logo

జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.

Updated : 03 May 2024 04:41 IST

గాయపడిన పల్లా గోవిందరాజు

పరవాడ, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.  బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదముషిడివాడ హైస్కూల్‌ ప్రాంతం వీధిలో జనసేన కార్యకర్త పల్లా గోవిందరాజు(38)తో పాటు మరో నలుగురు జనసైనికులు కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో వైకాపా నాయకుడు దాలిబోయిన అప్పారావు ఇంటికి ఎదురుగా రోడ్డు మీద ఉండగానే ఆయన కలగజేసుకుని తాను వైకాపా నాయకుడునని మా ఇంటికి ప్రచారానికి రావద్దని చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్లడం మానేశామన్నారు. అనంతరం ఆయన అన్నయ్య తాతారావు ఇంటికి వెళ్తుండగా అప్పారావు వచ్చి దుర్భాషలాడుతూ గోవిందరాజు ముఖంపై ఒక్కసారిగా పిడిగుద్దులు కురిపించడంతో కంటి కిందిభాగంలో గాయమై రక్తస్రావమైంది. అక్కడితో ఆగకుండా వెదురకర్రతో వీపుపైన కొట్టాడు. వెంటనే తోటి జనసేన కార్యకర్తలు గోవిందరాజును అగనంపూడి సీహెచ్‌సీకి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకుని కంటి వైద్యం కోసం గాజువాకలోని కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశామని బాధితుడు గోవిందరాజు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పరవాడ సీఐ బాలసూర్యారావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని