వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...
ఆల్తుర్తి వద్ద పైపుల ఆధారంతో ప్రమాదకరంగా ఉన్న వంతెన
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి... ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాలతో పాటు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల్లో వైకాపా ప్రభుత్వం ఒక్క వంతెన నిర్మించ లేదు. కనీసం మరమ్మతులు చేయకుండా వదిలేశారు... రక్షణ గోడలు లేక, గుంతలు పడి, రాళ్లు తేలి చప్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి..
నావూరుపల్లి వాగుపై వంతెన లేక నడిచి వెళుతున్న గ్రామస్థులు (పాతచిత్రం)
పొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో వర్షాకాలంలో వాగులపై వంతెనలు లేక ఇబ్బందులు పడుతుండగా కొన్ని శిథిలావస్థకు చేరాయి. తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో వాగుల వద్ద వంతెనల దుస్థితిపై ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పొదలకూరు మండలంలో ఆల్తుర్తి వద్ద వంతెనకు కొన్ని చోట్ల రంధ్రాలు పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులు చేసి సరిపెట్టారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. నిధులు మంజూరయ్యాయని అధికారులు ప్రకటించారు. డైవర్షన్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పనులు చేపట్టకపోవడంతో ఎదురుచూపులే మిగిలాయి. దీంతోపాటు నావూరు పెద్దవాగు, వాగుపై ఉద్ధృతిగా నీరు ప్రవహిస్తోంది. వీటిపై వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామన్నా ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. వర్షాకాలంలో వాగు దాటి చిన్నారులతో వెళుతున్నామని మాగోడు వినేవారేలేరని గ్రామస్థులు వాపోతున్నారు. పొదలకూరు-రాపూరు ప్రధాన రహదారిపై ఉండే డేగపూడి వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వర్షాకాలంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
ఆత్మకూరు గ్రామీణం: ఆత్మకూరు నియోజకవర్గంలోని అనుమసముద్రంపేట, అనంతసాగరం, సంగం, చేజర్ల, మర్రిపాడు మండలాల్లో వర్షాలు పడితే పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి. మర్రిపాడు మండలంలోని సన్నోరుపల్లి, భీమవరం వద్ద బొగ్గేరుపై నిర్మించిన చప్టాలకు, పి.ఎన్.పల్లి, చుంచులూరు వద్ద కేతామన్నేరుపై నిర్మించిన వంతెనలకు రక్షణ దిమ్మెలు లేవు. వర్షాకాలం చప్టాపై నీరు ప్రవహించే సమయంలో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రాకపోకలు సాగించే సమయంలో కొందరు అదుపు తప్పి కింద పడిన సంఘటనలున్నాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గతంలో బొగ్గేరు చప్టాను పరిశీలించి ఎత్తు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.
విడవలూరు: కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు, విడవలూరు, బుచ్చి, ఇందుకూరుపేట మండలాల్లో వంతెనలు కూలిపోయేలా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వర్షాలకు కూలిపోయిన వాటిని సైతం కనీసం నిర్మాణ పనులు చేపట్టలేదు. ః విడవలూరు మండలంలోని ఊటుకూరు-పల్లిపాలెం వద్ద చింతపండేరుపై వంతెన నాలుగేళ్ల క్రితం వచ్చిన వరదలకు కూలిపోయింది. వైకాపా పాలనలో ఇప్పటి వరకు నిర్మించలేదు. తాత్కాలికంగా మట్టితో చదునుచేసి వదిలేశారు. మళ్లీ వరదలొస్తే మట్టి కొట్టుకుపోవడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ః ముదివర్తిలో మలిదేవి వాగుపై ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వంతెన చేపట్టు గోడలు విరిగిపోయాయి. వంతెన పగుళ్లిచ్చి కూలేందుకు సిద్ధంగా ఉంది. ః విడవలూరులోని జాన్పేట వద్ద మలిదేవి డ్రెయిన్పై వంతెన ప్రమాదకరంగా ఉంది. వర్షా కాలంలో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ః గాదెలదిన్నె వద్ద పైడేరుపై వంతెన నిర్మించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ః ముదివర్తి-ముదివర్తిపాలెం మద్య పెన్నానదిపై కాజ్వే నిర్మాణం పూర్తి చేస్తానన్న వైకాపా ప్రభుత్వం దాని ఊసే విస్మరించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరికలు
[ 06-05-2024]
సర్పంచ్ అభ్యర్థి ప్రభాకర్ గౌడ్, వెంకటస్వామి, రామకృష్ణ, వెంకటకృష్ణ, ఆధ్వర్యంలో కావలి మండలం చెంచు గాని పాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. -
తెదేపాలో చేరిన ఆరుగురు వాలంటీర్లు
[ 06-05-2024]
కావలి పట్టణంలోని 9వ వార్డుకు చెందిన ఆరుగురు వాలంటీర్లు తెదేపాలో చేరారు. -
బ్యాలెట్ పేపర్పై అవగాహన కలిగించాలి
[ 06-05-2024]
కావలిలోని తెదేపా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో 23వ వార్డ్లో సమావేశం నిర్వహించారు. -
తెదేపాలో చేరికలు
[ 06-05-2024]
దగదర్తి మండలం యలమంచిపాడు పంచాయతీకి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. -
రాకాసి చట్టం.. రాబందులకే చుట్టం!
[ 06-05-2024]
కొత్త చట్టంలో టీఆర్వోలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. ఏ స్థాయి అధికారికి బాధ్యత అప్పగిస్తారనే దానిపై స్పష్టత లేదు. -
నెల్లూరు గళం పార్లమెంట్లో వినిపిస్తాం
[ 06-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు గతంలో ఈ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇక్కడి సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగం.. తొలిరోజే గందరగోళం!
[ 06-05-2024]
జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్కు దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఒక్కరితో బోధనెలా మామయ్యా!
[ 06-05-2024]
కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. -
ఈ జలం గరళం
[ 06-05-2024]
వేసవికాలం వచ్చింది. తాగునీటి వనరులు అడుగంటి కలుషితమవుతాయి. ఈనీరు తాగి వ్యాధులు ప్రబలుతాయి. -
పింక్ మోడల్ పోలింగ్ కేంద్రం ప్రారంభం
[ 06-05-2024]
పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పింక్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జనరల్ పరిశీలకులు రామ్కుమార్గౌతమ్, సబ్కలెక్టర్ జి.విద్యాధరి ప్రారంభించారు. -
అంబటి చెప్పినా ఏదీ ఫలితం?
[ 06-05-2024]
మెరుపు వరదలకు.. పెన్నానది పెట్టింది పేరు. దీనికి కుందు, సగిలేరు, చెయ్యేరు, గుంజనవాగు, పాపాఘ్ని, జయమంగళ, తీతా, బీరాపేరు, బొగ్గేరు తదితర వాగులు, ఉపనదులు ఉన్నాయి. -
మంచి పేరున.. ముంచిన జగన్
[ 06-05-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు. -
క్షేత్ర సహాయకుడి సస్పెన్షన్
[ 06-05-2024]
కొండికందుకూరు ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు ఏపీవో సుజాత తెలిపారు. -
విష గుళికలు మింగి..
[ 06-05-2024]
జలదంకికి చెందిన మింగికళ్లోల వెంకయ్య (40) - వెంగమ్మ దంపతులు కూలీ పనుల కోసం కొన్నిరోజుల క్రితం కరీంనగర్ జిల్లా బంజరుపల్లికి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు