ఓ వినాశకారి.. ఈ వారధులు చూడోసారి
ఐదేళ్ల వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనపడడం లేదు.. ఇన్నిరోజులూ మాటలతోనే బతికేసిందీ ప్రభుత్వం.. హామీల నీటిమూటలతో ప్రజలను ముంచేసింది..
మృత్యుదారిలా వంగర, వింధ్యవాసి సమీపంలోని పోతల గెడ్డపై ఉన్న వంతెన
ఐదేళ్ల వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనపడడం లేదు.. ఇన్నిరోజులూ మాటలతోనే బతికేసిందీ ప్రభుత్వం.. హామీల నీటిమూటలతో ప్రజలను ముంచేసింది.. అడుగు రోడ్డు కూడా వేయలేకపోయింది.. అలాంటిది వంతెనలు నిర్మిస్తుందా.. జగన్మోహన్రెడ్డి పాలనలో ఉమ్మడి జిల్లాలో ఒక్క వారధి కూడా పూర్తికాలేదు.. ఎన్నికల నేపథ్యంలో ఓట్లు దండుకునేందుకు సారు గారూ మాత్రం విమానాలు, బస్సులలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నారు.. కాస్త దిగి తమ కష్టాలు చూడాలని ప్రజలు కోరుతున్నారు.. ఏం చేశారని బుధవారం బొబ్బిలికి వస్తున్నారని నిలదీస్తున్నారు.
న్యూస్టుడే, దత్తిరాజేరు
ఉమ్మడి జిల్లాకు కీలకం
ఉమ్మడి జిల్లాలో కీలకమైన పారాది వంతెన తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే కొంతమేర కుంగిపోయింది. నూతన నిర్మాణానికి రూ.11 కోట్లు మంజూరు చేశారు. రెండేళ్లయినా పనులు ప్రారంభించలేదు. పాత వంతెనపై వాహనాలు నిషేధించారు. కాజ్వే మీదుగానే రాకపోకలు సాగుతున్నాయి. రూ.90 లక్షలు వెచ్చించి నిర్మించిన అనుసంధాన రహదారి రెండు నెలలకే పాడైపోయింది. నీరు ప్రవహిస్తే మరింత కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది.
న్యూస్టుడే, బొబ్బిలి గ్రామీణం
నిధుల్లేక ఇలా వదిలేశారు..
సంతకవిటి మండలంలోని వాల్తేరు, శ్రీకాకుళం జిల్లా ఆమదావలస మండలం ఇసుకలపేట గ్రామాల వంతెన నిర్మాణం ఏళ్లుగా సాగుతోంది. రూ.87 కోట్లతో 2023లో పనులు చేపట్టారు. 18 నెలల్లో పూర్తి చేయాలి. ఇప్పటివరకు రూ.12 కోట్ల విలువైన పనులు చేసినట్లు గుత్తేదారు చెబుతున్నారు. నిధులు మంజూరు కాక ఇలా మధ్యలోనే వదిలేశారు. రెండు జిల్లాల్లోని 40 గ్రామాల వారు నాగావళి నాది దాటేందుకు ఇదే దిక్కు.
న్యూస్టుడే, సంతకవిటి
పొంచి ఉన్న ప్రమాదం..
శృంగవరపుకోట మండలం ధర్మవరం రోడ్డులోని పోతనాపల్లి కూడలి వద్దగల నిర్మాణం ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఇప్పటికే రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. ఇటీవల అధికారులు వెళ్లి పరిశీలించగా.. కిందభాగంలో పిల్లర్లు సైతం కూలే స్థితికి చేరినట్లు గుర్తించారు. స్తంభాలకు రక్షణగా ఉన్న రాతికట్ట కూడా కొట్టుకుపోయింది. స్థానికంగా ఉన్న గెడ్డలో నీటి ప్రవాహం పెరిగితే ముప్పు తప్పదు. ఇటుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రూ.4.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా నిధులకు దిక్కులేదు.
న్యూస్టుడే, ఎస్.కోట
అరకొర మరమ్మతులతో సరి
విజయనగరం నుంచి భీమసింగి, కొత్తవలస మీదుగా విశాఖ వెళ్లే మార్గంలో అలమండ గెడ్డ వద్ద నిర్మించిన వంతెన అధ్వానంగా దర్శనమిస్తోంది. ఇక్కడ బ్రిటిష్ కాలంనాటి పురాతన నిర్మాణం ఇంకా వినియోగంలో ఉంది. ప్రమాదకరంగా మారిందని సంబంధిత అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే వేరే దారిలేక వాహనదారులు వినియోగిస్తున్నారు. ఇప్పటికే స్లాబ్ దెబ్బతింది. హ్యాంగర్లు విరిగిపోయాయి. జడ్పీ నిధులు రూ.20 లక్షలతో అరకొరగా మరమ్మతులు చేసి వదిలేశారు. అధికారులు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా నిధులు రాలేదు.
న్యూస్టుడే, జామి
అయిదేళ్లుగా ఊరిస్తోంది
కొత్తవలస మండలం మంగళపాలేనికి సమీపంలో మేఘాద్రిగెడ్డపై వారధి నిర్మాణ పనులు అయిదేళ్ల నుంచి పూర్తి కాలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇక్కడ వంతెనతో పాటు బీటీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు రూ.కోటి కేటాయించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక పనులు మొదలు పెట్టారు. కానీ పూర్తిచేయలేకపోయారు. బిల్లులు చెల్లింపులు జరగక గుత్తేదారు ఆపేశారు. ఇది పూర్తయితే ఎం.ఆర్.పురం, చీపురువలస, గులివిందాడ, గనిశెట్టిపాలెం, దెందేరు తదితర గ్రామాల వారు విశాఖ వెళ్లేందుకు కొత్తవలస రావాల్సిన అవసరం లేకుండా మంగళపాలెం మీదుగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుంది.
న్యూస్టుడే, కొత్తవలస
16 గ్రామాల వారికి ఉపయోగం
సంతకవిటి మండలంలోని మల్లయ్యపేట- హొంజరాం రహదారిలో నారాయణపురం కుడి ప్రధాన కాలువపై ఉన్న వంతెన దుస్థితి ఇది. దాదాపు 16 గ్రామాలవారు ఉపయోగించే దీనిని ఒక్క నాయకుడూ పట్టించుకోలేదు. ఎప్పుడు కూలిపోతుందోనని అంతా భయాందోళన చెందుతున్నారు.
తిశ్రీపాలకులూ కాస్త చూడండి
మెంటాడ మండలం కొంపంగి సమీపంలోని వంతెన శిథిలావస్థకు చేరింది. రెండు వైపులా రైయిలింగ్లు దెబ్బతిన్నాయి. వర్షాకాలంలో కూనేటి గెడ్డ దీని కింద నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఒక్కోసారి పైనుంచి పారుతుంది. ఈ సమయంలో రాకపోకలు స్తంభిస్తున్నాయి. 20 గ్రామాల వారు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వంతెన నిర్మించాల్సి ఉన్నా.. పాలకులు పట్టించుకోవడం లేదు.
న్యూస్టుడే, మెంటాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో కుమారుడి దుర్మరణం
[ 21-05-2024]
ఇంటికి పెద్ద దిక్కు అయిన కుమారుడు తన కళ్లెదుటే రక్తపు మడుగులో ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లింది. -
ముట్టుకుంటే కూలిపోతాయ్..పట్టుకుంటే పగిలిపోతాయ్!!
[ 21-05-2024]
ఈ అందమైన, అద్భుతమైన నిర్మాణాలన్నీ ఎక్కడనుకుంటున్నారా.. విజయనగరం మండలం గుంకలాంలోని జగనన్న కాలనీలో పేదల కోసం ప్రభుత్వం కడుతున్న ఇళ్లు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో నివాసముండే దాదాపు 12 వేల మందికి పైగా ఇక్కడ పట్టాలిచ్చారు. -
సర్దుబాటు.. ఉన్న వారిపై పనిపోటు
[ 21-05-2024]
కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏపీఐఐసీ భవనంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసేశారు. రెండేళ్లు అవుతున్నా పక్కా భవనానికి నోచుకోలేదు. పరాయి పంచనే కొనసాగుతోంది. -
అమ్మ కదిలింది..సంబరమొచ్చింది
[ 21-05-2024]
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి దేవరోత్సవం సోమవారం సందడిగా జరిగింది. సాయంత్రం 4.30 గంటలకు ఆలయ సహా -
నేడు జంట సిరిమానోత్సవాలు
[ 21-05-2024]
బొబ్బిలి పట్టణంలోని పాతబొబ్బిలి, గొల్లపల్లిలో జంట పండగలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. -
గుండె లయ తప్పుతోంది..!
[ 21-05-2024]
గతేడాది విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసులు అనారోగ్యంతో చనిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట ఎస్పీ దీపిక ఎం.పాటిల్ వైద్య శిబిరం నిర్వహించగా.. 1400 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు..1043 మంది సిబ్బంది
[ 21-05-2024]
జూన్ నాలుగో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం, లెండి కళాశాలల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా రెవెన్యూ అధికారిణి ఎస్.డి.అనిత తెలిపారు. -
ఇంటర్ విద్య కలేనా?
[ 21-05-2024]
జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల నుంచి పదో తరగతి పరీక్షలకు 10,443 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 10,064 మంది పాసయ్యారు. -
పట్టణ రైతులకూదీ భరోసా!
[ 21-05-2024]
పట్టణ ప్రాంత రైతులు ఖరీఫ్, రబీ పంటల సాగుకు విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
కట్టండి.. మీ ఇంటి అప్పు
[ 21-05-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం.. ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల విలువ చేసే గూడు అప్పగిస్తాం. అప్పుల భారం లేకుండా చూస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
చైనా ఆక్రమిస్తే.. కిల్ స్విచ్ ఆన్ అవుతుంది: సెమీకండెక్టర్ తయారీ సంస్థల ప్లాన్..!
-
యూరప్ ట్రిప్ మరింత భారం.. షెంజెన్ వీసా ఫీజు పెంపు
-
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం
-
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
-
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ