కొండలైనా.. బండలైనా.. పిండే
అంతర్జాతీయ విమానాశ్రయం భూసేకరణలో భాగంగా పొలాలు, నివాసాలు కోల్పోయిన నిర్వాసితులకు భోగాపురం మండలంలోని లింగాలవలస, పోలిపల్లి, చెరకుపల్లి గ్రామాలకు సమీపంలో పునరావాసం కల్పించారు.
ఎన్నికల విధుల్లో యంత్రాంగం
బరి తెగిస్తున్న మైనింగ్ మాఫియా
న్యూస్టుడే, భోగాపురం
చెరకుపల్లి సమీపంలో గ్రావెల్ అక్రమ తరలింపు
అంతర్జాతీయ విమానాశ్రయం భూసేకరణలో భాగంగా పొలాలు, నివాసాలు కోల్పోయిన నిర్వాసితులకు భోగాపురం మండలంలోని లింగాలవలస, పోలిపల్లి, చెరకుపల్లి గ్రామాలకు సమీపంలో పునరావాసం కల్పించారు. ఆ ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల కొండ భూములను కేటాయించగా ఇందులో కొంత భాగం మరడపాలెం, మరికొంత ముడసర్లపేట నిర్వాసితులకు ఇచ్చారు. పక్కనే స్థలాన్ని పై మూడు గ్రామాల పేదలకు జగనన్న కాలనీ కోసం కేటాయించారు. ఈ కొండ ప్రాంతంలో ఐదెకరాల మేరకు చదును చేసి లేఅవుట్ వేశారు. ఇదే అదునుగా పక్కనే మరో 20 ఎకరాలను జేసీబీలతో తవ్వేస్తూ.. మట్టి, కంకరను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. రాత్రి, పగటి వేళల్లో తవ్వేయడం, పెద్ద పెద్ద గుంతలు పెట్టడంతో గుట్టలు కనుమరుగైపోతున్నాయి.
కన్ను పడిదంటే చాలు.. అది ఎంతటి కొండైనా ఇట్టే కరిగించేస్తున్నారు.. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా దొలిచేస్తున్నారు.. స్థానిక నేతలతో ఒప్పందాలు కుదుర్చుకొని జగనన్న కాలనీ పేరుతో అక్రమ తవ్వకాలకు తెగపడుతున్నారు కొందరు కేటుగాళ్లు. భోగాపురం మండలంలో ఈ పరిస్థితి ఎక్కడికక్కడే కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం నిమగ్నమై ఉండడంతో అడిగేవారు లేక మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
పోలిపల్లి రెవెన్యూలో జగనన్న కాలనీకి ఆనుకుని తవ్వకాలు
నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో దందా సాగుతుండడంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. అన్నీ మేం చూసుకుంటామంటున్న స్థానిక నాయకులు, ముందుగానే పెద్దల నుంచి పోలీసులు, రెవెన్యూ, నిఘా వర్గాలకు ఫోన్ చేయిస్తున్నారు. ఎవరికైనా మట్టి, కంకర అవసరమైతే మైనింగు మాఫియా రంగంలోకి దిగుతోంది. ప్రభుత్వ అవసరాలకంటూ కొండలపై వాలిపోతోంది. తవ్వకాల నుంచి సరఫరా వరకు బాధ్యత తీసుకుంటోంది. ఇందుకు అవసరార్థుల నుంచి రూ.లక్షల్లో గుంజుతోంది. యంత్రాలు, రవాణా ఖర్చులు పోనూ.. స్థానికులకు కొంత మొత్తం ఇస్తూ మిగిలిందంతా మింగేస్తోంది. పలుచోట్ల చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టిని తోడి ప్రైవేటు లేఅవుట్లకు తరలిస్తోంది.
ముడసర్లపేట నిర్వాసిత కాలనీకి వెళ్లే దారిలో..
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
ఎక్కడైనా మట్టి, గ్రావెల్ తవ్వకాలు చేపడితే ముందస్తుగా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘిస్తే వారిపై వాల్టా చట్టం కింద చర్యలు తప్పవు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెళితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. కొండ ప్రాంతాల్లో తవ్వకాలను పరిశీలించి, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.
శ్యాంకుమార్, తహసీల్దారు, భోగాపురం
ఎ.రవికుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ‘మిత్ర’ ద్రోహం
[ 01-05-2024]
‘జగన్ మీ బిడ్డ.. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికలైన తర్వాత మరోలా.. ఉండేవాడు కాదు. మీ బిడ్డకు నిజాయతీ ఉంది. -
నేనున్నానన్నావ్.. బొబ్బిలిని వదిలేశావ్
[ 01-05-2024]
అబద్ధపు హామీలు.. కపట ప్రేమ కురిపించి.. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత నిజస్వరూపం బయటపెట్టారు. -
బొబ్బిలి ఉత్తర కోట వద్ద జగన్ సభ
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలిలో సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన బుధవారం ఖరారైంది. ముందుగా చంద్రబాబు ప్రజా సంకల్పయాత్ర జరిగిన చోట సభాస్థలం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. -
తొలిరోజు నుంచీ పోలీసుల హడావుడి
[ 01-05-2024]
సీఎం జగన్ సిద్ధం సభ బుధవారం ఉదయం 10 గంటలకు బొబ్బిలిలో జరగనుంది. -
అప్పన్న సన్నిధిలో పూసపాటి కుటుంబం
[ 01-05-2024]
సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. -
అవ్వాతాతలతో.. సర్కార్ పింఛనాట!
[ 01-05-2024]
వృద్ధులతో వైకాపా సర్కార్ పింఛనాట ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికి వెళ్లి పింఛను సొమ్ము అందించే వెసులుబాటు ఉన్నా.. పండుటాకులను ఇబ్బందులకు గురి చేస్తోంది. -
లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం
[ 01-05-2024]
ఎన్డీఏ కూటమి ప్రకటనలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లక్ష మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
7వ తేదీలోపు ఇంటింటికీ ఓటరు స్లిప్పులు
[ 01-05-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కోడ్ను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి ఆదేశించారు. -
2న చీపురుపల్లిలో బాలయ్య ఎన్నికల ప్రచార సభ
[ 01-05-2024]
ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభ మే 2న సాయంత్రం 4 గంటలకు చీపురుపల్లిలో జరుగుతుందని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు తెలిపారు. -
ఓ వినాశకారి.. ఈ వారధులు చూడోసారి
[ 01-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనపడడం లేదు.. ఇన్నిరోజులూ మాటలతోనే బతికేసిందీ ప్రభుత్వం.. హామీల నీటిమూటలతో ప్రజలను ముంచేసింది.. -
ప్రతిపక్షాలపై కక్ష.. పండుటాకులకు శిక్ష
[ 01-05-2024]
పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పండుటాకులతో ఆటలాడుకుంటోంది. నెలకో మాట చెప్పి.. వారిని అష్టకష్టాలు పెడుతోంది.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM