ప్రతిపక్షాలపై కక్ష.. పండుటాకులకు శిక్ష
పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పండుటాకులతో ఆటలాడుకుంటోంది. నెలకో మాట చెప్పి.. వారిని అష్టకష్టాలు పెడుతోంది.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది.
పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పండుటాకులతో ఆటలాడుకుంటోంది. నెలకో మాట చెప్పి.. వారిని అష్టకష్టాలు పెడుతోంది.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. గత నెలలో సచివాలయాల్లో నగదు అందజేసింది. ఈ నెలకు సంబంధించిన నగదును బ్యాంకుల్లో వేస్తామని ప్రకటించింది. దీంతో నగదు బదిలీ కాక ముందే లబ్ధిదారులు ఆపసోపాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేయలేమని, ఇంటి వద్దే అందజేయాలని వారు కోరుతున్నారు.
ఈనాడు, విజయనగరం
విజయనగరం జిల్లాలో 2,82,903 మంది పింఛనుదారులు ఉన్నారు. వారికి రూ.82.66 కోట్లు పంపిణీ చేయాలి. ఇందులో ఇంటికి వెళ్లి అందజేయాల్సిన వారిలో 68,944 మందిగా గుర్తించారు. వీరిలో దివ్యాంగులు, రోగులు, సైనిక పింఛనుదారులు 40,100 మంది. 20,844 మందికి బ్యాంకు ఖాతాలు సక్రమంగా లేవు. వీరి ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై లేవు.
జిల్లాలోని ప్రతి మండలంలో 6-10 వేల మందికి పైగా పింఛనుదారులు ఉన్నారు. సగటున ఒక్కో మండలంలో నాలుగైదు బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఒక్కో బ్రాంచిలో రోజుకు వంద మందికి మాత్రమే నగదు పంపిణీ చేసే అవకాశం ఉంది. పెద్ద బ్రాంచి అయితే గరిష్ఠంగా రెండొందల మందికి ఇవ్వగలరు. ఈ లెక్కన అందరికీ నగదు ఇవ్వాలంటే కనీసం వారం పడుతుంది. ఒక్క రోజులో జరిగే పనిని వారం కొనసాగేలా.. ఆపై బ్యాంకుల చుట్టూ మండుటెండలో తిరిగేలా ప్రభుత్వ నిర్ణయం ఉండటంపై లబ్ధిదారులు మండిపోతున్నారు.
ఖాతాలు ఉన్నా వాటిని సక్రమంగా నిర్వహించని వారు మరో రెండు శాతంగా లెక్కిస్తే సుమారు పది వేల మంది వరకు ఉంటారు. వారికి ఒకటో తేదీన నగదు బదిలీ కాకపోతే మూడు రోజుల తర్వాత ఆ మొత్తాన్ని డ్రా చేసి వారింటి వద్దే అందజేయాల్సి ఉంది.
జిల్లాలో ఇంటింటికీ 68,944 మందికి రూ.18.47 కోట్లు ఇవ్వాలి. ఈ మొత్తం మంగళవారమే సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేయాలని చూశారు.
ఒకటో తేదీన లేనట్లే..
మే డే సందర్భంగా బుధవారం బ్యాంకులకు సెలవు. సిస్టమ్ జనరేటెడ్ విధానం వల్ల పింఛనుదారుల ఖాతాల్లో నగదు జమవుతుందని అధికారులు చెబుతున్నా ఎలా చూసుకోవాలో తెలియదు. మొత్తం పింఛనుదారుల్లో ఏటీఎం కార్డులు ఉన్న వారు రెండు శాతం మంది మాత్రమే. పైగా వారు ఏటీఎంకి వెళ్లాలంటే వ్యయప్రయాసలకు గురి కావాల్సిందే. వీరికి దీని వినియోగంపై అవగాహన ఉండదు.
ఎస్ఎల్బీసీ ఆదేశాలు
మే 2వ తేదీ నుంచి బ్యాంకుల్లో పింఛన్లు పంపిణీ చేస్తారు. అక్కడికి వచ్చే వారికి నీడ, నీటి వసతి కల్పించాలని, కుర్చీలు బల్లలు వేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆదేశించింది. అయిదు పది మంది వరకు ఉంటే వారికి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. వందల సంఖ్యలో వస్తే వారు చేతులెత్తేసే పరిస్థితి. బ్యాంకుల్లో సిబ్బందిని పెంచాలని, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉన్నఫళంగా సిబ్బందిని పెంచే అవకాశం లేదంటున్నారు.
2.13 లక్షల మంది.. 280 బ్యాంకులు
విజయనగరం జిల్లాలోని బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యే పింఛనుదారులు 2,13,959 మంది ఉన్నారు. వీరికి జిల్లాలోని సుమారు 280 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి.
ఎస్.కోట నియోజకవర్గంలో గిరిశిఖర దారపర్తి పంచాయతీలోని సుమారు ఎనిమిది గ్రామాల ప్రజలు బ్యాంకుకు రావాలంటే 14 కి.మీ. దూరం కాలినడకన పట్టణానికి చేరుకోవాలి. దబ్బగుంట గ్రామం నుంచి పల్లపుదుంగాడకు వెళ్లే రోడ్డు ఇది. ఈ రోడ్డు నిర్మాణానికి నాబార్డు నిధులు సుమారు రూ.4 కోట్ల మంజూరైనా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పింఛనుదారులు వచ్చేందుకు భయపడుతున్నారు.
బ్యాంకుకు వెళ్లాలని తెలియదు
పింఛను ఇంటి దగ్గర ఇస్తారనుకుంటున్నాను. బ్యాంకులకు వెళ్లాలని తెలియదు. నాకు తెర్లాంలోని రెండు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. దేనిలో పింఛను డబ్బులు పడతాయో తెలియదు. ఎండల సమయంలో మాలాంటి వాళ్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెర్లాంలోని బ్యాంకులకు వెళ్లాలి. అక్కడ ఎంతమంది నాలాంటి వాళ్లు ఉంటారో చూడాలి.
భూపతి అప్పలస్వామి, చిన్నయ్యపేట, తెర్లాం
- గజపతినగరం మండలంలో 8,620 మంది పింఛనుదారులు ఉన్నారు. అయిదు బ్యాంకులు ఉన్నాయి. శివారున ఉన్న వేమలి గ్రామ పింఛనుదారులు శ్రీరంగరాజపురం యూనియన్ బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకోవాలి. ఈ బ్రాంచిలో అయిదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడికి ఈ మండల వాసులతో పాటు దత్తిరాజేరు మండలంలోని ఆరు గ్రామాల వారు వస్తారు. తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరూ పది కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవాలి. అందరూ ఆటోల్లో రావాల్సి ఉంటుంది. రెండు వైపులా ఒక్కొక్కరికి రానుపోను రూ.100 ఖర్చవుతుంది. ఆపై ఎవరైనా తోడు వస్తే వారికి కూడా అదనం. ఆ గ్రామంలో మధ్యాహ్నం భోజనం దొరకదు.
10 కి.మీ వెళ్లాల్సి ఉంది
ఇంటికి తెచ్చి ఇచ్చే పింఛను కాస్తా గత నెలలో సచివాలయాల్లో పంపిణీ చేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు బ్యాంకు ఖాతాలకు వేస్తున్నారు. మాది సింగరాయి గ్రామం. 72 ఏళ్ల వయసులో ఎండలో 10 కి.మీ. దూరంలోని వేపాడ బ్యాంకుకు వెళ్లి సొమ్ము ఎలా తీసుకోవాలి. మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది.
రిక్కి అప్పారావు, సింగరాయి
- బ్యాంకు ఖాతాలు ఉన్నా కేవైసీ చేసుకోని వారు చాలా మంది ఉన్నారు. వారంతా బ్యాంకుకు వచ్చినా కేవైసీ చేసుకోవాలంటే ఈ రద్దీలో కుదరదు. అలాంటి వారందరికీ మళ్లీ రమ్మని బ్యాంకు సిబ్బంది చెప్పే అవకాశం ఉంది.
- నూతనంగా ఖాతాలు తెరవాలన్నా ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు. నూతనంగా దరఖాస్తు పూరించి ఇస్తే బ్యాంకు సిబ్బంది మూడు రోజుల్లో ఖాతా తెరుస్తామని చెబుతారు.
వెళ్లాలంటే భయమే..
ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో నగదు వేస్తామంటోంది. మాకు బ్యాంకు 12 కి.మీ. దూరంలో ఉంది. బ్యాంకుల్లో తరచూ సాంకేతిక లోపం ఉందని చెబుతుంటారు. తీరా అక్కడికి వెళ్లాక డబ్బు ఇవ్వకపోతే ఇబ్బందే. ఎప్పటిలాగే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ వచ్చి అందజేసేలా చర్యలు తీసుకోవాలి.
- ఆబోతుల లక్ష్మణ, వృద్ధాప్య పింఛనుదారుడు, ఏటీ అగ్రహారం
నాకు శస్త్రచికిత్స జరిగింది
ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో బొబ్బిలి బ్యాంకుకు వెళ్లి సొమ్ము తెచ్చుకోవాలంటే చాలా కష్టం. నాకు కడుపు కింద ఆపరేషన్ జరిగింది. వాహనాల్లో ప్రయాణం చేయలేను. గత నెలలో ఇంటికి పింఛను ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకు ఖాతాలో ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.
పిరిడి శివుడు, కలవరాయి, బొబ్బిలి మండలం
ఇంటి దగ్గరే ఇవ్వాలి
ప్రతి నెలా ఇస్తున్నట్లే పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వాలి. గత నెలలో సచివాలయానికి వెళ్లి తీసుకోవడంతో ఆలస్యమైంది. ప్రభుత్వం మళ్లీ ఈ నెల బ్యాంకుల నుంచి తీసుకోవాలంటే ఇబ్బంది తప్పేలా లేదు. బ్యాంకుకు వెళ్లి రావాలంటే ఎండలో ఇబ్బందితో పాటు, రానుపోను రూ.40 రవాణా ఖర్చు అవుతుంది.
మజ్జి లక్ష్మి, అయ్యన్నపేట, విజయనగరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి ప్రగతిలో నీరసం
[ 22-05-2024]
ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ (కన్వర్జెన్సీ) నిధులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. ఏటా వేతనదారుల కోసం చేసిన ఖర్చు ఆధారంగా ఈ నిధులు సమకూరుతాయి. -
రూ.300 కోట్లు ?
[ 22-05-2024]
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు లెక్కకు మించిన ఖర్చు చేస్తున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించిన పరిమితి లోపే చూపిస్తున్నారు. ఈ క్రమంలో 2014లో ఎంపీ అభ్యర్థి గరిష్ఠ వ్యయ పరిమితి రూ.70 లక్షలు ఉండగా, 2022లో రూ.95 లక్షలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. -
కిర్గిజ్స్థాన్లో భయాందోళనలో తెలుగు విద్యార్థులు
[ 22-05-2024]
కిర్గిజ్స్థాన్లో తెలుగు విద్యార్థులు క్షణక్షణం తీవ్ర భయాందోళనలతో గడుపుతున్నారు. ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారోనని బిక్కుబిక్కుమంటున్నారు. విద్యార్థులంతా అక్కడి బిష్కెక్లోని వర్సిటీల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. -
మారెట్ కమిటీల సేవలేవీ..!
[ 22-05-2024]
రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులపై ఒక శాతం సెస్సు(పన్ను)ను ముక్కు పిండి వసూలు చేస్తున్న మార్కెట్ కమిటీలు.. వారి సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా విస్మరించాయి. ఏటా రూ.కోట్లలో ఆదాయం కమిటీల ఖాతాల్లో చేరుతున్నా, ఆ నిధులను వారి కోసం ఖర్చు చేయడం లేదు. -
ఆరోగ్యశ్రీ సేవలు బంద్
[ 22-05-2024]
ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స అందించిన ఆసుపత్రులు బిల్లులు చెల్లిస్తే తప్ప వైద్యసేవలు కొనసాగించబోమని తేల్చేశాయి. -
పరాయి పంచన డిగ్రీ చదువులు!
[ 22-05-2024]
జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు సమకూరకపోవడంతో పరాయి పంచన తరగతులు నిర్వహించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. దీని ప్రభావం కళాశాలల ప్రవేశాలపై పడుతోంది. -
నెలాఖరు వరకు కార్మికులకు వేతనాలు
[ 22-05-2024]
కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం వద్ద జిందాల్ పరిశ్రమను ఈనెల 17 నుంచి మూసివేసినా కార్మికులందరికీ ఈనెలాఖరు వరకు పూర్తి వేతనం చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. -
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కేంద్రం పరిశీలన
[ 22-05-2024]
విజయనగరం పార్లమెంటు స్థానానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కేంద్రం ఏర్పాటును జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం లెండి ఇంజినీరింగ్ కళాశాలలోని లెక్కింపు కేంద్రాలను సందర్శించారు. -
కొరియర్ కాల్స్పై అప్రమ్తతత అవసరం
[ 22-05-2024]
ఇటీవల ఓ కొరియర్ పేరుతో వచ్చే కాల్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దీపిక ఎం.పాటిల్ పిలుపునిచ్చారు. ఈ కాల్స్ సైబర్ మోసాలకు సంబంధించినవని తెలిపారు. -
కోర్టు చెప్పింది.. యంత్రాంగం కదిలింది
[ 22-05-2024]
జిల్లాలో ఇప్పటి వరకు ఇసుక రవాణా యథేచ్ఛగా సాగినా స్పందించని అధికార యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. టన్నుల కొద్దీ ఇసుక సరిహద్దు దాటినా.. ఎక్కడికి వెళ్తుంది..? ఎవరు తీసుకెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి జిల్లాలో ఉండేది. -
వానొస్తే.. గుండెల్లో వరద
[ 22-05-2024]
వర్షం పేరు వింటేనే పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చిన్నపాటి వాన కురిసినా నీరు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో సాలూరు, పాలకొండ, పార్వతీపురం పట్టణాల్లోని పలు వీధులు జలమయం అవుతున్నాయి. రోడ్లపై వరద పారుతుండగా.. ఇళ్లలోకి బురద చేరుతోంది. -
కింగ్ కోబ్రా రక్షణకు చర్యలు
[ 22-05-2024]
సాలూరు రేంజ్ పరిధిలో మక్కువ మండలం నగుళ్లు, దబ్బగెడ్డ, అడారుగెడ్డ ప్రాంతాల్లో సంచరించే కింగ్ కోబ్రా జాతి పాముల రక్షణకు చర్యలు చేపట్టాలని డీఎఫ్వో జీఏపీ ప్రసూన అధికారులను ఆదేశించారు.