logo

తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం

దగదర్తిలోని పెద్దపుత్తేడు గ్రామం అరుంధతి వాడలో   మండల తెదేపా నాయకుడు మాలేపాటి రవీంద్ర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 27 Apr 2024 09:58 IST

కావలి: దగదర్తిలోని పెద్దపుత్తేడు గ్రామం అరుంధతి వాడలో   మండల తెదేపా నాయకుడు మాలేపాటి రవీంద్ర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి  గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. తెదేపా అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3వేలు నిరుద్యోగ భృతి అందిచనున్నట్లు చెప్పారు. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 అందిస్తారని, ప్రతి రైతుకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తామని, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500,  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఒకటో తేదీన  వృద్ధులు, వితంతువులకు ఇంటి వద్దకే రూ.4 వేల పింఛను అందిస్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని