ఊపిరి ఆగిపోతోందయ్యా!
తాగునీరే వారి పాలిట శాపమైంది. ఫ్లోరైడ్ మహమ్మారి కోరలకు చిక్కి మూత్రపిండాల రోగులుగా మారారు.
మూలకు చేరిన డయాలసిస్ యంత్రాలు
ఆసుపత్రిలో నిలిచిన సేవలు
ఆందోళనలో రోగులు
డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చి నిరీక్షిస్తున్న రోగులు, బంధువులు
కనిగిరి, న్యూస్టుడే: తాగునీరే వారి పాలిట శాపమైంది. ఫ్లోరైడ్ మహమ్మారి కోరలకు చిక్కి మూత్రపిండాల రోగులుగా మారారు. ఆరుతున్న దీపాలయ్యారు. వారానికి రెండు మూడుసార్లు.. అది కూడా సమయానికి డయాలసిస్ చేయించుకుంటేనే ప్రాణం నిలుస్తుంది. లేకుంటే ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో కూడా తెలియని దయనీయ పరిస్థితి. అటువంటి రోగులకు ఠంఛనుగా వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లపై కనీస పర్యవేక్షణ కొరవడింది. కొడిగడుతున్న దీపాల దీన గోడు పాలకులు, అధికారులకు పట్టకుంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వ్యయప్రయాసకోర్చి జిల్లాలు, మండలాలు దాటి వచ్చిన రోగులతో చెలగాటమాడుతున్నారు.
కనిగిరి కమ్యూనిటీ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో మొత్తం 17 యంత్రాలున్నాయి. ప్రతి రోగికి డయాలసిస్ చేసే సమయంలో ఏడు లీటర్ల శుద్ధి జలం అవసరమవుతుంది. ఇందుకుగాను డయాలసిస్ కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ పని చేయడం లేదు. ఈ క్రమంలో యంత్రాల్లోకి ఫ్లోరైడ్ నీరు చేరింది. నిబంధనల ప్రకారం వీటికి ఏటా మరమ్మతులు అవసరం. అవసరమైతే కొత్త పరికరాలు బిగించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సంబంధిత గుత్తేదార్లు విస్మరించారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మరిచారు. దీంతో ఏకంగా 13 యంత్రాలు మూడు రోజుల క్రితం మూలకు చేరాయి. ఈ విషయం బయటికి పొక్కకుండా వైద్యాధికారులు, సిబ్బంది మరో తప్పిదానికి పాల్పడ్డారు. రోజూ షిప్ట్ల ప్రకారం 50 మంది రోగులకు డయాలిస్ సేవలు అందించాల్సి ఉండగా సగం మందికే చేస్తున్నారు. అది కూడా నాలుగు గంటలపాటు వైద్యం చేయాల్సి ఉండగా.. ఎక్కువ మందికి చేయాలనే తాపత్రయంతో కేవలం రెండు గంటలకే పరిమితం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో చికిత్స అందక రోగులు ఆయాసం, దగ్గుతో తల్లడిల్లుతున్నారు.
మరుగుదొడ్లు.. మందులూ లేవు...
కనిగిరి డయాలసిస్ సెంటర్లో వైద్యచికిత్సలకు నెల్లూరు జిల్లా వరికుంటపాడు, వింజమూరు, ఉదయగిరి, లింగసముద్రం, జిల్లాలోని పామూరు, సీఎస్పురం, పీసీపల్లి మండలాల నుంచి దాదాపు 120 మంది మూత్రపిండ వ్యాధిగ్రస్థులకు సేవలు అందించాల్సి ఉంది. గత మూడు రోజులుగా సేవలు సక్రమంగా అందక వీరంతా అవస్థలు పడుతున్నారు. విషయం తెలియక వ్యయప్రయాసకోర్చి వచ్చిన రోగులు, కుటుంబ సభ్యులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉండడంతో ఎవరూ వినియోగంచుకోవడం లేదు. కమ్యూనిటీ వైద్యశాలకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుందామంటే వైద్య సిబ్బంది అడ్డుకుంటున్నారు. దీంతోపాటు మందులు ఇవ్వడం లేదు. ఐరన్ ఇంజెక్షన్ కూడా రోగులే బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి. ఈ విషయమై కమ్యూనిటీ వైద్యశాల సూపరింటెండెంట్ డా. అబ్దుల్ కలాం మాట్లాడుతూ.. కొన్ని యంత్రాలకు మరమ్మతులు చేయించామని.. మిగిలిన వాటినీ అందుబాటులోకి తెచ్చి రోగులకు ఇబ్బందుల్లేకుండా చూస్తామన్నారు.
నా పేరు వీరపనేని చెన్నయ్య. మాది సీఎస్పురం మండలం పెదగోగులపల్లి. ఉదయం 5 గంటలకు డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చా. యంత్రాలు పని చేయడం లేదని చెప్పడంతో చేసేదేమీ బయట కూర్చుని నిరీక్షిస్తున్నాం. మూత్రశాలలు లేవు. పక్కనే ఉన్న కమ్యూనిటీ వైద్యశాలలోకి వెళ్తుంటే.. డయాలసిస్ రోగులు ఇక్కడికి రావొద్దంటూ సిబ్బంది అడ్డుకుంటున్నారు.
మాది పామూరు. నా పేరు సుబ్బమ్మ. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ఇక్కడికి వస్తే యంత్రాలు పని చేయడం లేదు వేచి ఉండాలని సిబ్బంది చెప్పారు. నాలుగు గంటలపాటు వేచి ఉన్నా చేయలేదు. ఆయాసంగా ఉంది. త్వరగా డయాలసిస్ చేస్తేనే నేను బతుకుతాను.
పామూరు మండలం వీరభద్రాపురం మాది. పేరు చీమలదిన్నె నాగార్జున. ఉదయం 5 గంటలకు డయాలిస్కు వచ్చాను. మధ్యాహ్నం 12 గంటలైనా చెయ్యలేదు. వారానికి మూడు సార్లు డయాలసిస్ అవసరం. సమాయానికి చేస్తేనే ఉపశమనం. ఇక్కడేమో యంత్రాలు పని చేయడం లేదు.. మరోసారి రమ్మని చెబుతున్నారు. ఇలా అయితే మా ప్రాణాలు నిలిచేది ఎలా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మతోడు ఆ రోజు నేను లేను.. తొడగొట్టినోళ్లు హడలెత్తుతున్నారు
[ 01-06-2024]
‘అమ్మతోడు.. నేను ఆ రోజు గొడవల్లో ఎక్కడా లేను! అయినా నన్ను స్టేషన్కు పిలుస్తున్నారు. బైండోవర్ చేస్తామంటున్నారు. నాకు ఆ గొడవలతోనే ఎలాంటి సంబంధం లేదు. నేను స్టేషన్కు రానన్నా..’ ఇదీ అధికార పార్టీకి చెందిన ఒక యువ నాయకుడి బేల మాటలు. -
కౌంట్డౌన్.. 4వ తేదీ ఖాళీల్లేవ్..!
[ 01-06-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పైనే అందరి చూపులు. ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయ్.. ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారు.. ఏ నలుగురు కలిసినా సర్వత్రా ఇదే చర్చ. ఇదే సమయంలో లెక్కింపు రోజున జిల్లా కేంద్రం ఒంగోలులో ఉండి ఫలితాలు తెలుసుకోవడం పైనా పలువురు ఆసక్తి చూపుతున్నారు. -
బాబోయ్.. తీగలూ తెగుతున్నాయ్
[ 01-06-2024]
రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయనేది నానుడి. రోళ్ల సంగతి తర్వాత.. భానుడి భగభగలకు కాలం చెల్లిన విద్యుత్తు తీగలిప్పుడు తెగి పడుతున్నాయి. గత మూడు రోజులుగా క్రమేణా పెరుగుతున్న ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. -
నిన్న కందిపప్పు.. నేడు గోధుమ వంతు
[ 01-06-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను పెంచుతామని ప్రకటించిన జగన్.. ఇప్పుడు గతంలో ఇచ్చిన వాటిలోనే కోతలు పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న సమయంలో జూన్ నెల రేషన్ కోటాలోనూ కోత పెట్టారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 4న ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు ప్రకాశం భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రూ. 338.. అధరగొట్టిన పొగాకు
[ 01-06-2024]
అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు పంటకు మంచి డిమాండ్ ఏర్పడడంతో అన్ని వేలం కేంద్రాల్లో ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇతర దేశాల్లో పంట దిగుబడి తగ్గింది. దీంతో ఆంధ్రా సీజన్లో ఉత్పత్తికి డిమాండ్ ఏర్పడింది. -
కొండలు కొల్లగొట్టేస్తున్నారు
[ 01-06-2024]
కంభం మండలంలోని చిన్నకంభం గ్రామ సమీపంలోని విద్యుత్తు ఉప కేంద్రం సమీపంలోని కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. జేసీబీ ఏర్పాటు చేసి మట్టి తవ్వి ట్రాక్టర్లతో కంభం, బేస్తవారపేట పట్టణాలకు అక్రమంగా తరలిస్తున్నారు. -
పేదరాలి పొలంపై వైకాపా పెత్తనం
[ 01-06-2024]
వైకాపా నాయకులు చెప్పిందే తడవుగా పైసలు ఇస్తే చాలు సి.ఎస్.పురం మండల రెవెన్యూ అధికారులు ఒకరి భూమిని మరొకరి పేరుపై బదలాయించేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న రైతులకు సంబంధించిన అసైన్మెంట్ భూములను గుట్టుచప్పుడు కాకుండా ఇతరుల పేరుపై మార్చేస్తున్నారు. -
మద్యం మత్తులో బీరు సీసాతో దాడి
[ 01-06-2024]
మద్యం మత్తులో తన స్నేహితుడే 108 అంబులెన్సు డ్రైవర్పై బీరు సీసాతో దాడి చేసిన సంఘటన కురిచేడు మండలం బోధనంపాడులో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ అబుదావలి, వేమా రమేష్లు స్నేహితులు. -
22 ఎయి‘డెడ్’ పాఠశాలలు
[ 01-06-2024]
ఎయిడెడ్ వ్యవస్థ క్రమంగా కనుమరుగుతోంది. ఒక్క విద్యార్థి కూడా లేని 22 ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. -
చెవిరెడ్డి బెదిరింపులకు తలొగ్గనందుకే ఆర్వోపై వేటు
[ 01-06-2024]
ఒంగోలు ఎంపీ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులకు తలొగ్గనందుకే యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బాధ్యతల నుంచి తప్పించారని ఆ నియోజకవర్గ పరిశీలకుడు వేములకొండ శ్రీనివాస్ విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో 10వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్రాజ్
-
ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన యూనియన్ బ్యాంక్.. లేటెస్ట్ రేట్లు ఇవే..
-
గంభీర్ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్ చేయగలడు: గంగూలీ
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ