రీ రిలీజ్కు సిద్ధంగా విజయ్ సేతుపతి సినిమాలు
కోలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.
‘నడువుల కొంజం పక్కత్త కాణోం’లో ఓ సన్నివేశం
చెన్నై, న్యూస్టుడే: కోలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. ‘గిల్లి’ చిత్రం ఏకంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రీ రిలీజ్ చిత్రాల బరిలోకి అజిత్ ‘బిల్లా’, ‘దీన’ కూడా చేరుతున్నాయి. అవి మే 1న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి నటించి విజయవంతమైన చిత్రాలను రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2012లో విడుదలైన ‘నడువుల కొంజం పక్కత్త కాణోం’, ‘ఇదర్కుతానే ఆశైపట్టాయ్ బాలకుమారా’ చిత్రాలను త్వరలో రీ రిలీజ్ చేయనున్నారు.
రెట్ట తల చిత్రీకరణ ప్రారంభం
చిత్రబృందం విడుదల చేసిన పోస్టరు
చెన్నై: తిరుకుమరన్ దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటిస్తున్న చిత్రం ‘రెట్ట తల’. ఇది అరుణ్ విజయ్కు 36వ చిత్రం. సిద్ది ఇద్నాని, తన్యా రవిచంద్రన్ నాయికలు. ముఖ్య పాత్రలో బిగ్బాస్ బాలాజీ మురుగదాస్ నటించనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. చిత్రం టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ గతవారం విడుదలైన నేపథ్యంలో సోమవారం చిత్రీకరణ పనులు ప్రారంభమైనట్టు పోస్టరు ద్వారా చిత్రబృందం వెల్లడించింది.
నడిగర్ సంఘానికి నెపోలియన్ రూ.కోటి విరాళం
చెన్నై: నడిగర్ సంఘం భవన నిర్మాణ పనులకు నటుడు నెపోలియన్ రూ.కోటి విరాళం అందించారు. ఆయనకు నడిగర్ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. 2000-2006 మధ్యకాలంలో సంఘం ఉపాధ్యక్షుడిగా నెపోలియన్ వ్యవహరించారు. ఇప్పటికే నటులు కమల్హాసన్, విజయ్, ఉదయనిధి రూ.కోటి చొప్పున, శివకార్తికేయన్ రూ.50 లక్షలు విరాళాలు అందించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అబుదాబిలో రజనీ విశ్రాంతి
[ 17-05-2024]
‘జైలర్’ చిత్రం తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టైయన్’ చిత్రంలో రజనీకాంత్ నటించిన విషయం తెలిసిందే. ఆయన 170వ చిత్రమైన ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు నటించారు. -
వ్యర్థాలతో విద్యుత్తు వెలుగులు
[ 17-05-2024]
రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ తీసుకున్నా పెద్దఎత్తున చెత్తాచెదారాలు పోగవుతున్నాయి. చెన్నైలోనైతే ఇక హద్దేలేదు. ఈ వ్యర్థాలను నిల్వ చేస్తుండటంతో పెద్దఎత్తున విషవాయువులు వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. -
19 జిల్లాల్లో నేడు భారీ వర్షం
[ 17-05-2024]
రాష్ట్రంలో శుక్రవారం 19 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. గురువారం విడుదల చేసిన ప్రకటనలో.. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక సముద్రతీరంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో 20 వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
ఇళయరాజాను కలిసిన మంత్రి
[ 17-05-2024]
ఇసైజ్ఞాని ఇళయరాజాను మర్యాదపూర్వకంగా కలిశానని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఎక్స్ పేజీలో తెలిపారు. -
20 నుంచి 26 వరకు ఐఐటీఎంలో అంతర్జాతీయ సదస్సు
[ 17-05-2024]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో 20 నుంచి 26 వరకు ‘సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్స్ట్ యూత్స్’ (ఎస్పీఐసీ ఎంఏసీఏవై) 9వ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. -
శస్త్రచికిత్స లేకుండా హృదయ చికిత్స
[ 17-05-2024]
పుట్టుకతో హృదయ సమస్య ఉన్న రోగికి తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రిలో శస్త్రచికిత్స లేకుండా విజయవంతంగా చికిత్స అందించారు. -
నగదు మోసం కేసులో సినీ నిర్మాత అరెస్టు
[ 17-05-2024]
కేరళలోని కొచ్చిన్కు చెందిన జానీ థామస్ మలయాళ సినీ నిర్మాత. ఇతనిపై కోవై వడవళ్లికి చెందిన ఉదయశంకర్ అనే వ్యక్తి సిటీ క్రైం బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు. -
కరెంటు తీగలపై దుస్తులు ఆరేయొద్దు
[ 17-05-2024]
వర్షాకాలంలో సంభవించే విద్యుత్తు ప్రమాదాల నియంత్రణకు విద్యుత్తుశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని తప్పకుండా పాటించాలని ప్రజలను కోరింది. -
బడి ఈడులో బాల నేరస్థులుగా..
[ 17-05-2024]
చెన్నై జిల్లాలో ఏటా సరాసరి 500 మందికి పైగా బాలురు హత్య, హత్యాయత్నం, చోరీ, దోపిడీ తదితర కేసులలో అరెస్టయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.