logo

పరిహారం ఇచ్చే వరకు పనులు ఆపండి

మండలంలోని పిన్నాపురం గ్రామంలో గ్రీన్‌కో సంస్థ చేపట్టిన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు.

Published : 30 Apr 2024 03:53 IST

పనుల వద్దకు చేరుకున్న రైతులు

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని పిన్నాపురం గ్రామంలో గ్రీన్‌కో సంస్థ చేపట్టిన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. గ్రామ పరిధిలోని 212 సర్వే నంబర్‌లో సాగు చేసుకుంటున్న పొలాలకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చే వరకు పనులు చేయొద్దని స్పష్టం చేశారు. పెద్దఎత్తున రైతులు, గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పరిహారంపై ఇచ్చిన మాట నెరవేర్చకుండా పనులెలా చేపట్టారో చెప్పాలని రైతులు పట్టుబట్టారు. దీంతో గ్రీన్‌కో సంస్థ సిబ్బంది వెనక్కి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని