రాయితీ విత్తనాలు వచ్చేస్తున్నాయ్!
ఖరీఫ్కు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల వర్షాలు కూడా కురుస్తుండటంతో అన్నదాతలు సైతం పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈనేపథ్యంలో విత్తనాలను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
- న్యూస్టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)
ఖరీఫ్కు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల వర్షాలు కూడా కురుస్తుండటంతో అన్నదాతలు సైతం పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈనేపథ్యంలో విత్తనాలను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను సరఫరా చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి కూడా రాయితీ ప్రకటన రావడంతో ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో వరి 1,62,719 హెక్టార్లలో సాధారణ సాగు చేస్తున్నారు. రాయితీపై వ్యవసాయశాఖ అధికారులు 41,283 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఇందులో గిరిజనులకు 2,220 క్వింటాళ్లు కేటాయించారు. వీరికి 90 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నారు. 39,063 క్వింటాళ్లు కిలో రూ.10 చొప్పున రాయితీపై సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతి 30 కిలోల బస్తాపై రూ.300 రాయితీ ఇస్తున్నారు.
పచ్చిరొట్ట కూడా..
భూసారాన్ని పెంచేందుకు వీలుగా జిల్లా రైతులకు ఈసారి 50 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచారు. 1,450 క్వింటాళ్లలో జీలుగు, 1,824 క్వింటాళ్ల జనుమ విత్తనాలను ఏపీ సీడ్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. జీలుగు విత్తనం కిలో రూ.63.90 కాగా రైతు చెల్లించాల్సిన మొత్తం రూ.31.95గా నిర్దేశించారు. జనుము కిలో రూ.86 రాయితీ పోను రూ.43 చెల్లించాలి.
ఎరువులూ సిద్ధం...
ఆర్బీకేల్లో ఎరువులు కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. ఖరీఫ్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. 76 ఆర్బీకేల్లో 632 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1322 మెట్రిక్ టన్నుల యూరియా, 582 లీటర్ల నానో యూరియా రైతులకు సరఫరా చేసేందుకు అందుబాటులో ఉంచారు.
ఆర్బీకేల నుంచి తీసుకోవచ్ఛు. ఖరీఫ్లో రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాం. రైతులు కావాల్సిన వరి, పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులను డి-కృషి ద్వారా ఆన్లైన్లో నగదు చెల్లించి నేరుగా రైతుభరోసా కేంద్రాల నుంచి తీసుకోవచ్ఛు ఎరువుల వినియోగంలో వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి.- కె.శ్రీధర్, జిల్లా వ్యవసాయాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.