విదేశీ పిక్కలపైనే ఆధారం
జిల్లాలో తెల్ల బంగారంగా పేరొందిన జీడిపప్పునకు పలాస ప్రాంతం గుర్తింపు పొందింది. 70 ఏళ్లుగా ఇక్కడి నుంచి జీడిపప్పు ఉత్పత్తులు జరుగుతున్నాయి.
తగ్గుతున్న జీడి వ్యాపారం
విదేశీ జీడిపిక్కలను దించుతున్న హమాలీలు
కాశీబుగ్గ, న్యూస్టుడే: జిల్లాలో తెల్ల బంగారంగా పేరొందిన జీడిపప్పునకు పలాస ప్రాంతం గుర్తింపు పొందింది. 70 ఏళ్లుగా ఇక్కడి నుంచి జీడిపప్పు ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఏటా రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలుంటాయి. ముడిసరకు చాలనందున 70 శాతం మేరకు ఇతర దేశాల నుంచి పిక్కలు దిగుమతి చేసుకుంటున్నారు. నాణ్యత విషయంలో విదేశీ పిక్కలు తేడా ఉండడం, ఇతర కారణాలతో అందుకు తగ్గ వ్యాపారం జరగడం లేదని వ్యాపారులంటున్నారు.
జోరుగా దిగుమతి: జిల్లాలో సుమారు 300 జీడిపప్పు కర్మాగారాలున్నాయి. అందులో పలాస-కాశీబుగ్గ ప్రాంతంలో 250 వరకు ఉన్నాయి. ఏటా 240 నుంచి 250 పని దినాలుంటాయి. రోజుకు 60 నుంచి 70 టన్నుల వరకు జీడి పప్పు ఉత్పత్తి అవుతుంది. అందుకు తగ్గట్టుగా పిక్కలు మాత్రం లభ్యం కావడం లేదు. దీంతో ఐవేరీకోస్ట్, టాంజానియా, జాంబియా, ఘనా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
తగ్గిన ధరలు: విదేశీ పిక్కలు ధర తగ్గడంతో దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. విదేశీ పిక్కల ధర ఏప్రిల్ నాటికి బస్తా రూ.10 వేలు వరకు ఉండేది. ప్రస్తుతం 80 కిలోల బస్తాకు 22 కిలోలు పప్పు దిగుబడి అయితే రూ.8,800, 24 కిలోలు దిగుబడికి రూ.9600 వరకు ధర ఉంది. స్థానిక పిక్కలు ధర ప్రారంభంలో రూ.11 వేలు ఉండగా ప్రస్తుతం రూ.10 వేలుంది. తక్కువ ధరకు వస్తుండడంతో వ్యాపారులు విదేశీ పిక్కలపైనే ఆసక్తి చూపుతున్నారు.
బేజారు: జీడిపప్పు డిమాండ్ మార్కెట్లో తగ్గిపోయింది. ఎగుమతులు మందగించడం దీనికొక కారణం. ఈ నేపథ్యంలో పప్పు ధరలు కిలోకు రూ.20 నుంచి రూ.50 వరకు తగ్గాయి. ఏటా దీపావళికి పప్పు ఎగుమతులు ఎక్కువగా జరిగేవి. ఈ ఏడాది ఆశించిన మేరకు ఎగుమతులు కూడా జరగడం లేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎగుమతులు తగ్గాయి: కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న పప్పు గతంలో ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేది. ఆర్థికమాంద్యం కారణంగా రెండేళ్ల నుంచి ఎగుమతులు తగ్గాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తవుతున్న పప్పు సైతం భారత దేశంలోనే విక్రయిస్తున్నారు. ఆ ప్రభావం ఈ ప్రాంత పప్పు ఉత్పత్తులపై పడుతోంది. వియత్నాం వంటి దేశాల నుంచి భారతదేశంలోకి దిగుమతి అవుతోంది. దీనిపై ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఫిర్యాదు చేశారు.
ఎం.సురేష్కుమార్, అధ్యక్షుడు, పలాస జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.