ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాడేరు యూనియన్ బ్యాంకు వద్ద ఎండలో ఎదురుచూస్తున్న పింఛన్దారులు
పాడేరు, జి.మాడుగుల, న్యూస్టుడే: పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్ లేని కొంత మందితో స్థానిక యూనియన్ బ్యాంక్ సిబ్బంది అప్లికేషన్లు నింపించి, రూ.200 చెల్లింపులు చేయించి పింఛన్లు అందజేశారు. జి.మాడుగులకు చెందిన లక్ష్మి, జి.మచ్చమ్మల సొమ్ము బ్యాంకులో పడలేదు. సచివాలయానికి వెళ్లి అడిగితే బ్యాంకు ఖాతాలో పడిందని సిబ్బంది సమాధానం చెబుతున్నారు. ఏమి చేయాలో తెలియక వారు ఇంటిబాట పట్టారు.
జి.మాడుగులలో యూనియన్ బ్యాంక్ పీవోల వద్ద పింఛను సొమ్ము తీసుకుంటున్న పింఛనుదారులు
పంపిణీలో అగ్రస్థానం: పింఛన్ల పంపిణీలో గురువారం రాష్ట్రంలో అల్లూరి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయానికి ఇంటింటికీ పింఛన్ల పంపిణీలో 93.87 శాతంతో నాలుగో స్థానం, డీబీటీ విధానంలో పంపిణీలో 98.85 శాతంతో రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. మొత్తం పంపిణీలో అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. శుక్రవారం నాటికి శతశాతం పింఛన్ల పంపిణీ పూర్తిచేయాలని ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు.
సొమ్మసిల్లిన వృద్ధులు
పాడేరు బ్యాంకుకు భార్య సహాయంతో వచ్చిన వృద్ధుడు బోయిని అప్పారావు
పాడేరు, న్యూస్టుడే: జిల్లావ్యాప్తంగా పింఛన్ల కోసం బ్యాంకులు వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాశారు. బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడలేదని సిబ్బంది చెప్పడంతో వృద్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 1.28 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. పలు చోట్ల వృద్ధులు ఎండకు స్పృహతప్పి పడిపోయారు. పాడేరు మండల కేంద్రంలో స్టేట్బ్యాంకు, యూనియన్ బ్యాంకు, గ్రామీణ బ్యాంకులు, సీఎస్పీ సెంటర్ల వద్దకు వృద్ధులు తరలివచ్చారు. కొంతమంది లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లకు ఫోన్, ఆధార్ నంబరు లింక్ కాక పింఛన్దారులు అవస్థలు పడ్డారు.
ఖాతాలో జమ కాలేదనడంతో నిరాశ
డుంబ్రిగుడ, న్యూస్టుడే: డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ అరమపనసపుట్టు గ్రామానికి చెందిన బురిడి మహదేవ్ పింఛన్ కోసం స్థానిక యూనియన్ బ్యాంకును ఆశ్రయించారు. పింఛన్ నగదు జమ కాలేదని సంబంధిత సిబ్బంది తెలపడంతో నిరాశగా వెనుదిరిగారు. పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని సచివాలయ సిబ్బంది సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఈనెల పింఛన్ ఎలా పొందాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు కొండలరావుకు పింఛను
పాడేరు, న్యూస్టుడే: ఈనెల రెండో తేదీన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట’ శీర్షికన వచ్చిన వార్తకు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమరెడ్డి కొండలరావుకు పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం పాడేరు ఎంపీడీఓ సాయి నవీన్ విచారణ జరిపారు. ఆధార్ లింక్ అయిన కొండలరావు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు.
సుగర్ మందులు వేసుకోలేదు: నాది సీహెచ్ఎల్పురం గ్రామం. పింఛను తీసుకోవడానికి ఉదయాన్నే బ్యాంకు వద్దకు వచ్చాను. ఇక్కడ చూస్తే భారీ రద్దీ ఉంది. ఎప్పుడు తీసుకుంటానో తెలియడంలేదు. షుగర్ మందులు వేసుకోవాలి, నిల్చోలేకపోతున్నా. మాలాంటి వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఊళ్లో అందిస్తే ఇబ్బంది లేకుండా ఉండేది.
బండారు నూకరత్నం
బ్యాంకు బయట వేచి ఉన్న లబ్ధిదారులు
నడుం వంగిపోయినా తప్పని కష్టం.. నక్కపల్లి బ్యాంకు నుంచి బయటకు వస్తున్న వృద్ధురాలు
పింఛన్కోసం వచ్చి క్యూలో నలిగిపోతున్న సీతంపాలేనికి చెందిన వృద్ధులు
అనకాపల్లిలో పింఛను సొమ్ము కోసం నడవలేని స్థితిలో బ్యాంకుకు వస్తున్న వృద్ధురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
నిర్వహణ పనులపై నిర్లక్ష్యం
[ 17-05-2024]
ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలోని మాచ్ఖండ్ జల విద్యుత్కేంద్రంలో సివిల్ డివిజన్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయి. జలాశయం రక్షణ కోసం చేపట్టాల్సిన మరమ్మతు పనులను సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
2,08,329 మంది వజ్రాయుధాన్ని వదిలేశారు
[ 17-05-2024]
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. జిల్లాలో 12,89,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ సారి 10,81,042 మంది ఓటు వేయగా, 208329 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
మాంచానమ్మ జాతర ప్రారంభం
[ 17-05-2024]
పెదార్కూరు ఆదివాసుల ఇలవేల్పు అయిన మాంచానమ్మ జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారిని అలంకరించిన తరవాత జాతర ప్రారంభించారు. -
బీసీజీ టీకా తప్పనిసరి
[ 17-05-2024]
టీబీ బాధితుల కుటుంబసభ్యులు తప్పనిసరిగా బీసీజీ టీకా వేసుకోవాలని టీబీ రాష్ట్ర బృంద ప్రొఫెసర్ రవీందర్ పేర్కొన్నారు. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు (హెల్పర్) మృతి చెందాడు. -
పాడేరులో పాగా వేసేదెవరు?
[ 17-05-2024]
మన్యంలోని ఆదివాసీ గిరిజనులు ఈసారి ఎన్నికల్లో ఎవరిని అందలం ఎక్కిస్తారు.. నువ్వా.. నేనా అంటూ సాగిన సార్వత్రిక ఎన్నికల పోరులో అడవి బిడ్డల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది. -
ఫలించిన ప్రణాళిక
[ 17-05-2024]
మావోయిస్టు ప్రభావిత అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
మోదకొండమ్మ ఉత్సవాలపై ఆంక్షలు
[ 17-05-2024]
రాష్ట్ర గిరిజన జాతర పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు పోలీసులు ఎన్నికల ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జాతర నిర్వహించాలని నిర్ణయించారు. -
క్షయ నివారణకు చర్యలు
[ 17-05-2024]
మన్యంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి సాధన పేర్కొన్నారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండండి
[ 17-05-2024]
పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత గురువారం తనిఖీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
-
షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
-
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా