అక్రమ సాగు పట్టదరొయ్యా!
డాలర్ల పంటగా గుర్తింపు పొందిన రొయ్యల సాగు జిల్లాలో 50 వేల ఎకరాల వరకు ఉంది. వీరిలో ఎంతోమంది సాగుదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి చెరువులుగా మారుస్తున్నారు. అనుమతులు లేకుండా ఇష్టారీతిన పెంచుతున్నారు. ఫలితంగా సమీప ప్రాంతాల్లోని భూ
న్యూస్టుడే, కావలి : డాలర్ల పంటగా గుర్తింపు పొందిన రొయ్యల సాగు జిల్లాలో 50 వేల ఎకరాల వరకు ఉంది. వీరిలో ఎంతోమంది సాగుదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి చెరువులుగా మారుస్తున్నారు. అనుమతులు లేకుండా ఇష్టారీతిన పెంచుతున్నారు. ఫలితంగా సమీప ప్రాంతాల్లోని భూములు కలుషితమవుతున్నాయి. నిస్సారంగా మారి సాగుకు పనికిరావడం లేదని రైతులు వాపోతున్నారు. తీరప్రాంతంలో సముద్ర జలాలు విషతుల్యంగా మారుతున్నాయి. అధికారులకు తెలిసినా కళ్లుండీ చూడలేకపోతున్నారు.
అనుమతుల్లేని వాటిపై చర్యలేవీ?
అనుమతుల్లేని రొయ్యల సాగుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. ఇందుకోసం ఆక్వా కల్చర్ అభివృద్ధి అథారిటీ చట్టం -2020 తీసుకొచ్చింది. ఎవరైనా కొత్తగా సాగు చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. రెండు హెక్టార్లలోపు వారికి మండల స్థాయిలో, ఆపై విస్తీర్ణంలో ఉంటే రాష్ట్ర కార్యదర్శి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. పాత సాగుదారులు కూడా విధిగా అనుమతులు పొందాలి. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా సాగును గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అయినా అక్రమాలు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు.
తీరానికి 200 మీటర్లకు పైనే..
సముద్ర తీర ప్రాంతానికి 200 మీటర్లు, సంప్రదాయ పంటలకు 50 మీటర్ల దూరంలో ఉండాలి.గత మార్చి నెలాఖరుతోనే ఆప్సడా కింద అనుమతులు పొందాలని నిర్దేశించారు. కానీ ఇవేమీ పాటించడం లేదు. పంట పొలాలు, సముద్రం, పెన్నా నది గర్భంలో చెరువులు ఉన్నాయి.
తీరమే అడ్డా
సముద్ర తీర ప్రాంతంపై నిఘా లేకపోవడం అక్రమసాగుదారులకు వరంగా మారింది. కావల్సిన మేరకు కబ్జా చేసి గుంతలుగా మారుస్తున్నారు. మనుబోలు మండలం నుంచి ఉలవపాడు వరకు వేలాది ఎకరాల్లో అక్రమంగా రొయ్యల సాగు ఉంది. ఇందులో అనుమతి లేనివే ఎక్కువ. మత్స్యశాఖ అధికారులు మాత్రం పదో వంతు కూడా గుర్తించడం లేదు. కోస్తా ప్రాంతంలో ఉండే మడ అడవులను నరికి సాగు చేస్తున్నా, అటవీ శాఖ నుంచి అభ్యంతరాలుండవు. దేవాదాయ భూములు, రెవెన్యూ శాఖకు సంబంధించిన పోరంబోకు భూముల్లో కూడా నిబంధనలను ఉల్లంఘించి సాగు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పెన్నా నదికి ఇరువైపులా మండలాల్లో అనుమతి లేని రొయ్యల సాగు భారీగా ఉంది. వీరి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇది కావలి మండలంలో రొయ్యల సాగు నిమిత్తం సన్నద్ధం చేస్తున్న గుంత. ఇది కొత్తసత్రం, రెడ్డిపాళెం గ్రామాల నడుమ వివాదానికి కారణమైంది. అనుమతి లేని సాగును సహించబోమని రెడ్డిపాళెం వాసులు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని కొత్తసత్రం గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
నియంత్రిస్తాం : నాగేశ్వరరావు, సంయుక్త సంచాలకులు, మత్స్య శాఖ
అనధికారిక రొయ్యల సాగును నియంత్రిస్తాం. ఈనెలాఖరులోగా అప్సడాలో అనుమతులు పొందాలి. అనుమతులుంటేనే విద్యుత్తు సరఫరాలో రాయితీ అందుతుంది. అనుమతుల మంజూరు అనేది నిరంతరం సాగే ప్రక్రియ.
ఇదీ పరిస్థితి
జిల్లాలో మొత్తం మండలాలు : 38
రొయ్యల సాగు జరిగేది: 26
అనుమతులు తీసుకున్నవారు : 3,000
అనుమతి పొందిన విస్తీర్ణం: 9,700 ఎకరాలు
ఉల్లంగించిన వారు: 90 మంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
[ 27-04-2024]
దగదర్తిలోని పెద్దపుత్తేడు గ్రామం అరుంధతి వాడలో మండల తెదేపా నాయకుడు మాలేపాటి రవీంద్ర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు