వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు.
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. ఇరుకు రోడ్లపై ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సిన రోజులు చెల్లిపోయాయని, సువిశాలంగా రహదారులు విస్తరిస్తున్నామంటూ తెగ కబుర్లు చెప్పారు.
పలుచోట్ల పనులు ప్రారంభించామని చెబుతూ కొన్ని భవనాలు పడగొట్టి ఆరంభంలో ఆర్భాటం ప్రదర్శించారు. ఆ తరవాత ఇదిగో.. అదిగో అంటూ మాటలతోనే పుణ్యకాలం పూర్తి చేశారు. మొత్తం అయిదేళ్ల పాలనా కాలంలో మొదలెట్టిన ఏ ఒక్కచోటా రహదారుల విస్తరణ పూర్తి చేయలేక అసంపూర్తిగా వదిలేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్, ఆయన అనుచర గణానికే దక్కుతుంది.
ఉత్తరాంధ్రలో పేరొందిన అనకాపల్లి నూకాలమ్మ ఆలయ రహదారిని విస్తరించాలని తెదేపా హయాంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల్లో భవనాలను తొలగించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని ఏ మాత్రం పట్టించుకోలేదు.
పెరుగు బజార్లో పెరిగిన కష్టాలు
నిలిచిన పెరుగుబజారు పనులు
అనకాపల్లి, న్యూస్టుడే: జిల్లా కేంద్రం అనకాపల్లిలో రహదారుల విస్తరణ విషయంలో వైకాపా సర్కారు అభాసుపాలయింది. పట్టణంలోని వ్యాపార కేంద్రాల్లో పెరుగు బజారు ముఖ్యమైనది. ఈ మార్గంలోనే అనేక కిరాణా, బంగారం, ఫ్యాన్సీ, దుస్తుల దుకాణాలు ఉన్నాయి. కానీ ఈ రోడ్డు చాలాచోట్ల 18 నుంచి 22 అడుగుల వెడల్పు ఉండేది. నాలుగు రోడ్ల కూడలి నుంచి గాంధీ బొమ్మ కూడలి వరకూ 0.6 కిలోమీటర్ల దూరం 50 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. రహదారికి ఇరువైపులా 111 భవనాలు, 28 ఖాళీస్థలాలు ఉన్నాయి. తెదేపా హయాంలోనే 79 భవనాలకు పరిహారం చెల్లించారు. విస్తరణ పనులు ప్రారంభించే ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. వైకాపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ అమర్నాథ్ నాలుగేళ్లు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కనీసం జీవీఎంసీ అనకాపల్లి జోన్లో చేపట్టాల్సిన పనులపై సమీక్షించలేదు. నాలుగేళ్ల తర్వాత పెరుగు బజారు రహదారి విస్తరణ పనులు గతేడాది జులై 10న ప్రారంభించారు. అదైనా పూర్తి చేశారా అంటే అదీ లేదు. తనకు అనకాపల్లి టిక్కెట్ దక్కదని తెలుసుకున్న తరవాత అమర్నాథ్ పెరుగు బజారును గాలికొదిలేశారు. దీంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
అరకులో అష్ట కష్టాలు
ఎండపల్లివలస వద్ద రహదారిపై నిలిచిన వర్షపునీరు
అరకులోయ, న్యూస్టుడే: ఆంధ్రా ఊటీ అరకులోయని సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో 2019లో రూ. 20 కోట్ల నిధులను విడుదల చేశారు. పనులు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వం కొలువుదీరింది. అంతే.. సుందరీకరణకు గ్రహణం పట్టింది. ఆర్ఐటీఐ నుంచి ఎండపల్లివలస వరకు ప్రధాన రహదారి విస్తరణ పనులు అస్తవ్యస్తంగా జరిగాయి. సుందరీకరణ మాట దేవుడెరుగు గతంలో ఉన్న వెసులుబాటు సైతం లేకుండాపోయింది. వాహనాలు పార్కింగ్ చేయాలో తెలియని పరిస్థితి.రహదారి పైనే వాహనాలను నిలపాల్సిన పరిస్థితి. మరోవైపు విస్తరణ పనులు సక్రమంగా చేయకుండా వాహనాలు ‘యు’ టర్న్ తీసుకునే ప్రాంతాల్లో ఖాళీ తక్కువగా వదలడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. విస్తరణ పనుల్లో నాణ్యత లేని కారణంగా కోడిగెడ్డ వంతెన వద్ద నిర్మించిన రహదారి కొద్ది రోజులకే ఛిద్రంగా మారింది. దీంతో వాహనదారులు గోతుల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. మరోవైపు ఇష్టానుసారంగా పనులు చేయటంతో వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది.
జగన్ చెప్పినా జరగదంతే!
మట్టిరోడ్డుగానే వదిలేసిన పెదబొడ్డేపల్లి-కొత్తవీధి మార్గం
‘అబీద్ కూడలి నుంచి పెదబొడ్డేపల్లి పెద్దమదుం వరకు నర్సీపట్నం ప్రధాన రహదారి, పెదబొడ్డేపల్లి విద్యుత్తు ఉపకేంద్రం నుంచి కొత్తవీధి మీదుగా వేంకటేశ్వర ఆలయం వరకు రహదారి విస్తరణ పనులకు రూ. 16.6 కోట్ల నిధులిచ్చాం’
2022 డిసెంబరు 30న నర్సీపట్నం సమీపంలోని జోగునాధునిపాలెం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలివీ. నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాల కాపీని ఆయన అందరికీ చూపించి ఎమ్మెల్యే గణేష్కు అందజేశారు.
సాక్షాత్తూ సీఎం ఇచ్చిన నిధులు కావడంతో పనులన్నీ శరవేగంతో పూర్తవుతాయని అందరూ ఆశించారు. దాదాపు 17 నెలలు కావస్తున్నా ఇప్పటికీ పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి.
- అబీద్ కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మాత్రం రోడ్డు వంద అడుగులకు విస్తరించేందుకు వీలుగా కొన్ని ప్రభుత్వ భవనాలను కొంతమేర తొలగించారు. ఇరువైపులా డ్రైనేజీ కట్టి కంకర వేసి వదిలేశారు. పెదబొడ్డేపల్లి పెద్దమదుం నుంచి పాత ఎన్టీఆర్ కళాశాల వరకు డ్రైనేజీ మాత్రం నిర్మించారు. విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు రూ. 10.60 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేశారు.
- నర్సీపట్నం వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కొత్తవీధి, పెదబొడ్డేపల్లి పెద్దచెరువు మీదుగా సబ్స్టేషన్ వద్ద చోడవరం రోడ్డును కలుపుతూ 40 అడుగుల మేర విస్తరణ పనులకు రూ. 6 కోట్లు కేటాయించారు. ఈ పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. తొలుత 40 అడుగుల మేరకు విస్తరిస్తామని ఎమ్మెల్యే ప్రకటించినా ఆ తరువాత 30 అడుగులకే పరిమితం చేశారు. కొన్ని భవనాలను 30 అడుగుల మేరకు స్వచ్ఛందంగా సంక్రాంతి తరవాత తొలగిస్తామని కొందరు వ్యాపారులు ఎమ్మెల్యేకి హామీ ఇచ్చినా ఇప్పటికీ తొలగించలేదు. చెరువు వద్ద దేశనాయకుల విగ్రహాలు పెట్టినా విద్యుత్తు దీపాలు లేవు. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడం వల్లనే ఈ పనులు ముందుకు వెళ్లడం లేదని అధికారులు చెబుతున్నారు.
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే
పాడేరులో ప్రణాళికను పాతిపెట్టారు
పొక్లెయిన్తో దుకాణాల తొలగింపు (పాత చిత్రం)
పాడేరు, న్యూస్టుడే: పాడేరు పట్టణ రోడ్డు సుందరీకరణలో భాగంగా ఇరువైపులా ఫుట్పాత్, మధ్యలో డివైడర్తో సుమారు నాలుగున్నర కిలోమీటర్ల మేర 35 అడుగుల మేర విస్తరించాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఐటీడీఏ అధికారులు రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో పట్టణ పరిధిలో ఉన్న రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. తాత్కాలిక దుకాణాలు కోల్పోయిన ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదు. ఇంతలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రంగంలోకి దిగి ఎన్నికల ముందు ఇలాంటి పనులు చేపడితే తమకు ఓట్లు పోతాయంటూ అడ్డంపడ్డారు. సంబంధిత అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి పనులు నిలిపివేయించారు. తవ్వేసిన గుంతలు, కాల్వలతో ఏడాదిగా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
కొత్తకోటలో కొత్త తిప్పలు
విస్తరించని కొత్తకోట రహదారి
రావికమతం: భీమిలి-నర్సీపట్నం రోడ్డు అభివృద్ధిలో భాగంగా రావికమతంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు మూడేళ్లుగా ముందుకు కదల్లేదు. తొలుత 80 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించినా వ్యాపారులు అభ్యంతరం తెలపడంతో 60 అడుగులకు పరిమితం చేశారు. తొలగించాల్సిన శాశ్వత కట్టడాల్లో అధికార పార్టీకి వారివి ఉండటంతో వారంతా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆక్రమణలు తొలగించకుండా నిలిపివేయించారు. దీంతో ఆక్రమణల తొలగింపు జరగక రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
నిర్వహణ పనులపై నిర్లక్ష్యం
[ 17-05-2024]
ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలోని మాచ్ఖండ్ జల విద్యుత్కేంద్రంలో సివిల్ డివిజన్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయి. జలాశయం రక్షణ కోసం చేపట్టాల్సిన మరమ్మతు పనులను సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
2,08,329 మంది వజ్రాయుధాన్ని వదిలేశారు
[ 17-05-2024]
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. జిల్లాలో 12,89,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ సారి 10,81,042 మంది ఓటు వేయగా, 208329 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
మాంచానమ్మ జాతర ప్రారంభం
[ 17-05-2024]
పెదార్కూరు ఆదివాసుల ఇలవేల్పు అయిన మాంచానమ్మ జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారిని అలంకరించిన తరవాత జాతర ప్రారంభించారు. -
బీసీజీ టీకా తప్పనిసరి
[ 17-05-2024]
టీబీ బాధితుల కుటుంబసభ్యులు తప్పనిసరిగా బీసీజీ టీకా వేసుకోవాలని టీబీ రాష్ట్ర బృంద ప్రొఫెసర్ రవీందర్ పేర్కొన్నారు. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు (హెల్పర్) మృతి చెందాడు. -
పాడేరులో పాగా వేసేదెవరు?
[ 17-05-2024]
మన్యంలోని ఆదివాసీ గిరిజనులు ఈసారి ఎన్నికల్లో ఎవరిని అందలం ఎక్కిస్తారు.. నువ్వా.. నేనా అంటూ సాగిన సార్వత్రిక ఎన్నికల పోరులో అడవి బిడ్డల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది. -
ఫలించిన ప్రణాళిక
[ 17-05-2024]
మావోయిస్టు ప్రభావిత అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
మోదకొండమ్మ ఉత్సవాలపై ఆంక్షలు
[ 17-05-2024]
రాష్ట్ర గిరిజన జాతర పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు పోలీసులు ఎన్నికల ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జాతర నిర్వహించాలని నిర్ణయించారు. -
క్షయ నివారణకు చర్యలు
[ 17-05-2024]
మన్యంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి సాధన పేర్కొన్నారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండండి
[ 17-05-2024]
పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత గురువారం తనిఖీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే