కూటమి వెంట జన బలం!!
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు.
నామినేషన్లకు భారీగా రాక
ర్యాలీలో పాల్గొన్న తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు, నాయకులు
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు.
తెదేపా, జనసేన, భాజపా కూటమికి జన బలం తోడైందని. ఇదే విజయానికి చిహ్నమని పలువురు పేర్కొన్నారు.
‘దక్షిణం’ దద్దరిల్లేలా..
వన్టౌన్, న్యూస్టుడే: విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున జనసేన అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాసరావు (వంశీకృష్ణ శ్రీనివాస్) బుధవారం నామపత్రం దాఖలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 8.30గంటలకు పూర్ణమార్కెట్ కూడలిలోని దుర్గాలమ్మ ఆలయంలో పూజలు చేశారు. భాజపా, తెదేపా, జనసేన పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలి రాగా.. దుర్గాలమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీసుబ్యారెక్సు, జగదాంబకూడలి మీదుగా టర్నర్చౌల్ట్రీ వరకు కొనసాగింది. అనంతరం మహారాణిపేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి వంశీకృష్ణ నామపత్రాలు అందజేశారు. తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్, నాయకులు సీతంరాజు సుధాకర్, వంశీకృష్ణ సతీమణి చెన్నుబోయిన పద్మజ, తదితరులు పాల్గొన్నారు.
గాజువాకలో ర్యాలీకి భారీగా హాజరైన కూటమి శ్రేణులు
‘పశ్చిమం’లో. పండగలా..
గోపాలపట్నం, న్యూస్టుడే : పశ్చిమ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు (పీజీవీఆర్.నాయుడు- గణబాబు) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా జ్ఞానాపురంలోని జోనల్ కార్యాలయానికి వెళ్లి ఆర్వో హుస్సేన్సాహెబ్కు నామపత్రాలు అందించారు. జనసేన ఇన్ఛార్జి ఎ.దుర్గాప్రశాంతి పాల్గొన్నారు.
గాజువాక జనసంద్రం
అక్కిరెడ్డిపాలెం, న్యూస్టుడే: గాజువాక నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు బుధవారం నామినేషన్ వేశారు. వేలాది మంది కూటమి కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో భారీ ర్యాలీగా గాజువాక కుంచమాంబ ఆలయం నుంచి ఎన్నికల కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి లక్ష్మారెడ్డికి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, గాజువాక జనసేన ఇన్ఛార్జి కోన తాతారావు, భాజపా ఇన్ఛార్జి కరణంరెడ్డి నర్సింగరావు పాల్గొన్నారు.
పెందుర్తి... అభిమానుల జోరు
పెందుర్తి, న్యూస్టుడే: పెందుర్తి నియోజకవర్గంలో కూటమి తరఫున పోటీలో నిలిచిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు నామినేషన్ ఘట్టం బుధవారం అట్టహాసంగా జరిగింది. నియోజకవర్గానికి చెందిన మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున ర్యాలీ నిర్వహించారు. వేపగుంట కూడలి నుంచి చినముషిడివాడ కూడలి వరకు వేలాది వాహనాలతో ర్యాలీ చేశారు. పంచకర్ల రమేశ్బాబు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ, జీవీఎంసీ తెదేపా ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాసరావు, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ర్యాలీలో పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి పి.శేషశైలజకు మూడు సెట్ల నామపత్రాలను సమర్పించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ సోదరుడు శ్రీనివాస్నాయుడు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనకు ‘దక్షిణం’ జై!
[ 03-05-2024]
యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు దక్కాలంటే వైకాపా ప్రభుత్వం కూలిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పేర్కొన్నారు. -
జగమొండి.. పథకాలకు గండి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసింది. ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలు గుప్పించిన జగన్ వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. -
నేడు బాలకృష్ణ రోడ్షో
[ 03-05-2024]
సినీ నటుడు బాలకృష్ణ రోడ్షో శుక్రవారం సాయంత్రం నగరంలో జరగనుందని తెదేపా వర్గాలు తెలిపాయి. -
ఆలయ భూమి హాంఫట్
[ 03-05-2024]
గ్రామదేవతకు భక్తులు అందించిన భూమిని నాయకులతో కలిసి ఒకరు కారుచౌకగా కొట్టేశారు. -
మౌలిక వసతులతో ఇళ్లిస్తాం: అయ్యన్న
[ 03-05-2024]
కూటమి విజయం ఖాయం. అధికార పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే నర్సీపట్నంలోని టిడ్కో గృహ సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. -
జగన్కు యూఎల్సీ ఝలక్..!
[ 03-05-2024]
నగరంలోని యూఎల్సీ (పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం) ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూముల్లో వెలిసిన ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నీరుగారి పోయింది. -
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం
[ 03-05-2024]
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
అధ్వాన రహదారులతో అనకాపల్లి జిల్లా
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
కూటమితో బీసీలకు రాజ్యాధికారం: శ్రీభరత్
[ 03-05-2024]
ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపాను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెదేపా కూటమితోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా కూటమి అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: గంటా
[ 03-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో దుర్మార్గ వైకాపా సర్కారును తరిమికొట్టి సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన చారిత్రక అవసరం అందరిపైన ఉందని భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. -
నేటి నుంచి నిజరూప దర్శనం టికెట్ల విక్రయం
[ 03-05-2024]
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవోపేతంగా జరగనుంది. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : గణబాబు
[ 03-05-2024]
ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
పట్టాదారు పుస్తకం మీద సీఎం బొమ్మ ఉంటే ఏం?: బొత్స
[ 03-05-2024]
రైతుల పట్టాదారు పాసు పుస్తకం మీద సీఎం చిత్రం ఉంటే అది చట్టపరంగా చెల్లకపోవడమంటూ ఏమీ లేదు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ భూ హక్కుదారులను అపహాస్యం చేశారు. -
అవయవదానంతో దాతృత్వం చాటారు!
[ 03-05-2024]
చనిపోయిన వ్యక్తి అవయవదానానికి ముందుకు వచ్చి ఆ కుటుంబ సభ్యులు దాతృత్వం చాటారు. -
నకిలీ నోట్లు, బంగారం ముఠా గుట్టురట్టు
[ 03-05-2024]
తక్కువ కాలంలో డబ్బు, బంగారం సంపాదించాలని ఆశపడే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లు, బంగారంతో మోసగిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేసినట్లు మధురవాడ ఏసీపీ గురువారం తెలిపారు. -
‘సిద్ధం’ తాయిలాల టోకెన్లకు ఘర్షణ
[ 03-05-2024]
విశాఖ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ సిద్ధం సభకు సిద్ధం చేసిన టోకెన్లపై ఆ పార్టీలోనే ఇద్దరు నాయకులు తీవ్రంగా ఘర్షణ పడటంతో పాటు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు