విశాఖపై మత్తు పడగ!!
ఓ వైపు వాహనాల్లో భారీగా తరలివస్తున్న గంజాయి... మరో వైపు పెద్ద ఎత్తున రవాణా అవుతున్న ద్రవ రూప గంజాయి... ఇంకో వైపు.... వందల సంఖ్యలో బయటపడుతున్న మత్తు ఇంజక్షన్లు.. ఇవి చాలవన్నట్లు... ఊహించని స్థాయిలో విశాఖ నౌకాశ్రయానికి చేరిన ‘డ్రగ్స్’ ఒక్కసారిగా కలకలం రేపాయి!
భారీగా చిక్కుతున్న డ్రగ్స్, గంజాయి
గంజాయి ప్యాకెట్లు
ఓ వైపు వాహనాల్లో భారీగా తరలివస్తున్న గంజాయి... మరో వైపు పెద్ద ఎత్తున రవాణా అవుతున్న ద్రవ రూప గంజాయి... ఇంకో వైపు.... వందల సంఖ్యలో బయటపడుతున్న మత్తు ఇంజక్షన్లు.. ఇవి చాలవన్నట్లు... ఊహించని స్థాయిలో విశాఖ నౌకాశ్రయానికి చేరిన ‘డ్రగ్స్’ ఒక్కసారిగా కలకలం రేపాయి! ప్రశాంత విశాఖ నగరాన్ని మాదకద్రవ్యాల ముఠాలు తమ అక్రమాలకు అనువైన స్థావరంగా భావిస్తున్నాయంటే ఇక్కడ నిఘాపై ఎన్నో సందేహాలు రేగుతున్నాయి!!
న్యూస్టుడే, ఎంవీపీకాలనీ: విశాఖ పోర్టులో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడటం.. సీబీఐ అధికారులు రంగంలోకి దగడం ఒక్కసారిగా కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక కంటైనర్లో దేశమే ఆశ్చర్యపోయేలా వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పకడ్బందీ భద్రత మధ్య ఆ కంటైనర్ విశాఖ నౌకాశ్రయంలో ఉంచారు. పూర్తిస్థాయి తనిఖీలు సాగితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశ ఉంది. ఇటీవలి కాలంలో సాగర మార్గంలో డ్రగ్స్ విశాఖకు రావడం ఇదే తొలిసారి. అయితే...ఇప్పటికే రోడ్డు, రైలు మార్గాల్లో వస్తున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విశాఖ నగరాన్ని చుట్టుముట్టేశాయి. తరచూ తనిఖీల్లో బయటపడుతున్న గంజాయే దీనికి రుజువు. ఇటీవల కాలంలో దాదాపు 700 కిలోల వరకూ గంజాయి పోలీసులకు చిక్కడం గమనార్హం. భారీ కంటైనర్ లారీలో తీసుకువెళ్తున్న దాదాపు 386 కిలోల గంజాయి కొద్దిరోజుల క్రితం బయటపడింది. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు తనిఖీ చేస్తుండగా తప్పించుకునేందుకు వేగంగా వచ్చిన లారీని వెంటాడి ఎట్టకేలకు ఆనందపురం వద్ద పట్టుకున్నారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుకుంటే...దాని రవాణా మూలాలు విశాఖలో బయటపడుతుండటం గమనార్హం.
ఎన్నికల తరుణంలో ఏపీలోకి భారీగా డ్రగ్స్
మత్తు ఇంజక్షన్లు
గోవా నుంచి దిగుమతి: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట తగ్గినా...ఒడిశా నుంచి పెద్ద ఎత్తున నగరానికి దిగుమతి అవుతోంది. జాతీయ రహదారితో పాటు ఏజెన్సీ మార్గాల మీదుగా తెచ్చేస్తున్నారు. ప్రధానంగా కోల్కతా, కేరళ, హైదరాబాద్, దిల్లీ, రాజస్థాన్, హరియాణా, బిహార్ వంటి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు విశాఖకు వస్తున్నారు. గుట్టుగా ఇక్కడే ఉండి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి..విశాఖ తెచ్చి ..తరువాత ఆయా ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. నియంత్రణకు నగర శివారులో చెక్పోస్టులు ఏర్పాటుచేసినా.. వీటి అక్రమ రవాణా మాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో గంజాయి పోలీసుల తనిఖీల్లో లభిస్తున్నా కేవలం సమాచారం ఉన్నంత వరకే వీటిని స్వాధీనం చేసుకోగలుగుతున్నారు. సమాచారం అందని సరకు మాత్రం జిల్లా సరిహద్దులు దాటి వెళ్లిపోతోంది.
- గంజాయిని కొన్ని పార్సిళ్ల కేంద్రాల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న తీరు ఇటీవల బయటపడింది.
- గోవా నుంచి రహస్యంగా డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. సమాచారం వచ్చిన మేరకు పోలీసులు ఆయా ముఠాలను పట్టుకుంటున్నారు.
- మత్తుకలిగించే ఇంజక్షన్ల విక్రయాలు కూడా నగరంలో జోరుగా సాగుతున్నాయి. ఒడిశా, కోల్కతాల నుంచి దిగుమతి చేసుకునియువతకు విక్రయిస్తున్నారు. బానిసలుగా మారిన వారే.. తర్వాత వ్యాపారులుగా మారి విక్రయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనకు ‘దక్షిణం’ జై!
[ 03-05-2024]
యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు దక్కాలంటే వైకాపా ప్రభుత్వం కూలిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పేర్కొన్నారు. -
జగమొండి.. పథకాలకు గండి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసింది. ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలు గుప్పించిన జగన్ వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. -
నేడు బాలకృష్ణ రోడ్షో
[ 03-05-2024]
సినీ నటుడు బాలకృష్ణ రోడ్షో శుక్రవారం సాయంత్రం నగరంలో జరగనుందని తెదేపా వర్గాలు తెలిపాయి. -
ఆలయ భూమి హాంఫట్
[ 03-05-2024]
గ్రామదేవతకు భక్తులు అందించిన భూమిని నాయకులతో కలిసి ఒకరు కారుచౌకగా కొట్టేశారు. -
మౌలిక వసతులతో ఇళ్లిస్తాం: అయ్యన్న
[ 03-05-2024]
కూటమి విజయం ఖాయం. అధికార పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే నర్సీపట్నంలోని టిడ్కో గృహ సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. -
జగన్కు యూఎల్సీ ఝలక్..!
[ 03-05-2024]
నగరంలోని యూఎల్సీ (పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం) ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూముల్లో వెలిసిన ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నీరుగారి పోయింది. -
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం
[ 03-05-2024]
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
అధ్వాన రహదారులతో అనకాపల్లి జిల్లా
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
కూటమితో బీసీలకు రాజ్యాధికారం: శ్రీభరత్
[ 03-05-2024]
ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపాను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెదేపా కూటమితోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా కూటమి అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: గంటా
[ 03-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో దుర్మార్గ వైకాపా సర్కారును తరిమికొట్టి సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన చారిత్రక అవసరం అందరిపైన ఉందని భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. -
నేటి నుంచి నిజరూప దర్శనం టికెట్ల విక్రయం
[ 03-05-2024]
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవోపేతంగా జరగనుంది. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : గణబాబు
[ 03-05-2024]
ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
పట్టాదారు పుస్తకం మీద సీఎం బొమ్మ ఉంటే ఏం?: బొత్స
[ 03-05-2024]
రైతుల పట్టాదారు పాసు పుస్తకం మీద సీఎం చిత్రం ఉంటే అది చట్టపరంగా చెల్లకపోవడమంటూ ఏమీ లేదు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ భూ హక్కుదారులను అపహాస్యం చేశారు. -
అవయవదానంతో దాతృత్వం చాటారు!
[ 03-05-2024]
చనిపోయిన వ్యక్తి అవయవదానానికి ముందుకు వచ్చి ఆ కుటుంబ సభ్యులు దాతృత్వం చాటారు. -
నకిలీ నోట్లు, బంగారం ముఠా గుట్టురట్టు
[ 03-05-2024]
తక్కువ కాలంలో డబ్బు, బంగారం సంపాదించాలని ఆశపడే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లు, బంగారంతో మోసగిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేసినట్లు మధురవాడ ఏసీపీ గురువారం తెలిపారు. -
‘సిద్ధం’ తాయిలాల టోకెన్లకు ఘర్షణ
[ 03-05-2024]
విశాఖ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ సిద్ధం సభకు సిద్ధం చేసిన టోకెన్లపై ఆ పార్టీలోనే ఇద్దరు నాయకులు తీవ్రంగా ఘర్షణ పడటంతో పాటు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
తాజా వార్తలు (Latest News)
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్