పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు.
కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోని ప్రభుత్వం
రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ లేనట్లే
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు.. ప్రభుత్వం ఇప్పటికీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోలేదు.. రైతు భరోసా కేంద్రాల్లో ఇచ్చేందుకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు.. అన్నదాతలు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.. కర్షకుల అవసరాలను పలువురు వ్యాపారంగా మల్చుకొంటున్నారు.. దీంతో ఏటా పొలాల్లో నకిలీ విత్తనాలు నాట్యం చేస్తున్నాయి... పంటను గులాబీ పురుగు తొలిచేస్తోంది... ఆశించిన దిగుబడులు రావడం లేదు...
న్యూస్టుడే, కర్నూలు వ్యవసాయం
రైతులపై రూ.2.20 కోట్ల భారం
ఉమ్మడి కర్నూలులో పత్తి సాధారణ సాగు 2,69,275 హెక్టార్లుగా ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 20 లక్షల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం.. అందులో ఒక్క కర్నూలు జిల్లా రైతులకే 16-17 లక్షల ప్యాకెట్లు కావాల్సి ఉంటుంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ప్యాకెట్ ధర రూ.11 పెరిగి రూ.864కు చేరింది. ఇందులో 450 గ్రాముల విత్తనాలు ఉంటాయి.. రైతులపై రూ.2.20 కోట్ల విత్తన భారం పడనుంది. పరీక్షలు చేసిన నాణ్యమైన విత్తనాలనే రైతులకు ఇస్తామన్న ప్రభుత్వం... ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. పత్తి రైతుల్ని నకిలీ విత్తనాల వ్యాపారులకు, పురుగు మందుల సంస్థలకు అప్పగించి చోద్యం చూస్తోంది.
తనిఖీలు చేస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
ప్రణాళిక రూపొందించని అధికారులు
నాణ్యమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేస్తామని వైకాపా ప్రభుత్వం గొప్పగా చాటింపేసుకుంటోంది. ఉమ్మడి జిల్లాకు ఆర్బీకేల ద్వారా వెయ్యి ప్యాకెట్లు ఇవ్వడం లేదు. ఈసారి ముందస్తుగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులకు అవసరమైన విత్తనాలపై జిల్లా వ్యవసాయశాఖ ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేయలేదు. విత్తన కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోలేదు. రైతులంతా ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిందే.. వాటిలో నాణ్యత ఎంతో అధికారులకే తెలియాలి.. నకిలీ విత్తనాల కారణంగా మూడేళ్లుగా తెల్లబంగారం ఆశించిన దిగుబడి రావడం లేదు.. పత్తి సాగు చేసిన రైతులు అప్పులు ఊబిలో చిక్కుకుంటున్నారు.
అధిక ధరలకు అంటకడుతున్నారు
ఎమ్మిగనూరు పట్టణంలో ఆదిత్య ట్రేడర్స్, పంచముఖి పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, శివ కిరణ్ ట్రేడర్స్ దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. నిర్ణీత ధర కంటే అధికంగా విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో వెలుగు చూసిందని విజిలెన్స్ సీఐ కె.సునీల్కుమార్ తెలిపారు. రూ.1.85 లక్షల జరిమానా విధించి... రూ.2.54 లక్షల విలువ చేసే విత్తనాలు స్వాధీనం చేసుకొన్నామన్నారు.
2021లో రూ.16.91 కోట్ల నష్టం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2021 ఖరీఫ్లో కావేరీ పత్తి విత్తన కంపెనీకి సంబంధించిన జాదు, ఏటీఎం రకాలు సాగు చేసి రైతులు నష్టపోయారు. ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విత్తన లోపంతోనే నష్టం జరిగిందని గుంటూరు లాంఫాం శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో 16 మండలాల్లో 1,899 మంది రైతులకు సంబంధించి 7,257 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు జిల్లాస్థాయి కమిటీ తేల్చింది. ఎకరాకు 3 క్వింటాళ్ల మేర నష్టం జరిగినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.5,500 ఉండగా బహిరంగ మార్కెట్ ధర ప్రకారం (మధ్యస్త ధర) క్వింటా రూ.7,769 ప్రకారం నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఒక్కో రైతుకు 3 క్వింటాళ్లకు కలిపి రూ.23,307 పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. 1,899 మంది రైతులకు కావేరీ జాదు కంపెనీ రూ.16.91 కోట్ల పరిహారం ఇవ్వాలని అప్పటి కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తూ కంపెనీకి ఉత్తర్వులు పంపారు. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు.
అన్నదాత ఆవేదన వినని అధికారులు
2022 ఖరీఫ్లో ఉమ్మడి జిల్లాలో 2.75 లక్షల హెక్టార్లకు పైగా పత్తి సాగయ్యింది. రైతుల డిమాండు మేరకు విత్తనాలు ఇవ్వలేదు. నాసిరకం.. నాణ్యతా లోపం కలిగిన విత్తనాలు బయట మార్కెట్లో విక్రయించారు. పత్తి కొమ్మలు ఏపుగా పెరిగినా పూసిన పూత రాలిపోవడం, కాయలు లేకపోవడంతో.. దిగుబడులు తుడిచిపెట్టుకుపోయాయి. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఎకరాకు క్వింటా దిగుబడి రాని పరిస్థితి నెలకొంది. దీన్ని తొలగించి రబీలో శనగ పంట సాగు చేశారు. విత్తన లోపంతోనే పంట దిగుబడులు రాలేదని.. ఎకరాకు 1-2 క్వింటాళ్ల దిగుబడులు కూడా రాలేదని అన్నదాతలు మొరపెట్టుకున్నా.. వారి ఆవేదనను శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. పంటల బీమాతో కొంతమేర ఆదుకున్నా.. పెద్దగా కర్షకులకు అక్కరకు రాలేదు.
గతేడాది భారీగా నష్టం
గత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాధారణం కంటే తక్కువగా పత్తి సాగైంది. కర్నూలు జిల్లాలో పత్తి సాధారణ సాగు 2.50 లక్షల హెక్టార్లు కాగా.. 2.03 లక్షల హెక్టార్లు అంటే 80.96 శాతం మేర సాగు చేశారు. నంద్యాల జిల్లాలో 25,586 హెక్టార్ల సాధారణ సాగు కాగా.. 10,411 హెక్టార్లలో 45 శాతం మేర సాగైంది. ఉమ్మడి జిల్లాలో 60 వేల హెక్టార్లలో విత్తనమే పడలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎకరాకు 1-2 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. పెట్టుబడులు.. కూలీల ఖర్చులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. వరుసగా మూడేళ్లపాటు తెల్ల బంగారాన్ని నమ్ముకున్న రైతులకు చివరికి అప్పులే మిగిలాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాహన తనిఖీల్లో కర్ణాటక మద్యం స్వాధీనం
[ 01-06-2024]
నియోజకవర్గంలోని నందవరం మండలంలోని కనకవీడు సమీపంలో సెబ్ అధికారులు వాహన సోదాలు నిర్వహించారు. -
మండలంలో సర్వసభ్య సమావేశం
[ 01-06-2024]
చాగలమర్రి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని ఆయా శాఖల అధికారుల పరిధిలో జరిగిన పురోగతిని వినిపించారు. -
కౌంటింగ్ నిర్వహిణపై శిక్షణ కార్యక్రమం
[ 01-06-2024]
స్థానిక కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
మండలకేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు
[ 01-06-2024]
మండల కేంద్రమైన సీ బెళగల్లోని అంజన్న ఆలయాల్లో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ
[ 01-06-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. -
సర్వజన.. నిత్యం అవస్థేనా..
[ 01-06-2024]
సర్వజన ఆసుపత్రిలోని వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించారు. మౌలిక వసతులు కల్పించడంలో విఫమయ్యారు. -
నమ్మితే.. నట్టేట మునిగినట్లే
[ 01-06-2024]
:సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరగాడి ప్రకటన ఆదోని నేరవిభాగం ూసి ఆదోనికి చెందిన రాముడు రూ.5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. -
అక్కాచెల్లెళ్లు..అందెల రవళులు
[ 01-06-2024]
తోడుగా పుట్టారు.. జోడీగా కూచిపూడి నేర్చుకుంటున్నారు. పదెళ్ల వయసులో నృత్యంపై పట్టుసాధించారు. ఆ చిన్నారులు ప్రదర్శనలిస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు -
ఎన్నికల ఫలితాలు త్వరితగతిన మీడియాకు అందిస్తాం: కలెక్టర్
[ 01-06-2024]
జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున రాయలసీమ యూనివర్సిటీలో మీడియా, కమ్యూనికేషన్ సెంటర్ల ద్వారా త్వరితగతిన ఫలితాలను మీడియాకు అందిస్తామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. -
మట్టిపై కన్ను.. అధికారం దన్ను
[ 01-06-2024]
నియోజకవర్గ పరిధిలోని అటవీ, ప్రభుత్వ భూముల్లో ఇప్పటివరకు మట్టిని తవ్వి సొమ్ము చేసుకున్న అక్రమార్కులు ప్రస్తుతం చెరువులపై కన్నేశారు. -
అర్ధరాత్రి మృత్యుఘోష
[ 01-06-2024]
అర్ధరాత్రి.. అంతా నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా వాహనం కుదుపునకు గురైంది.. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.. తేరుకునే సరికి రక్తపు మడుగులో పడున్నారు. -
నిర్వహణ.. దిగువకే
[ 01-06-2024]
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి కర్నూలు జిల్లాలోకి దిగువ కాలువ ప్రవహిస్తుంది. -
మండుటెండలో.. పండుటాకులు
[ 01-06-2024]
సామాజిక భద్రత పింఛనుదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. వారిని గత రెండు నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. -
గడువు ముగిసింది.. ఆందోళన మిగిలింది
[ 01-06-2024]
కర్నూలు నగర పరిధిలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు నగరపాలక సంస్థ గతేడాది తాత్కాలిక ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులను నియమించుకుంది. -
గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి
[ 01-06-2024]
కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఏజెంటు ను తనిఖీ చేసి అనుమతించాలని, ఆర్వోలు జారీ చేసిన గుర్తింపు కార్డు ఉంటేనే లోపలకు పంపాలని కర్నూలు రేంజి డీఐజీ విజయరావు ఆదేశించారు. -
ఏటి ఒడ్డున భూచోళ్లు
[ 01-06-2024]
నగరంలో హంద్రీ ఒడ్డున 12వ వార్డు పరిధిలోని కేవీఆర్ గార్డెన్లో అనధికారిక భవన నిర్మాణం చేపట్టారు. స్థానికుల నుంచి నగరపాలక అధికారులకు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో 10వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్రాజ్
-
ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన యూనియన్ బ్యాంక్.. లేటెస్ట్ రేట్లు ఇవే..
-
గంభీర్ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్ చేయగలడు: గంగూలీ
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ