logo

రాక్షస పాలనను తరిమేద్దాం

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడాలని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు.

Published : 30 Apr 2024 03:49 IST

మాట్లాడుతున్న మల్లెల రాజశేఖర్‌, పక్కన తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడాలని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. మండలంలోని పాలకొలను, చింతలపల్లె, హెచ్‌.కొట్టాల, హుసేనాపురం గ్రామాల్లో సోమవారం ప్రచారం చేశారు. పాలకొలను సర్పంచి సుజాతమ్మ, ఆమె భర్త సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. వైకాపాను ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తెదేపా నేత సుధాకరరెడ్డి మాట్లాడుతూ రాక్షసుడికి, దేవతకు జరుగుతున్న ఎన్నికలని.. దీనిని ప్రతిఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, సర్పంచులు వెంకటరమణ, గోవర్ధనమ్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని