కటకటాల్లోకి నెట్టిన చిలుక జోస్యం!
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
సెల్వరాజ్ వద్ద జోస్యం చెప్పించుకుంటున్న తంగర్బచ్చన్
వేళచ్చేరి, న్యూస్టుడే: రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి బెడిసికొట్టి ఆవతలివారికి ముప్పుతెచ్చి పెడుతున్నాయి. అందరి భవిష్యత్తును చెప్పే చిలుక జోస్యుడు తనకు వచ్చిన ఆపదను గుర్తించ లేకపోయాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.
కడలూర్ నియోజకవర్గం నుంచి భాజపా కూటమిలోని పీఎంకే తరఫున తంగర్బచ్చన్ పోటీ చేస్తున్నారు. రెండు రోజుల కిందట ఆయన కడలూర్ తెన్నంబాక్కం ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో రోడ్డుపక్కన చిలుక జోస్యం చెప్పే వ్యక్తి వద్దకు వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాటి ఆధారంగా తంగర్బచ్చన్కు చిలుక జోస్యం చెప్పిన సెల్వరాజ్ను వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అరెస్టు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
ప్రజలు గుణపాఠం చెబుతారు: అన్బుమణి
సైదాపేట: డీఎంకే ప్రభుత్వ ప్రతీకార ధోరణికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. కడలూరు జిల్లా తెన్నపాక్కం అళగుముత్తు ఆయ్యనార్ ఆలయంలో జోస్యం చెబుతూ వచ్చిన సెల్వరాజ్ అనే వ్యక్తిని తమిళనాడు ప్రభుత్వ అటవీశాఖ అరెస్టు చేసిందన్నారు. తంగర్బచ్చన్ విజయం సాధిస్తాడని చిలుక జోస్యం చెప్పటంతో ఓర్వలేని డీఎంకే ఈ ప్రతీకార చర్యకు పాల్పడిందన్నారు. అడవుల్లో లక్షల చెట్లు, వేల వన్యప్రాణులు మృతి చెందుతుంటే పట్టించుకోని ప్రభుత్వం జ్యోతిష్కుడి జీవనోపాధి దెబ్బతీసిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భవిష్యత్తు మనదే..
[ 15-05-2024]
అభివృద్ధిలో రాష్ట్రం ఉరకలు వేస్తోంది. దేశ సగటుకు మించి ప్రతిభ కనబరుస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలని కీలకాంశాల్లో మరింత శ్రమించాలని ఆర్థిక నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. -
పరువునష్టం కేసులో ఈపీఎస్ విచారణకు హాజరు
[ 15-05-2024]
సెంట్రల్ చెన్నై ఎంపీ దయానిధిమారన్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామిపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు మంగళవారం ఎడప్పాడి ఎగ్మూర్ కోర్టులో హాజరయ్యారు. -
వివాహ బంధానికి వీడ్కోలు: జీవీ ప్రకాశ్
[ 15-05-2024]
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్కుమార్ 2013లో గాయని సైంధవిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అన్వి (4) అనే పాప కూడా ఉంది. -
ఆలయాల సందర్శనలో నయనతార దంపతులు
[ 15-05-2024]
కన్నియాకుమరి సమీపంలోని ప్రసిద్ధ సుశీంద్రం తానుమలయస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోమవారం సందర్శించారు. -
ప్లస్వన్లో 91.17 శాతం ఉత్తీర్ణత
[ 15-05-2024]
రాష్ట్రంలో ప్లస్వన్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో 91.17శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో ప్లస్వన్ వార్షిక పరీక్షలు మార్చి 4 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 8.11 లక్షల మంది రాశారు. -
బస్సు నడుపుతూ స్పృహ కోల్పోయిన డ్రైవర్
[ 15-05-2024]
బస్సు నడుపుతూ డ్రైవరు స్పృహ కోల్పోవడంతో అందులోని 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈరోడ్కు చెందిన సెంథిల్రాజా (38) ప్రభుత్వ బస్సు డ్రైవరు. -
ఈపీఎస్ వర్గానికి రెండాకుల గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘం వివరణ
[ 15-05-2024]
అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి రెండాకుల గర్తు కేటాయించడంపై సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. -
కంప్యూటర్ సైన్స్, గణితంపై ఆసక్తి
[ 15-05-2024]
ఈ ఏడాది నగర పాఠశాలల్లో ప్లస్వన్ కోర్సుల్లో చేరే వారిలో ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, గణితం (మ్యాథ్స్) గ్రూపులో చేరడానికి సుముఖంగా కనిపిస్తున్నారు. -
బావిలో మునిగి ముగ్గురు బాలురి మృతి
[ 15-05-2024]
కరూర్ ఆండాంకోవిల్ పుదూర్ కీళ్బాగం ప్రాంతానికి చెందిన రమేష్ కుమారుడు అశ్విన్ (12), అదే ప్రాంతానికి చెందిన శ్రీధర్ కుమారుడు శ్రీవిష్ణు (14), సెల్వన్నగర్కు చెందిన ఇళంగోవన్ కుమారుడు మారిముత్తు (13) స్నేహతులు. -
ఉద్యోగం పేరిట నగదు మోసం
[ 15-05-2024]
సేలం జిల్లా ఏర్కాడుకు చెందిన అస్పరిత్ అజయ్ ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఇతనికి తన స్నేహితుడు కరికాలన్ ద్వారా పరిచయమైన దినేష్ అనే వ్యక్తి తండ్రి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో డ్రైవర్గా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
సామ్ కరన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ను ఓడించిన పంజాబ్
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్