ఓటేయడాన్ని అడ్డుకున్న ఘటనపై దర్యాప్తు
కాంచీపురం జిల్లా పరందూర్ సమీపంలో చెన్నై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
ప్రజలతో మాట్లాడుతున్న పోలీసులు
కాంచీపురం, న్యూస్టుడే: కాంచీపురం జిల్లా పరందూర్ సమీపంలో చెన్నై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పరందూర్ పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ఈనెల 19న జరిగిన లోక్సభ ఎన్నికలను ఏకనాపురం ప్రజలు బహిష్కరించారు. శ్రీపెరుంబుదూర్ లోక్సభ నియోజకవర్గంలోని ఈ గ్రామంలో 1,375 ఓట్లు ఉన్నాయి. పోలింగ్కేంద్రంలో 12 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీపెరుంబుదూర్ తహసీల్దారు సుందరమూర్తి ఏకనాపురానికి చేరుకొని గ్రామస్థులతో చర్చలు జరిపి పోలింగ్లో పాల్గొనాలని కోరారు. ఆ సమయంలో ప్రజలు, రెవెన్యూ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తర్వాత గ్రామస్థులను ఓటు వేయకుండా అడ్డుకున్న ఏకనాపురం గ్రామానికి చెందిన సుబ్రమణియన్, కదిరేశన్, గణపతి, బలరామన్, మునుసామి, ఇలంగోవన్, గవాస్కర్, సుధాకర్, ఓం భగవతి, వివేకానందన్పై కేసు నమోదు చేశారు. సుంగువారిసత్రం పోలీసుస్టేషన్కు సోమవారం హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఆ మేరకు 10 మంది హాజరయ్యారు. వారి వెంట ఏకనాపురం గ్రామస్థులు పోలీస్స్టేషన్కు ఎక్కువ మంది చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకొంది. సమన్లు పొందిన వారు మాత్రమే స్టేషన్లో ఉండాలని హెచ్చరించడంతో మిగిలిన వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్ట్రాంగ్’గా ఉన్నట్టేనా?
[ 04-05-2024]
తెన్కాశి పార్లమెంటులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 210 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే 90 పనిచేయట్లేదని తేలింది. -
ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
[ 04-05-2024]
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. -
ఎండ నుంచి ఉపశమనానికి గ్రీన్ నెట్స్
[ 04-05-2024]
ఎండలు భగ్గుమంటుండంతో వాహన చోదకులు సిగ్నళ్ల వద్ద నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కోవై, తిరుప్పూర్ కార్పొరేషన్ల తరఫున తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేశారు. -
విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు
[ 04-05-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘కెప్టెన్’ అనారోగ్యంతో గతేడాది డిసెంబరులో మృతి చెందగా కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెరిగిన విమాన సర్వీసులు
[ 04-05-2024]
వేసవి రద్దీతో నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు ముగిసి సెలవులు ప్రకటించడంతో అనేక మంది కుటుంబాలతో కలిసి సెలవులు గడిపేందుకు వెళ్తున్నారు. -
నీళ్లట్యాంకులో మలం కలిపారని వదంతులు
[ 04-05-2024]
రాణిపేట సమీపం నౌలాక్ పంచాయతీ సిప్కాట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల సమీపంలో లక్ష లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకు ఉంది. -
ఎలక్షన్ రెండో సింగిల్ విడుదల
[ 04-05-2024]
‘ఉరియడి’, ‘ఫైట్ క్లబ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు విజయకుమార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎలక్షన్’. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఎలక్షన్’ అనే టైటిల్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. -
ఊటీలో 10 రోజులపాటు పుష్ప ప్రదర్శన
[ 04-05-2024]
ఊటీలో మొదటిసారిగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు నీలగిరి కలెక్టర్ అరుణ తెలిపారు. -
వీఐటీ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి 3వ స్థానం
[ 04-05-2024]
వేలూర్ వీఐటీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు