విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు యువకుల మృతి
యువకుల ఈత సరదా ఆ కుటుంబంలో విషాదం నింపింది. పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృతిచెందారు.
అనంతసాగరం, న్యూస్టుడే: యువకుల ఈత సరదా ఆ కుటుంబంలో విషాదం నింపింది. పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృతిచెందారు. మండలంలోని పాతాళపల్లి సమీపంలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పాతాళపల్లికి చెందిన మిట్టమాల వంశీకృష్ణ(25), మిట్టమాల పెంచల నరసింహులు(23) నెల్లూరుకు చెందిన మరో ముగ్గురితో కలసి పెన్నానదిలో స్నానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉప్పలపాడు గ్రామం వద్ద వంతెన కింద పెన్నా నదిలో ఈతకు వెళ్లారు. ముందుగా ఈతరాని పెంచల నరసింహులు నదిలోకి దిగి ఒక్కసారిగా అందులో మునిగిపోయారు. గమనించిన అన్న వంశీకృష్ణ తమ్ముడిని కాపాడే క్రమంలో నదిలోకి దిగి తానూ గల్లంతయ్యారు. పక్కనే ఉన్న స్నేహితులు గమనించి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వారు చరవాణి ద్వారా తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృత్యువాత పడిన వంశీకృష్ణ మృతదేహాన్ని వెలికి తీశారు. గాలింపు అనంతరం నరసింహులు మృతదేహం బయటపడింది. ఆత్మకూరు సీఐ వేణు, ఎస్.ఐ.లు సుబ్బారావు, ముత్యాలరావు, అయ్యప్ప గజ ఈతగాళ్లతో శవాలను వెలికితీయించారు. మిట్టమాల చిన్న వెంకటయ్య, పెంచలమ్మ దంపతులకు ముగ్గురు కుమారుల్లో వంశీకృష్ణ, పెంచల నరసింహులు రెండు, మూడోవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావలిని అభివృద్ధి చేస్తా: కావ్య క్రిష్ణారెడ్డి
[ 15-05-2024]
కావలి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని కావలి తెదేపా అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. -
ఈవీఎంలలో బలాలు.. బయట బలగాలు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా పూర్తి చేసిన యంత్రాంగం- అభ్యర్థుల రాజకీయ భవితవ్యం నిక్షిప్తమైన ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. -
పైపైన ధీమా.. లోలోన గుబులు
[ 15-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్శాతాలు తేలాయి. దీంతో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయనే లెక్కల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు మునిగిపోయారు. -
అంచనాలకు మించి పోలింగ్
[ 15-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. మీట నొక్కితే ఫలితాలు వెల్లడవుతాయి. దానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. మరోవైపు జిల్లాలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. -
నత్తనడకన.. రక్షణ గోడ పనులు
[ 15-05-2024]
వరద ముప్పు తప్పించేందుకు.. లోతట్టు ప్రాంతంలోకి నీరొచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. రక్షణగా నిర్మిస్తున్న పెన్నా రీటైనింగ్ వాల్ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. -
తిరుగు పయనానికి నిరీక్షణే
[ 15-05-2024]
ఎన్నికల్లో ఓటేసి.. తిరుగు పయనమైన జిల్లావాసులకు బస్సులు లేక నిరీక్షణ తప్పలేదు. -
తిరగని ఫ్యాన్లు.. అధ్వాన మరుగుదొడ్లు..
[ 15-05-2024]
జిల్లాకే తలమానికమైన జీజీహెచ్లో సమస్యలు తాండవిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. -
ఏదీ అక్షర చైతన్యం?
[ 15-05-2024]
దేశం అక్షరాస్యతలో దూసుకుపోతుంటే జిల్లా వెనుకంజలో ఉంది. బడిఈడు పిల్లల నుంచి పెద్దల వరకు చదువులో వెనుకబడ్డారు. అక్షరాస్యత పెంచేందుకు కేంద్రం ఏటా లక్షల రూపాయలు వెచ్చిస్తోంది. -
అదనపు చెల్లింపులు లేక ఆవేదన
[ 15-05-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో ఉపాధి పనులకు దివ్యాంగులు వస్తే రూ. 10, దూరప్రాంతాల్లో పనులకు వెళ్తే రూ. 20 అదనంగా చెల్లించారు. -
పల్లెటూరి కుర్రోడు.. క్రీడల్లో ధీరుడు
[ 15-05-2024]
అతను పల్లెటూరిలో పుట్టాడు. క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. కఠోర సాధన చేశాడు. పోటీల్లో సత్తా చాటాడు. ఎన్నో పతకాలు సాధించాడు. -
పెరిగిన సపోటా ధరలు
[ 15-05-2024]
ఉలవపాడులోని అంతరాష్ట్ర సపోటా మార్కెట్లో మంచి ధరలు పలుకుతున్నాయి. ఫారిన్ రకం రూ.800, పాల రకం రూ.700, బిళ్ల రకానికి రూ.550 పలుకుతున్నాయి. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
[ 15-05-2024]
రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురు ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి రాళ్లపాడు బంగ్లా వద్ద చోటుచేసుకుంది. ఎస్సై బాజీబాబు అందించిన వివరాలిలా ఉన్నాయి. -
పత్తి రైతు చిత్తు
[ 15-05-2024]
తెల్ల బంగారం సాగు చేసిన రైతులకు ఆశించిన రీతిలో ధర లభించకపోవడంతో కష్టానికి తగిన ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే సాగు విస్తీర్ణం పెరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
సామ్ కరన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ను ఓడించిన పంజాబ్
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్