బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
కర్నూలు న్యాయవిభాగం, న్యూస్టుడే : రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది. కర్నూలు జిల్లా గూడూరు మండలానికి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ ఓంప్రకాశ్ 2021 నుంచి 2024 వరకు చెల్లుబాటయ్యేలా ఆదిత్య బీమా సంస్థ నుంచి రూ.25 లక్షల బీమా పాలసీ తీసుకున్నారు. అదే సంవత్సరం అక్టోబరు 4వ తేదీన మరో ఇద్దరు మిత్రులతో కలిసి మోటారు సైకిల్పై ఓంప్రకాశ్ వెళ్తుండగా అకస్మాత్తుగా పంది అడ్డు రావటంతో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధమంటూ బీమా పరిహారం ఇచ్చేందుకు ఆదిత్యబిర్లా సంస్థ నిరాకరించటంతో బాధిత కుటుంబసభ్యులు కమిషన్ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను కమిషన్ అధ్యక్షులు కరణం కిషోర్కుమార్, సభ్యులు నారాయణరెడ్డి, నజీమకౌసర్తో కూడిన బెంచి శుక్రవారం పరిశీలించింది. ముగ్గురు ప్రయాణించటంతో ప్రమాదం జరగలేదని, పంది అడ్డు రావటంతోనే జరిగిందని పేర్కొంటూ బీమా పరిహారం రూ.25 లక్షలతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.50 వేలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.
పరిహారం ఇవ్వాల్సిందే
కర్నూలు న్యాయవిభాగం, న్యూస్టుడే : అగ్నిప్రమాదానికి సంబంధించిన ఘటనలో ప్రమాద బీమా పరిహారం చెల్లించాలంటూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఆదోని పట్టణానికి చెందిన సభాకౌసర్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 2019 సంవత్సరంలో రూ.25 లక్షలతో పవర్లూమ్, హ్యాండ్లూమ్ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. చోళమండలం జనరల్ ఇన్సురెన్స్ సంస్థ వద్ద రూ.15 లక్షలకు ప్రమాద బీమా తీసుకున్నారు. 2020, అక్టోబరు 30న కురిసిన భారీ వర్షంతో సంస్థ ఆవరణలోకి భారీగా నీరు చేరటంతో విద్యుదాఘాతం చోటుచేసుకుని అగ్నిప్రమాదం జరిగింది. యంత్రాలు కాలిపోవటంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రమాద ఘటనను ధ్రువీకరించారు. బాధితులు పరిహారం కోరుతూ బీమా సంస్థకు దరఖాస్తు చేసుకోగా సదరు బీమా సంస్థ సర్వేయర్ ఘటనాస్థలాన్ని పరిశీలించి రూ.1.75 లక్షలు మాత్రమే నష్టం జరిగినట్లు నివేదిక అందించారు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్ అధ్యక్షులు కరణంకిషోర్కుమార్, సభ్యులు నారాయణరెడ్డి, నజీమాకౌసర్తో కూడిన బెంచి సంస్థ యజమానికి రూ.7.5 లక్షలను 9 శాతం వడ్డీతో చెల్లించటంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.60 వేలు ఇవ్వాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి
[ 15-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువున్న విద్యార్థులకు ఉపాధ్యాయులందరు శ్రద్ధతో నాణ్యమైన విద్యను అందించాలని మండల విద్యాధికారి తిరుమలరావు అన్నారు. -
ఏడాదిలోగా పనులు పూర్తి చేయిస్తాం
[ 15-06-2024]
గోరుకల్లు జలాశయం నుంచి డోను తాగునీటి పనులకు నిధులను విడుదల చేసి త్వరలోనే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్రెడ్డి అన్నారు. -
అహోబిలంలో శాస్త్రోక్తంగా బాలాలయం
[ 15-06-2024]
ఆళ్లగడ్డ మండలంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలంలో బాలాలయ ప్రతిష్ట శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
కర్ణాటక మద్యం పట్టివేత
[ 15-06-2024]
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం నాగలదిన్నె వద్ద పోలీసుల దాడిలో 768 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడినట్లు ఎస్ఐ తిమ్మయ్య తెలిపారు. -
మంత్రి, ఎంపీకి జ్ఞాపికలు బహుకరణ
[ 15-06-2024]
రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరీలను మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర రెడ్డి, వేద పండితుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి ప్రసాదాలు అందించి జ్ఞాపికలను బహూకరించారు. -
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
[ 15-06-2024]
సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐదు సంతకాలు చేయడంపై హర్షిస్తూ ఆదోని పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. -
పోలీస్ స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలి
[ 15-06-2024]
మండలంలో శాంతి భద్రతలు పరిరక్షించే సీఐ తన స్టేషన్ను పరిశుభ్రం చేయడానికి నడుం బిగించారు. -
అందరూ పట్టణ అభివృద్ధికి సహకరించాలి
[ 15-06-2024]
పట్టణంలో అభివృద్ధి పనుల కోసం అధికారులందరూ సహరించాలని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
[ 15-06-2024]
పట్టణంలోని నీలకంఠేశ్వర స్వామిని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి దర్శించుకున్నారు. -
సుంకేసుల జలాశయం నుంచి నీటి విడుదల
[ 15-06-2024]
ఎగువ పరీవాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. -
భరతుని శాఖ.. భవితకు బాట
[ 15-06-2024]
తుంగభద్ర, కృష్ణమ్మ పారుతున్న నేల.. ఖనిజాల ఖిల్లా.. సాగు ఆధారిత జిల్లా.. దండిగా వనరుల ప్రాంతం.. మానవ వనరులకు కొదవలేదు.. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం ఒ.ఎం.ఐ.హెచ్. ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. -
బీసీ అడుగులు.. కావాలి ప్రగతి జాడలు
[ 15-06-2024]
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది.. వాటిని దాటలేక ఆర్టీసీ బస్సులు ఆపేసింది.. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీశాయి.. విధి లేక ఛిద్రమైన రోడ్లపై వెళ్లి చాలా మంది వాహనదారుల ఒళ్లు హూనం కావడంతో ఆసుపత్రులపాలయ్యారు. -
అనుభవం అభివృద్ధికి అవకాశం
[ 15-06-2024]
గత ప్రభుత్వం అయిదేళ్లు ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6.70 లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు. -
గుజరాత్ తరహాలో పరిశ్రమల స్థాపనకు కృషి
[ 15-06-2024]
ఆంధ్రప్రదేశ్ను గుజరాత్ రాష్ట్రం తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని, పెట్టుబడిదారులను ఆకర్షించి రాయితీలు కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి మంత్రి టీజీ భరత్ అన్నారు. -
నిర్లక్షయం ఎప్పటికి తొలిగేనో?
[ 15-06-2024]
కఠినమైన రాయిని అందమైన శిల్పంగా మార్చడంలో ఆళ్లగడ్డ శిల్పులు నేర్పరులు. రాయిని శిల్పంగా మార్చే క్రమంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న అధునాతన పరికరాల కారణంగా రాతి దుమ్ము శిల్పుల పాలిట శాపంగా మారుతోంది. -
క్రికెట్లో గెలుపు కెరటాలు
[ 15-06-2024]
ఒకరు తన బ్యాటింగ్ స్టైల్తో పరుగుల వర్షం కురిపిస్తే.. మరొకరు తన బౌలింగ్ వేగంతో ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారి క్రికెట్ క్రీడలో తమ సత్తా చాటుతున్నారు ఇద్దరు క్రీడాకారిణులు. -
జత పొట్టేళ్లు.. రూ.1.10లక్షలు
[ 15-06-2024]
ముస్లింల బక్రీద్ పండగ పురస్కరించుకొని పొట్ట్టేళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. ధరలు ఒక్కసారిగా అధికమయ్యాయి. -
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి
[ 15-06-2024]
సమాజంలో యువతకు రక్తదానంపై అపోహలతో ముందుకు రావడం లేదని, వాటిని వీడి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. -
ఎల్లార్తి దర్గా ఈవోపై దాడి
[ 15-06-2024]
హొళగుంద మండలంలో ప్రసిద్ధి గాంచిన ఎల్లార్తి షేక్షావలి, షాషావలి దర్గా ఓ వర్గం పరిధిలో కార్యకలాపాలు సాగేవి. -
రూ.18లక్షల విలువైన సొమ్ము స్వాధీనం
[ 15-06-2024]
కారు డ్రైవర్గా ఉద్యోగానికి చేరిన ఇంటికే కన్నాం వేసి బంగారం, నగదును దొంగలించిన ఘటన దొర్నిపాడు మండలంలోని డబ్ల్యూకొత్తపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘మౌస్ జిగ్లింగ్’ చేస్తున్నారని ఉద్యోగులపై కంపెనీ వేటు.. ఇంతకీ ఏంటిది?
-
ఆ మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి.. ప్రజలకు మేలు చేస్తా: పవన్
-
పేపర్ లీక్కు రూ.30 లక్షలు: ‘నీట్’ దర్యాప్తులో సంచలనాలు..!
-
మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్
-
ఫ్రాన్స్ అధ్యక్షుడి వైపు మెలోనీ సీరియస్ లుక్ : వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM