logo

భారాస, భాజపా మాటలు నమ్మొద్దు : మంత్రి జూపల్లి

భారాస, భాజపా నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు.

Published : 29 Apr 2024 05:11 IST

అయ్యవారిపల్లిలో కార్యకర్తలతో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

చిన్నంబావి, న్యూస్‌టుడే : భారాస, భాజపా నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన పథకాలను చూసి భాజపా, భారాస నాయకులు ఓర్వడం లేదని విమర్శించారు. మోసపూరిత మాటలతో మరోసారి ప్రజల్ని మభ్యపెట్టాలని వారు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్లు లేని పేదలకు త్వరలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, నాయకులు నరసింహారెడ్డి, రాంచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్‌, కల్యాణరావు, చిదంబర్‌ రెడ్డి, బీచుపల్లి, సాగర్‌ రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని