రక్షకభటులపై కక్ష
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు.
వైకాపా పాలనలో పోలీసులకు అన్నివిధాలా అన్యాయం
వారాంతపు సెలవులు ఉత్తుత్తి హామీ
సంక్షేమ సంఘాన్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. పార్టీ సేవకు సైతం పోలీసులను ఇష్టారాజ్యంగా వాడేసుకుంటూ వారికి ప్రభుత్వపరంగా కల్పించాల్సిన ప్రయోజనాలు పక్కనపెట్టేశారు.
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, పాడేరు/పట్టణం
అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్మోహన్రెడ్డి రక్షకభటులపై ఎక్కడలేని ప్రేమ ఒలకపోశారు. పోలీసులు ఎంతో కష్టపడుతున్నారని, వారాంతపు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి పోలీస్స్టేషన్లో సిబ్బంది దీన్ని వినియోగించుకోవచ్చని ఆర్భాటం చేశారు. దేశంలో మొదటిసారిగా ఈ దిశగా అడుగు వేసింది తామేనంటూ ప్రచారాన్ని ఊదరగొట్టారు. కొద్ది రోజులపాటు మాత్రం అమలు చేసి అనంతరం స్టేషన్లో సిబ్బంది కొరత అంటూ మానేశారు. వారాంతపు సెలవుల మాట అటుంచి, అసలు విరామం దొరకడమే గగనమైందనే పరిస్థితి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం విధినిర్వహణ సమయం బాగా పెరిగిపోయిందంటూ పలువురు పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో ఏడు రోజులూ ఏదో ఒకచోట బందోబస్తు, స్టేషన్లో విధులు, రాత్రివేళలో పహారా వంటి బాధ్యతలతో నరక యాతన చూస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు వైకాపా ప్రభుత్వ పాలనలో పోలీసులకు కొత్త చిక్కువచ్చిపడింది. ప్రభుత్వ విధానాలపై ఆగ్రహంతో ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపార వర్గాలు... ఇలా ఎవరు ఆందోళనలకు సిద్ధమైనా వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులనే ముందుకు తెస్తోంది. ఆందోళనకు సిద్ధమైన వారిని ముందస్తు అరెస్ట్ చేస్తోంది. ఇంకొందరిని గృహనిర్బంధాల పేరుతో ఇల్లు కదలనీయకుండా చేస్తోంది. ఇందుకోసం వెళ్లిన కానిస్టేబుళ్లు రోజంతా ఆందోళనకారుల ఇళ్ల ముందు నిలువు కాళ్లపై నుంచుని కాపలా కాయాల్సి వస్తోంది.
గతంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఉండేది. దీనికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్యవర్గం ఉండేది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేసే కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వరకు సంఘ సభ్యులను ఎన్నుకునేవారు. ఎన్నికైన వారు సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వీటిని నేరుగా ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచి ఈ సంఘం ఉనికి లేకుండాపోయింది. సంఘం కార్యవర్గ ఎన్నిక సమయంలో కొందరు అనర్హులు ఉన్నారంటూ ఓడిపోయినవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తీర్పు వచ్చేవరకు తాత్కాలిక కమిటీతో సంఘాన్ని నిర్వహించాలని చెప్పడంతో నాటి నుంచి నేటివరకు ఏర్పాటుచేసిన కమిటీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ప్రభుత్వ ఆశీస్సులున్న పోలీసు అధికారులే ఈ కమిటీపై పెత్తనం చేస్తుండటంతో గతంలోలా సభ్యులు తమ గోడు చెప్పుకొనే వీలు లేకుండాపోయింది.
ఇదేనా అండగా నిలవడం జగన్?
- గతంలో విధి నిర్వహణలో ఉంటూ మృతిచెందిన పోలీస్ కుటుంబాలకు క్యాడర్తో సంబంధం లేకుండా రూ. లక్ష నగదు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం సహాయంగా అందించేది. సంఘ సభ్యులకు కష్టకాలంలో ఈ నగదు ఎంతో ఉపయోగపడేది. జగన్ పాలనాపగ్గాలు చేపట్టిన 2019 నుంచి ఈ సహాయం అందించడం ఆపేశారు.
- గత ప్రభుత్వ హయాంలో పోలీస్ ఆరోగ్య భద్రత కింద వైద్య ఖర్చులు రూ. 10 లక్షలు ఖర్చయినా ప్రభుత్వం భరించేది. ఈ ప్రభుత్వ హయాంలో రూ. లక్షకు మించి బిల్లులైతే తాము వైద్యం చేయమని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. చేసేది లేక చేతిడబ్బులు వదిలించుకుని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని పలువురు పోలీసులు వాపోతున్నారు.
- సరెండర్ లీవ్లకు గత రెండేళ్లుగా ప్రభుత్వం నగదు చెల్లించడం లేదు. విధి నిర్వహణలో భాగంగా ఏడాదికి పొడవునా సెలవులను వినియోగించుకోకుండా, సెలవు రోజుల్లోనూ విధులు నిర్వహించినందుకు పోలీసులకు ఒక నెల జీతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం దీనిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు.
అల్లూరి జిల్లాలో సబ్ డివిజన్లు: 4 (పాడేరు, చింతపల్లి రంపచోడవరం, చింతూరు)
పోలీస్ స్టేషన్లు: 27
సిబ్బంది: సుమారు 1200 మంది (కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
నిర్వహణ పనులపై నిర్లక్ష్యం
[ 17-05-2024]
ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలోని మాచ్ఖండ్ జల విద్యుత్కేంద్రంలో సివిల్ డివిజన్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయి. జలాశయం రక్షణ కోసం చేపట్టాల్సిన మరమ్మతు పనులను సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
2,08,329 మంది వజ్రాయుధాన్ని వదిలేశారు
[ 17-05-2024]
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. జిల్లాలో 12,89,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ సారి 10,81,042 మంది ఓటు వేయగా, 208329 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
మాంచానమ్మ జాతర ప్రారంభం
[ 17-05-2024]
పెదార్కూరు ఆదివాసుల ఇలవేల్పు అయిన మాంచానమ్మ జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారిని అలంకరించిన తరవాత జాతర ప్రారంభించారు. -
బీసీజీ టీకా తప్పనిసరి
[ 17-05-2024]
టీబీ బాధితుల కుటుంబసభ్యులు తప్పనిసరిగా బీసీజీ టీకా వేసుకోవాలని టీబీ రాష్ట్ర బృంద ప్రొఫెసర్ రవీందర్ పేర్కొన్నారు. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు (హెల్పర్) మృతి చెందాడు. -
పాడేరులో పాగా వేసేదెవరు?
[ 17-05-2024]
మన్యంలోని ఆదివాసీ గిరిజనులు ఈసారి ఎన్నికల్లో ఎవరిని అందలం ఎక్కిస్తారు.. నువ్వా.. నేనా అంటూ సాగిన సార్వత్రిక ఎన్నికల పోరులో అడవి బిడ్డల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది. -
ఫలించిన ప్రణాళిక
[ 17-05-2024]
మావోయిస్టు ప్రభావిత అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
మోదకొండమ్మ ఉత్సవాలపై ఆంక్షలు
[ 17-05-2024]
రాష్ట్ర గిరిజన జాతర పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు పోలీసులు ఎన్నికల ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జాతర నిర్వహించాలని నిర్ణయించారు. -
క్షయ నివారణకు చర్యలు
[ 17-05-2024]
మన్యంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి సాధన పేర్కొన్నారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండండి
[ 17-05-2024]
పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత గురువారం తనిఖీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ