నిప్పుల కొలిమిలా రాష్ట్రం
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి.
బౌద్ధ్ @ 44.3 డిగ్రీలు
గోపాలపూర్, న్యూస్టుడే: రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. ఎండల తీవ్రత, గాడ్పులతో 11 గంటల నుంచి 3 వరకు ప్రధాన నగరాలు, పట్టణాలు వెలవెలబోతున్నాయి ప్రజలు గడప దాటలేని పరిస్థితి కనిపిస్తోంది. తీర ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉంటోంది. గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్దాస్ శుక్రవారం ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ... బౌద్ధ్లో అత్యధిక ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలో మరో 30 కేంద్రాల్లో 40 నుంచి 42 డిగ్రీలుగా ఉందన్నారు.
ప్రత్యేక హెచ్చరికలు
శనివారం మయూర్భంజ్, నయాగఢ్, అనుగుల్, బౌద్ధ్, ఝార్సుగుడ, సుందర్గఢ్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే సూచనలు ఉన్నాయని, గాడ్పుల తీవ్రత ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఆరెంజ్’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. బాలేశ్వర్, భద్రక్, జగత్సింగ్పూర్, కేంఝర్, ఢెంకనాల్, జాజ్పూర్, కేంద్రపడ, కటక్, ఖుర్దా, కొంధమాల్, గజపతి, గంజాం, కొరాపుట్, సంబల్పూర్, దేవ్గఢ్, మల్కాన్గిరి, నవరంగపూర్, బొలంగీర్, బరగఢ్, సోన్పూర్ జిల్లాల్లోనూ గాడ్పులు వీస్తాయని వివరించారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే సూచనలు ఉన్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. 21, 22 తేదీల్లో అక్కడక్కడా కాలవైశాఖి స్వల్ప ప్రభావం చూపినా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర, పశ్చిమ దిశగా గాడ్పులు రాష్ట్రాన్ని నేరుగా తాకుతున్నందున ఎండల తీవ్రత కొనసాగుతుందని దాస్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రముఖుల బరి... ఎవరిదో విజయం మరి?
[ 02-05-2024]
పొరుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. -
రాయగడలో ఎన్నికల వే‘ఢీ’
[ 02-05-2024]
రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్ లోక్సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. -
ఇంటింటా అభ్యర్థుల ప్రచారం
[ 02-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. -
పాండ్యన్ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ఖండన
[ 02-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే మిషన్శక్తి, బీఎస్కేవై కార్యక్రమాలు నిలిపివేయడం తథ్యమంటూ బిజద నేతలు చేస్తున్నది దుష్ప్రచారమని భాజపా నాయకులు స్పష్టం చేశారు. -
బిజద అంటే విరక్తి ఏర్పడింది: షానవాజ్
[ 02-05-2024]
సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారి పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, బిజద అంటే ప్రజల్లో విరక్తి ఏర్పడిందని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి షానవాజ్ చౌదరి విమర్శించారు. -
ఈ ముద్ద మీకు.. మీ ఓట్లు మాకు
[ 02-05-2024]
అభ్యర్థులు ప్రచారానికి అందొచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఉత్సవం, పండగ, పెళ్లి.. ఇలా ఏదయినా హాజరై ఓట్లు అడిగేస్తున్నారు. -
మౌనం మాట్లాడింది
[ 02-05-2024]
వీరంతా అమాయక ఆదివాసీలు. కష్టం వచ్చినా.. బాధ కలిగినా తమలో తాము కుమిలిపోతారే తప్పా నోరు తెరిచి అడగరు. -
మౌలిక సౌకర్యాలు కల్పిస్తేనే ఓటేేస్తాం
[ 02-05-2024]
అపార ఖనిజ సంపదకు నిలయమైన కాశీపూర్ సమితిలో మారుమూల గ్రామాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. -
ఇంటిపై పడిన చెట్టు: చిన్నారికి గాయాలు
[ 02-05-2024]
నందపూర్ సమితిలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో చిన్నారికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
-
సినీ నటుడు వెంకటేశ్ కూతురి ప్రచారం
-
హైదరాబాద్లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
-
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా