నగదు మోసం కేసులో సినీ నిర్మాత అరెస్టు
కేరళలోని కొచ్చిన్కు చెందిన జానీ థామస్ మలయాళ సినీ నిర్మాత. ఇతనిపై కోవై వడవళ్లికి చెందిన ఉదయశంకర్ అనే వ్యక్తి సిటీ క్రైం బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు.
జానీథామస్
కోయంబత్తూరు, న్యూస్టుడే: కేరళలోని కొచ్చిన్కు చెందిన జానీ థామస్ మలయాళ సినీ నిర్మాత. ఇతనిపై కోవై వడవళ్లికి చెందిన ఉదయశంకర్ అనే వ్యక్తి సిటీ క్రైం బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు. తాను ప్రస్తుతం కెనడాలో ఉంటున్నానని, 2016లో ఖతర్ దేశంలో పని చేస్తుండగా జానీ థామస్తో పరిచయమై స్నేహితులుగా మారామన్నారు. నాన్సెన్ అనే చిత్రాన్ని నిర్మించేందుకు జానీథామస్కు రూ.2.75 కోట్లు అందిచానని చెప్పారు. 2018లో లాభ మొత్తంగా రూ.50 లక్షలు చెల్లించి అసలు ఇవ్వలేదని, అడిగితే బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు జానీ థామస్ను గురువారం అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో 6 కొత్త వైద్య కళాశాలలు
[ 13-06-2024]
రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన జిల్లాల్లో ఆరు వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మొదటి విడతగా మయిలాడుతురై, తిరుపత్తూరు, తెన్కాశిలో, తర్వాత పెరంబలూరు, రాణిపేట, కాంచీపురం జిల్లాలో కళాశాలల నిర్మాణం జరగనుంది. -
విళవంకోడు ఎమ్మెల్యేగా తారగై ప్రమాణ స్వీకారం
[ 13-06-2024]
కన్నియాకుమరి జిల్లా విళవంకోడు ఎమ్మెల్యేగా తారగై కత్బర్ట్ ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే విజయధరణి కాంగ్రెస్ నుంచి వైదొలగి భాజపాలో చేరడంతో ఆమె పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. -
‘భయమరియా బ్రమ్మై’ టీజర్ విడుదల
[ 13-06-2024]
వర్థమాన దర్శకుడు రాహుల్ కపాలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భయమరియా బ్రమ్మై’. గురు సోమసుందరం, జాన్ విజయ్, హరిశ్ ఉత్తమన్, వినోద్ సాగర్, విశ్వంత్, సాయి ప్రియాంక రూత్, దివ్య గణేశ్, హరీశ్ తదితరులు నటించారు. -
29 వరకు శాసనసభ సమావేశాలు
[ 13-06-2024]
శాసనసభ సభమావేశాలు 20 నుంచి 29 వరకు జరగనున్నాయి. సభాపతి అప్పావు అధ్యక్షతన బుధవారం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తొలిరోజు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే పుగళేంది మృతికి సంతాపం తెలుపనున్నారు. -
మత్తుపై ఉక్కుపాదం
[ 13-06-2024]
చెన్నై, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ ముఠాల వ్యాప్తి రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చగా మారుతోంది. లోక్సభ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ప్రచారం సాగింది. ప్రజలు డీఎంకేవైపే ఉండటంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. -
తిరుచ్చి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభం
[ 13-06-2024]
తిరుచ్చి విమానాశ్రయంలో నిర్మించిన కొత్త ప్రయాణికుల టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ను రూ.1,112 కోట్ల వ్యయంతో 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. -
సెంథిల్కు రిమాండు
[ 13-06-2024]
మైలాడుదురైలోని ధరుమపురం ఆధీనం 27వ గురు మహా సన్నిధానంగా శ్రీలశ్రీ మాసిలామణి దేశికన్ వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈయనకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్నాయని వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామని, వాటిని ఆపాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని కొందరు ఫోన్ చేసి బెదిరించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ట్రాయ్ కొత్త సిఫార్సులు.. ఫోన్ నంబర్కూ ఇక ఛార్జీ..?
-
దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
భారత కంపెనీల ‘బ్రాండ్’ బాజా.. టాప్ 100లో ఈ నాలుగింటికి చోటు
-
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రచార ప్రభుత్వం కాదు: తెదేపా ఎంపీ కలిశెట్టి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వర్చువల్ క్రెడిట్ కార్డ్ గురించి ఈ విషయాలు తెలుసా?