పిల్లల ఫోన్లపై ఓ కన్నేద్దాం
హైదరాబాద్లో బాలికపై అత్యాచార కేసులో పోలీసులకు విస్తుబోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఒకరు రోజూ తండ్రి స్మార్ట్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి మిత్రులకు వాటిని చూపించేవాడు.
నిఘా కాదు... ముందు చూపు
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్
హైదరాబాద్లో బాలికపై అత్యాచార కేసులో పోలీసులకు విస్తుబోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఒకరు రోజూ తండ్రి స్మార్ట్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి మిత్రులకు వాటిని చూపించేవాడు. అందులో ఉన్నట్లు చేయాలని తోటి విద్యార్థినిపై దాడికి తెగబడ్డారని తేలింది.
* నిజామాబాద్కు చెందిన ఓ విద్యార్థి యూట్యూబ్లో అశ్లీల వీడియోలు చూసేవాడు. ఒకసారి తండ్రి ఫోన్ వినియోగించే సమయంలో అసభ్య వీడియోలు వస్తుండటంతో ఎవరు చూస్తున్నారో గుర్తించడానికి ప్రయత్నించాడు. అంతలోగా బాలుడు అమ్మాయిలతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమవడంతో బయటపడింది.
* ఇందూరుకు చెందిన ఓ వ్యక్తి పోర్న్ వీడియోలకు బానిసయ్యాడు. ఎక్కువ మందితో వివాహేతర సంబంధాలకు ప్రయత్నించడంతో ఇంట్లో తెలిసి పంచాయితీ పెట్టుకుని కుటుంబం విడిపోయే వరకు వచ్చింది.
* జిల్లాకేంద్రంలోనే కొన్ని నెలల కిందట తోటి విద్యార్థినిని ఒక బాలుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇటీవల మానసిక వైద్య నిపుణుల వద్దకు వచ్చే కేసుల్లో నెలకు కనీసం 20 మంది అశ్లీల వీడియోలకు బానిసలైన వారే ఉంటున్నారట. నియంత్రణ లేని వనరులు అందుబాటులో ఉండటంతో వీక్షించే సమయం పెరుగుతోంది. వారి వయసులో వచ్చే మార్పులకు వీడియోల ప్రభావంతో కోరికలు పెంచుకుంటున్నారు. ఈ విపరీత ధోరణి వారి భవిష్యత్తును దుర్భరం చేస్తుందనే స్పృహ కోల్పోతున్నారు.
నిఘా అవసరమే..
పిల్లలపై నిఘా పెడితే తరచూ అనుమానిస్తున్నారని వారిలో అసహనం పెరుగుతుందనేది తల్లిదండ్రుల వాదన. ఇది తప్పు చేయని వారిని కుంగదీస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. వారి ప్రవర్తన సహా ఫోన్, ఇతర గ్యాడ్జెట్లను వినియోగించే సమయంలో వారు రహస్యంగా చూడటానికి ఇష్టపడుతుంటే ఓ కన్నేయాల్సిందేనని గ్రహించాలి. ఏదో అవసరం మీద అన్నట్లు తీసుకుని వాటిలోని అన్నింటిని స్కాన్ చేసేయాలి. అందుకు సంబంధించిన పరిజ్ఞానం తల్లిదండ్రులు పెంచుకోవాలి. బ్రౌజింగ్ హిస్టరీ, సామాజిక మాధ్యమాల్లో చాటింగ్, సంక్షిప్త సందేశాలు, తెర సమయం, ఫోన్ పలకరింపుల తీరు వంటివి పరిశీలించాలి. ప్రధానంగా ఇటీవల ఫోన్లపై నిఘా పెట్టడానికి పలు యాప్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. పోలీసులు, లేదా సైబర్ నిపుణుల అభిప్రాయంతో వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే ప్రయోజనమే.
భవితకు నష్టం
కిరణ్కుమార్, ఏసీపీ, బోధన్
అసభ్య వీడియోలు చూస్తున్నారని గుర్తిస్తే తల్లిదండ్రులు వారిని మా వద్దకు తీసుకురావాలి. కౌన్సెలింగ్ ఇచ్చి వ్యసనం నుంచి బయటపడేలా చేస్తాం. నేరం చేస్తే ఐటీ చట్టం కింద కేసు నమోదు చేస్తాం. అత్యాచారం వంటి కేసులో 10 ఏళ్ల వరకు, ఇతర నేర స్వభావాన్ని బట్టి 6 నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షలు ఉంటాయి. నేరాలకు పాల్పడితే ఉన్నత విద్య, ఉద్యోగాల విషయంలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తి జీవితం దుర్భరమవుతుంది.
సకాలంలో నిలువరించాలి
ప్రొ।। డాక్టర్ విశాల్, న్యూరో సైకియాట్రిస్ట్
ఆహారపు అలవాట్లు, హర్మోన్లు, వీడియోలు పిల్లల మానసికస్థితిని నిర్దేశిస్తాయి. గ్యాడ్జెట్లలో ఏం చూస్తున్నారన్నది గుర్తించి ప్రాథమిక స్థాయిలోనే నిలువరించాలి. అది కొట్టడం, తిట్టడం కాకుండా దుష్పరిణామాలను వివరించాలి. లైంగిక విద్యనందించి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే బానిసలైతే కౌన్సెలింగ్ ఇప్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు
[ 03-06-2024]
జిల్లాలో అన్ని సామాజికవర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని జిల్లా పాలనాధికారి రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. -
పత్రాలు రాసిచ్చి.. తీరా చేతులెత్తేసి..
[ 03-06-2024]
మిల్లులకు ధాన్యం కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయనే అంశం పౌరసరఫరాలశాఖను కుదిపేస్తోంది. ఏడు మిల్లులకు బదిలీ అయినట్లుగా చెబుతున్న 37 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టింది. -
మింగినవి కక్కరేం?
[ 03-06-2024]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు సామాజిక తనిఖీల్లో బయటపడుతున్నాయి. దుర్వినియోగం చేసిన సొమ్మును కొందరు చెల్లించడం లేదు. మండల స్థాయి అధికారి నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించే సిబ్బంది వరకు అవినీతిలో భాగస్వాములవుతున్నారు. -
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 03-06-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో మంగళవారం జరగనుంది. లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరు గదుల్లో టేబుళ్లు ఏర్పాటు చేశారు. -
రాయితీ జమ కాదేంటి?
[ 03-06-2024]
మహాలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.500కే వంట గ్యాస్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెల్లరేషన్కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రాయితీపై వంట గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంది. -
మూడు రోజులు.. 0.26 టీఎంసీలు
[ 03-06-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లావాసుల వరప్రదాయినిగా పేరొందింది నిజాంసాగర్ జలాశయం. వేసవిలో తాగునీటి అవసరాల నిమిత్తం ఈ నెల 4వ తేదీ సాయంత్రం లేదా 5వ తేదీ ఉదయం ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. -
పరస్పర దాడులు
[ 03-06-2024]
నగరంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఘటన లాఠీఛార్జికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రం హైమద్పురా కాలనీకి చెందిన సోహెల్పై ఆయన భార్య బంధువులు వ్యక్తిగత కారణాల వల్ల శనివారం అర్ధరాత్రి ఆయుధాలతో దాడికి దిగారు. -
జాడలేని ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
[ 03-06-2024]
‘జిల్లాకేంద్రంలో పాతపట్టణంలోని ధర్మశాల ప్రాంతంలో జ్ఘి3 నిర్మాణం చేపట్టారు. ప్రధాన వాణిజ్య ప్రాంతంలో సెల్లార్ నిర్మాణం చేపట్టకుండానే భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం అందులో ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతోంది. -
కొమ్ము కొరత
[ 03-06-2024]
పంట వేయాలనే ఆలోచన వస్తే ఎక్కడి నుంచైనా.. ఎంత ధరైనా వెనకాడకుండా రైతు విత్తనం తెచ్చుకుంటాడు. దేశవ్యాప్తంగా పత్తి విషయంలో ఇదే జరుగుతోంది. కావాల్సిన విత్తనం కోసం వరుసలో నిలబడో, అధికారుల జోక్యంతోనో విత్తు దక్కించుకుంటున్నారు. -
బడి బస్సులు భద్రమేనా?
[ 03-06-2024]
చిన్న పొరపాట్లే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. అందుకే గత అనుభవాల దృష్ట్యా పాఠశాల బస్సుల నిర్వహణ విషయంలో రవాణాశాఖ నిబంధనల అమలుపై దృష్టి సారిస్తోంది. ఏటా బడి బస్సుల సామర్థ్య పరీక్షలు, డ్రైవర్ల లైసెన్సులు, అనుభవాన్ని పరీక్షిస్తున్నారు. -
ఎండతో పాటు ఎగబాకి
[ 03-06-2024]
ఎండల తీవ్రతకు కూరగాయలు మాడిపోతున్నాయి. మార్కెట్లో డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. రోజు రోజుకు ఎగబాకుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే టమాట ధర కిలో రూ.30కి పైగానే పలుకుతోంది. -
తమ్ముడి వెంటే.. అన్న అనంతలోకాలకు..
[ 03-06-2024]
తమ్ముడి మృతి చెందిన బాధను తట్టుకోలేక అన్న గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని కృష్ణాజివాడిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
-
దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
-
న్యూయార్క్ స్టేడియం.. గాయాల విషయంలో తస్మాత్ జాగ్రత్త: ద్రవిడ్
-
రవీనా టాండన్ మద్యం తాగలేదు.. దాడి ఘటనపై పోలీసుల స్పష్టత
-
ప్రపంచ కప్ను చూడాలని లేదు..: రియాన్ పరాగ్ వ్యాఖ్యలు
-
గాల్లో ఢీకొన్న విమానాలు.. పైలట్ మృతి.. వీడియోలో రికార్డయిన దృశ్యాలు!