మానవత్వం మరణించింది !
వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.
రక్తమోడుతున్నా పట్టని చోదకులు
స్నేహితుల యత్నమూ విఫలమై విద్యార్థి మృతి
వెంకటేష్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న మిత్రుడు
టంగుటూరు, న్యూస్టుడే: వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ విషాద సంఘటన టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని పేస్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కొండపికి చెందిన తొర్లికొండ వెంకటేష్ (20) టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సెమ్-2 పరీక్షలు జరుగుతుండటంతో సోమవారం ఉదయం 9 గంటలకు కళాశాలకు వెళ్లాడు. అక్కడి 16వ జాతీయ రహదారిపై దిగి నడుచుకుంటూ కళాశాలలోకి వెళ్తుండగా..పాకల నుంచి విద్యార్థులతో వస్తున్న కళాశాల బస్సు ఢీకొంది. దీంతో అతను పక్కనే ఉన్న విభాగినిపై పడిపోవడంతో తలకు గాయమై ముక్కు, చెవి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. వెంకటేష్ రక్తమోడుతూ కొట్టుమిట్టాడుతుండగా స్నేహితులు, కళాశాల విద్యార్థులు అక్కడికి పరుగులు తీశారు. జాతీయ రహదారిపై వెళ్లే పలు వాహనదారులను చేతులెత్తి మొక్కి ఆపేందుకు ప్రయత్నం చేయగా, ఒక్క వాహన చోదకుడు కూడా కనికరం చూపకుండా వెళ్లిపోయారు. 108కు సమాచారమిచ్చినా సరైన సమయానికి చేరుకోలేదు. ప్రమాద విషయం తెలుసుకున్న ఒంగోలు తాలూకా హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి వాహనంలోనే రిమ్స్కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన బస్సు చోదకుడిని టంగుటూరు పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కదులుతుందా యంత్రాంగం!
[ 17-05-2024]
ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
పేదల జాగాలు.. దళారుల బేరాలు
[ 17-05-2024]
ప్రభుత్వం మీకు ఊరికి 5 కి.మీటర్ల దూరంలో స్థలాలిచ్చింది. అక్కడ రోడ్లు లేవు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయలేదు. -
ఊపిరి ఆగిపోతోందయ్యా!
[ 17-05-2024]
తాగునీరే వారి పాలిట శాపమైంది. ఫ్లోరైడ్ మహమ్మారి కోరలకు చిక్కి మూత్రపిండాల రోగులుగా మారారు. -
బకింగ్ హాంఫట్
[ 17-05-2024]
రహదారుల నిర్వహణ, మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదనేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. -
అనునిత్యం అప్రమత్తత అవసరం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
నిధులు లాగేసి.. నీళ్లు నిలిపేసి
[ 17-05-2024]
ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమంలో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. -
వక్ఫ్బోర్డు భూములకు రక్షణేదీ!
[ 17-05-2024]
పొదిలిలో కోట్లాది రూపాయల విలువైన వక్ఫ్బోర్డు భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నా రక్షించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
నరసింహా.. పాలక వర్గం లేకుండానే వేలమా!
[ 17-05-2024]
దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని పాతసింగరాయకొండ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జూన్ 16 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో వైకాపా నేత దాడి
[ 17-05-2024]
తెదేపాకు ఓటు వేశాడన్న ఆక్రోశంతో ఓ యువకుడిపై వైకాపా నాయకుడు కొడవలితో దాడి చేశాడు. -
పేలిన టైరు.. అదుపు తప్పిన కారు
[ 17-05-2024]
మండలంలోని రాయవరం గ్రామ శివారులోని వైద్యకళాశాలకు సమీపంలో కారు బోల్తాపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. -
ఆస్తి గొడవ అంత్యక్రియల నిలిపివేత
[ 17-05-2024]
ప్రాణం ఉన్నంతవరకూ పట్టించుకోని ఆప్తులు..ఆ తర్వాత ఆస్తి కోసం పరుగు పరుగున వచ్చారు. -
ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి
[ 17-05-2024]
అభం శుభం తెలియని చిన్నారికి నాలుగేళ్లకే నిండు నూరేళ్లు నిండాయి.