ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం
తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం జిల్లాలో మొదలైంది. కీలకమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియ అక్టోబరు 1వతేదీ(శనివారం) నుంచి ప్రారంభమైంది.
ప్రారంభమైన ఓటర్ల నమోదు ప్రక్రియ
ఈనాడు డిజిటల్, నెల్లూరు: జడ్పీ, న్యూస్టుడే: తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం జిల్లాలో మొదలైంది. కీలకమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియ అక్టోబరు 1వతేదీ(శనివారం) నుంచి ప్రారంభమైంది. ఆ మేరకు కలెక్టర్.. ఓటరు నమోదు రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు నమోదు చేసుకునేందుకు తమ పరిధిలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వైకాపా, తెదేపా అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
గతంలో నమోదైన ఓట్లు రద్దు
జిల్లాలో 2017లో శాసన మండలి ఎన్నికలు జరిగాయి. అప్పటి ఓటర్ల జాబితా ప్రకారం.. దాదాపు 64 వేల మంది పట్టభద్రులు, ఉపాధ్యాయలు ఉన్నారు. వాటిని రద్దు చేశారు. వీరితో పాటు.. కొత్తవారు ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇందుకు పట్టభద్రులు ఫారం-18, ఉపాధ్యాయులు ఫారం-19ను www.ceoandhra.nic.in వైబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా చిత్తూరు జిల్లా డీఆర్వో వ్యవహరిస్తుండగా- మిగిలిన జిల్లాల డీఆర్వోలు అదనపుఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఈ ప్రక్రియలో దాదాపు మూడు జిల్లాలకు చెందిన 258 మంది అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. నవంబరు 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పాత జిల్లా లెక్కల ప్రకారం 46 మండలాల పరిధిలో దాదాపు లక్ష మంది వరకు ఓటు కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇంటి చిరునామా, 2019 అక్టోబరు 31 నాటికి డిగ్రీ పూర్తి చేసినట్లు గెజిటెడ్ అధికారులు ధ్రువీకరించిన డిగ్రీ మార్కుల జాబితా జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జతచేయాలి. పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటో అందజేయాలి. దరఖాస్తులో ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి. ఏక మొత్తం(బల్క్గా) దరఖాస్తులను స్వీకరించరు. ఒకే చిరునామాలో నలుగురైదుగురు ఉంటే అవన్నీ ఒకరు అందజేయవచ్చు.
రంగంలోకి రాజకీయ పార్టీలు .. అధికార వైకాపాతో పాటు తెదేపా, వామపక్షాలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. వైకాపాలో పట్టభద్రుల అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పి.చంద్రశేఖర్రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. తెదేపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ పేరును ఖరారు చేశారు. ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఎమ్మెల్సీలు యండపల్లి శ్రీనివాసులరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. వామపక్షాల నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి మూడుసార్లు మాత్రమే అధికార పగ్గాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈసారి కొత్తవారిని ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఆదివారం తుది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు