ఫలితాలపై పందేల జోరు!
ఓ వైపు ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా జరుగుతుండగా- మరోవైపు ఎన్నికల ఫలితాలపై పందేల హోరు పెరిగింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయి మూడు రోజులు కాలేదు.
కూటమి గెలుస్తుందని పెట్టే వారిలో జోష్
అంతా గుట్టుగా జరుగుతున్న వ్యవహారం
ఈనాడు, నెల్లూరు: ఓ వైపు ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా జరుగుతుండగా- మరోవైపు ఎన్నికల ఫలితాలపై పందేల హోరు పెరిగింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయి మూడు రోజులు కాలేదు. బెట్టింగ్ కేంద్రాలను తెరిచేశారు. పార్టీల వారీగా సాధించే స్థానాలు, ఆధిక్యాలు, ఎన్నిచోట్ల గెలిచే అవకాశం ఉంది? కీలక స్థానాల్లో ఎవరు గెలుస్తారనే అంశాలపై ప్రధానంగా బెట్టింగ్లు మొదలయ్యాయి. నగర కేంద్రంగా బడాబాబులు మొత్తం బెట్టింగ్ రాయుళ్లుగా మారిపోగా- ఇప్పటికే రూ. కోట్లలోనే పందేలు జరిగినట్లు సమాచారం. ఇక్కడ కూటమి మద్దతుదారులు ఎక్కువగా ఒకటికి ఒకటిన్నర రెట్లు ఇచ్చేందుకు సిద్ధపడగా- మిగిలిన నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి రూపాయికి రూపాయి చొప్పున బెట్టింగ్ కడుతున్నారు. ఓట్ల లెక్కింపు తేదీలు దగ్గరపడే కొద్దీ.. రూపాయికి రెండు రూపాయిలు కాసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇంత పెద్దమొత్తంలో బెట్టింగ్లు జరుగుతున్నా.. పోలీసుశాఖ ఇప్పటికీ ఆ వైపు దృష్టిసారించలేదు. ఓట్ల లెక్కింపు తేదీ వచ్చేటప్పటికి జిల్లాలో వివిధ రూపాల్లో రూ. వందల కోట్లలోనే చేతులు మారే అవకాశం ఉందని సమాచారం.
ముందస్తు పత్రాలు రాసుకుంటూ...
జిల్లాలో వివిధ పార్టీల తరఫున ముఖ్య నాయకులుగా ఉన్న కొందరే.. బెట్టింగ్ నిర్వాహకులుగా ఉన్నారు. నెల్లూరు నగరంతో పాటు కందుకూరు, కావలి కేంద్రంగా నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నిర్దేశిత ప్రాంతాల్లో కోలాహలం మొదలవగా.. బెట్టింగ్కు ముందుకు వచ్చిన నాయకులు ఒక ఒప్పంద పత్రం రాసుకుంటున్నారు. ఆపై ఇద్దరూ కలిసి ఓ నమ్మకమైన నేత దగ్గర ఆ మొత్తం ఉంచుతున్నారు. ఫలితం తేలిన తర్వాత.. ఒప్పందం ఆధారంగా నగదు ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు మాట ఆధారంగా.. మధ్యవర్తిపై నమ్మకం ఉంచి.. పందేలు కాస్తున్నారు. ఈ క్రమంలో సదరు మధ్యవర్తికి పందెం మొత్తంలో 5 నుంచి 10 శాతం కమిషన్ రూపంలో ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
స్థానాలు.. మెజారిటీలు
జిల్లాలోని రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన మరుసటి రోజు నుంచే పార్టీల వారీగా రాజకీయ నిపుణులు లెక్కలు వేయడానికి రంగంలోకి దిగారు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. బూత్ల వారీగా ఎవరికి మద్దతు ఉంటుందనే దానిపై సమాచారం సేకరించారు. అవన్నీ క్రోడీకరించుకుని ఓ అంచనాకు వచ్చారు. నియోజకవర్గాల వారీగా ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై తేల్చి.. బెట్టింగ్ కోసం పిలుస్తున్నారు. ప్రధాన పార్టీలు సాధించే సీట్లు.. జిల్లాలో కీలకమైన నాయకులు బరిలో ఉన్న స్థానాలు, అభ్యర్థులు సాధించే మెజారిటీ ఆధారంగా పందేలు జోరుగా సాగుతున్నాయి.
‘రెండు ప్రధాన పార్టీలు సాధించే సీట్ల సంఖ్య ఆధారంగా ఎక్కువ శాతం బెట్టింగ్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి ఎవరు? అనేది కూడా కీలకంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై బెట్టింగ్కు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండగా.. పార్టీకి వచ్చే మెజారిటీపైనా పందేలు ఎక్కువగానే కడుతున్నారు.’
సర్వేపల్లి నియోజకవర్గంలోనూ రెండు ప్రధాన పార్టీల గెలుపోటములపైనా భారీగా పందేల జోరు నెలకొనగా- కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాలపై ఇరుపార్టీల వారు పందేలకు సిద్ధపడుతుండగా- ఆత్మకూరులో మాత్రం కూటమివైపు కాస్తున్నా.. రెండో వైపు నుంచి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ సమైక్య శిబిరానికి కావలి విద్యార్థుల ఎంపిక
[ 13-06-2024]
ఎన్.యస్.యస్ జాతీయ సమైక్య శిబిరానికి కావలికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. -
ఎత్తర జెండా.. ప్రగతి అజెండా
[ 13-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ.. జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. ఉదయం 11 గంటలకే జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరల వద్ద.. ఇళ్లలో టీవీల ముందుకు జనం చేరుకున్నారు. -
రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో చోరీలు
[ 13-06-2024]
కావలి శ్రీవేంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో దొంగతనాలు జరిగాయి. ప్రయాణికుల నుంచి బంగారు నగలు తస్కరించినట్లు సమాచారం. -
వైకాపా మూకల దాడి
[ 13-06-2024]
మండల పరిధిలోని శంకరనగరంలో తెదేపా శ్రేణులు బుధవారం సంబరాలు నిర్వహిస్తున్న సమయంలో వైకాపా మూకలు గొడ్డళ్లు, రాళ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. -
పట్టాలెక్కని పనులెన్నో!
[ 13-06-2024]
జిల్లాలోని పల్లెల్లో కొంతకాలంగా అభివృద్ధి పడకేసింది. పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో ప్రగతి ఊసే లేకుండా పోయింది. జరిగిన పనులకు సంబంధించి సుమారు రూ. 200 కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉండగా.. కొందరు కోర్టును ఆశ్రయించి పొందారు. -
బడి గంట.. సమస్యలేనంట!
[ 13-06-2024]
నూతన విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభం కానుండగా- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎప్పటిలాగే సమస్యలు స్వాగతం పలికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాఠశాలలకు మహర్దశ అంటూ వైకాపా ప్రభుత్వం గత అయిదేళ్లుగా అసంబద్ధ విద్యా విధానాలను అనుసరించింది. -
అత్యవసర బండి... సమస్యలు దండి
[ 13-06-2024]
ఎక్కడ ఆపద జరిగినా నేనున్నానని కుయ్.. కుయ్.. అంటూ వెళ్లే 108 వాహనాలతో అటు ప్రజలు ఇటు సిబ్బంది పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. -
ఉన్నతాధికారుల స్వామిభక్తి
[ 13-06-2024]
రాష్ట్రంలో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరులోని వెంగళరావునగర్ (తాతయ్య పాఠశాల) నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల ప్రాంగణం నుంచి పాఠశాలలకు పుస్తకాలు, సమదుస్తులు, నోట్పుస్తకాలు బుధవారం జిల్లాలోని అన్ని పాఠశాలకు పంపిణీ చేస్తున్నారు. -
తపాలా శాఖతో శుభాకాంక్షలు తెలిపే సౌకర్యం
[ 13-06-2024]
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, లోక్సభ, శాసన సభ్యులకు కేవలం రూ.12 ఖర్చుతో ఈ-పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపే అవకాశాన్ని తపాలా శాఖ అందుబాటులోకి తెచ్చిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు డివిజన్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ తెలిపారు. -
అంబరాన్నంటిన కూటమి శ్రేణుల సంబరాలు
[ 13-06-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి, నాలుగోసారి తెదేపా అధినేత చంద్రబాబునాయిడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బుధవారం కావలిలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా
-
మాజీ సీఎం సతీమణి.. ఆ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రి
-
సన్నీ లియోన్ ప్రదర్శనకు ఆ యూనివర్సిటీ ‘నో’!
-
రాజకీయాల కంటే సినిమాలు చేయడమే సులువు.. కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు
-
22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
-
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు