తెదేపా సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
దగదర్తిలోని పెద్దపుత్తేడు గ్రామం అరుంధతి వాడలో మండల తెదేపా నాయకుడు మాలేపాటి రవీంద్ర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కావలి: దగదర్తిలోని పెద్దపుత్తేడు గ్రామం అరుంధతి వాడలో మండల తెదేపా నాయకుడు మాలేపాటి రవీంద్ర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. తెదేపా అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3వేలు నిరుద్యోగ భృతి అందిచనున్నట్లు చెప్పారు. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 అందిస్తారని, ప్రతి రైతుకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తామని, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులకు ఇంటి వద్దకే రూ.4 వేల పింఛను అందిస్తామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశ్నించడమే నేరం.. అరాచకానికి ఊతం
[ 08-05-2024]
వైకాపా పాలనలో ఆగడాలు, ఆరాచకాలు జిల్లాలో నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. వాటిని ప్రశ్నించిన తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులపై అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులతో చెలరేగిపోయారు. -
అమ్మ ఒడి.. ఆవేదనా జడి
[ 08-05-2024]
నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడికి జగన్ రకరకాల కొర్రీలు వేశారు. గెలవక ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికి అమ్మఒడి అని చెప్పి.. గెలిచాక లేదు లేదు ఒక్కరికే అన్నారు. -
అయిదేళ్ల పాలన.. ఆటలకేదీ ఆలన?
[ 08-05-2024]
క్రీడాకారులకు జిల్లా పెట్టింది పేరు.. ఇక్కడి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వైకాపా ప్రభుత్వ పుణ్యమాని క్రీడాభివృద్ధికి ఎలాంటి పథకాలు అందజేయలేదు. -
తెదేపా ఏజెంట్ గెంటివేతపై విచారణ
[ 08-05-2024]
సర్వేపల్లి నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంట్గా ఉన్న సండి రమేశ్ను అక్కడి నుంచి పోలీసులు గెంటేసిన సంఘటనపై మంగళవారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. -
వైకాపా బరితెగింపు
[ 08-05-2024]
అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొని గెలిచేందుకు అడ్డదారులు ఎంచుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల వద్దే ఈ భాగోతం నడవడం విశేషం. -
ప్రశాంత ఎన్నికలకు చర్యలు
[ 08-05-2024]
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం నగరపాలకసంస్థలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో పోలీసు అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. -
అందని డ్రోన్లకు అన్నదాతల ఎదురుచూపు
[ 08-05-2024]
నూతన సాంకేతికతతో సాగు, రసాయనిక మందుల పిచికారితో.. పెట్టుబడుల ఖర్చు తగ్గడంతోపాటు వ్యవసాయ లాభసాటి కాగలదని రాష్ట్ర ప్రభుత్వ పాలకులు చెప్పారు. -
బాబుతోనే యువతకు భవిత
[ 08-05-2024]
వైకాపా ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదని, ఓ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదని సినీ కథానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు నారా రోహిత్ తెలిపారు. -
‘వైకాపాకు బుద్ధి చెబుతాం’
[ 08-05-2024]
గిరిజన జాతిని చిన్నచూపు చూస్తున్న వైకాపా నాయకులకు బుద్ధి చెపుతామని వెన్నెలకంటి రాఘవయ్య మెమోరియల్ గిరిజన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీనివాసులు పేర్కొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
[ 08-05-2024]
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. వివరాలిలా.. మనుబోలు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?