణాలతో కొందరు ఆపరేటర్లు విధుల నుంచి తప్పుకున్నారు. వీరి బాధ్యతలను మరొకరికి అప్పగించారు. ఇలాంటి చోట్ల పంపిణీ మందగించింది. ఈనెల 13న ఎన్నికల పోలింగ్ రోజున పంపిణీ ఆపేశారు. 17వ తేదీతో సరకుల పంపిణీ గడువు ముగియనుండటంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.
1,60,368 మందికి అందని సరకులు
- కర్నూలు అర్బన్తోపాటు 25 మండలాల పరిధిలో 6.76 లక్షల మంది కార్డుదారులకు బియ్యం, పంచదార, గోధుమపిండి విడుదల చేశారు. 16వ తేదీ నాటికి 5,92,944 మంది కార్డుదారులకు మాత్రమే సరకులు అందజేశారు. ఇంకనూ 83,265 మందికి సరకులు అందాల్సి ఉంది.
- నంద్యాల జిల్లాలో 5.41 లక్షల మంది కార్డుదారులు ఉండగా 4,64,701 మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకనూ 77,103 మంది కార్డుదారులకు సరకులు ఇవ్వాల్సి ఉంది.
- ఉమ్మడి జిల్లాలో 12.18 లక్షల మంది కార్డుదారులు ఉండగా వీరిలో 10.57 లక్షల మందికి మాత్రమే సరకులు ఇచ్చారు.. 1.60 లక్షల మంది కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరకులు అందలేదు.
కొరవడిన పర్యవేక్షణ
- అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో చాలామంది ఎండీయూ ఆపరేటర్లు సక్రమంగా సరకులు పంపిణీ చేయలేదు. ఉదయం 7 గంటల నుంచి వాహనాలతో ఇంటింటా సరకులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ చాలాచోట్ల పది గంటల వరకు ప్రారంభించలేదు. మధ్యాహ్నం ఎండల తీవ్రత కారణంగా సరకుల పంపిణీకి సమస్యలు ఏర్పడ్డాయి. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సరకులు ఇవ్వాల్సి ఉన్నా కొందరు ఆపరేటర్లు వాహనాలను అందుబాటులో ఉంచలేదు.
- ఈనెల 11, 12 తేదీల్లో సర్వర్ మొరాయించడంతో సరకుల పంపిణీకి ఆటంకం ఏర్పడింది. దీనికితోడు జిల్లాలో పౌరసరఫరాల గోదాముల నుంచి చౌక దుకాణాలకు సరకులు సకాలంలో చేరలేదు.
- ఒకసారి ఒక వీధికి వచ్చిన ఎండీయూ వాహనం మళ్లీ అక్కడికి వెళ్లకపోవడంతో చాలామంది సరకుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. పోర్టబులిటీ విధానం అమలుకు కొన్నిచోట్ల ఆపరేటర్లు మోకాలడ్డటంతో పట్టణ ప్రాంతాల్లో పేదలు సరకులు కోల్పోవాల్సి వచ్చింది.
ఇంటింటికి ఎగనామం
- ఇంటింటికి రేషన్ పంపిణీ కాదు కదా.. వీధిల్లోకి ఎండీయూ వాహనాలు రాలేదు. రహదారులపై ఒకచోట వాహనాలు ఆపి కార్డుదారులకు రేషన్ సరకులు పంపిణీ చేశారు. ఫలితంగా జనాలకు ఎండలో ఇబ్బందులు తప్పలేదు.
- పౌరసరఫరాల అధికారులు ఎన్నికల ప్రక్రియలో ఉండగా.. సగం మంది ఎండీయూ ఆపరేటర్లు అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
- కొన్నిచోట్ల ఎండీయూ ఆపరేటర్లు, చౌక దుకాణాల డీలర్లు కుమ్మక్కై చౌక దుకాణాల దగ్గరే రేషన్ పంపిణీ చేశారు. పౌరసరాఫరాల అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో రేషన్ సరకుల పంపిణీ గడువు పెంచాలని కార్డుదారులు విన్నవిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైల్వే బ్రిడ్డి కింద పడి గుర్తు తెలియని వ్యకి మృతి
[ 01-06-2024]
పట్టణంలోని హనుమాన్ నగర్ రైల్వే బ్రిడ్జి కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. -
వాహన తనిఖీల్లో కర్ణాటక మద్యం స్వాధీనం
[ 01-06-2024]
నియోజకవర్గంలోని నందవరం మండలంలోని కనకవీడు సమీపంలో సెబ్ అధికారులు వాహన సోదాలు నిర్వహించారు. -
మండలంలో సర్వసభ్య సమావేశం
[ 01-06-2024]
చాగలమర్రి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని ఆయా శాఖల అధికారుల పరిధిలో జరిగిన పురోగతిని వినిపించారు. -
కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం
[ 01-06-2024]
స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
మండలకేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు
[ 01-06-2024]
మండల కేంద్రమైన సీ బెళగల్లోని అంజన్న ఆలయాల్లో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ
[ 01-06-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. -
సర్వజన.. నిత్యం అవస్థేనా..
[ 01-06-2024]
సర్వజన ఆసుపత్రిలోని వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించారు. మౌలిక వసతులు కల్పించడంలో విఫమయ్యారు. -
నమ్మితే.. నట్టేట మునిగినట్లే
[ 01-06-2024]
:సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరగాడి ప్రకటన ఆదోని నేరవిభాగం ూసి ఆదోనికి చెందిన రాముడు రూ.5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. -
అక్కాచెల్లెళ్లు..అందెల రవళులు
[ 01-06-2024]
తోడుగా పుట్టారు.. జోడీగా కూచిపూడి నేర్చుకుంటున్నారు. పదెళ్ల వయసులో నృత్యంపై పట్టుసాధించారు. ఆ చిన్నారులు ప్రదర్శనలిస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు -
ఎన్నికల ఫలితాలు త్వరితగతిన మీడియాకు అందిస్తాం: కలెక్టర్
[ 01-06-2024]
జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున రాయలసీమ యూనివర్సిటీలో మీడియా, కమ్యూనికేషన్ సెంటర్ల ద్వారా త్వరితగతిన ఫలితాలను మీడియాకు అందిస్తామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. -
మట్టిపై కన్ను.. అధికారం దన్ను
[ 01-06-2024]
నియోజకవర్గ పరిధిలోని అటవీ, ప్రభుత్వ భూముల్లో ఇప్పటివరకు మట్టిని తవ్వి సొమ్ము చేసుకున్న అక్రమార్కులు ప్రస్తుతం చెరువులపై కన్నేశారు. -
అర్ధరాత్రి మృత్యుఘోష
[ 01-06-2024]
అర్ధరాత్రి.. అంతా నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా వాహనం కుదుపునకు గురైంది.. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.. తేరుకునే సరికి రక్తపు మడుగులో పడున్నారు. -
నిర్వహణ.. దిగువకే
[ 01-06-2024]
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి కర్నూలు జిల్లాలోకి దిగువ కాలువ ప్రవహిస్తుంది. -
మండుటెండలో.. పండుటాకులు
[ 01-06-2024]
సామాజిక భద్రత పింఛనుదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. వారిని గత రెండు నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. -
గడువు ముగిసింది.. ఆందోళన మిగిలింది
[ 01-06-2024]
కర్నూలు నగర పరిధిలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు నగరపాలక సంస్థ గతేడాది తాత్కాలిక ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులను నియమించుకుంది. -
గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి
[ 01-06-2024]
కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఏజెంటు ను తనిఖీ చేసి అనుమతించాలని, ఆర్వోలు జారీ చేసిన గుర్తింపు కార్డు ఉంటేనే లోపలకు పంపాలని కర్నూలు రేంజి డీఐజీ విజయరావు ఆదేశించారు. -
ఏటి ఒడ్డున భూచోళ్లు
[ 01-06-2024]
నగరంలో హంద్రీ ఒడ్డున 12వ వార్డు పరిధిలోని కేవీఆర్ గార్డెన్లో అనధికారిక భవన నిర్మాణం చేపట్టారు. స్థానికుల నుంచి నగరపాలక అధికారులకు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత
-
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
-
రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ ప్రకటన చేయనన్న అల్లు అర్జున్
-
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
-
ఏ విషయమైనా.. ఎవరికీ అతిగా చెప్పేందుకు ప్రయత్నించను: జస్ప్రీత్ బుమ్రా
-
తెలంగాణలో 10వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్రాజ్