తొలిరోజు నుంచీ పోలీసుల హడావుడి
సీఎం జగన్ సిద్ధం సభ బుధవారం ఉదయం 10 గంటలకు బొబ్బిలిలో జరగనుంది.
సమావేశం జరిగే చోట దుకాణాల మూసివేతకు చర్యలు
బలిజిపేటకు వెళ్లే వాహనాలు మళ్లింపు
సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఎస్పీ దీపిక ఎం.పాటిల్
బొబ్బిలి, న్యూస్టుడే: సీఎం జగన్ సిద్ధం సభ బుధవారం ఉదయం 10 గంటలకు బొబ్బిలిలో జరగనుంది. ముందు రోజు ఉదయం నుంచే పోలీసులు హడావుడి ప్రారంభించారు. పట్టణంలో పెద్ద ఎత్తున మోహరించారు. అన్ని కూడళ్లలో నిఘా పెంచారు. ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆధ్వర్యంలో పోలీసు కాన్వాయ్ రూట్మ్యాప్ మేరకు ట్రయల్ రన్ వేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రాజా కళాశాల మైదానంలో హెలీప్యాడ్ను నిర్మించారు. కళాభారతి కూడలిలో సిద్ధం సభను ఏర్పాటు చేశారు. గతంలో ప్రజా సంకల్పయాత్ర సభ కళాభారతి కూడలిలోనే జరిగింది. అక్కడే ప్రస్తుతం సిద్ధం సభను ఏర్పాటు చేశారు. జగన్ హెలీప్యాడ్ నుంచి రాజా కళాశాల మార్గాన సభ ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. అక్కడ ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో రాజా కళాశాల, సభాస్థలి వద్ద దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని పోలీసులు వ్యాపార వర్గాలను ఆదేశించినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం