బొబ్బిలి ఉత్తర కోట వద్ద జగన్ సభ
ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలిలో సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన బుధవారం ఖరారైంది. ముందుగా చంద్రబాబు ప్రజా సంకల్పయాత్ర జరిగిన చోట సభాస్థలం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు.
రక్షణ కల్పించాలన్న బేబినాయన
బొబ్బిలి, న్యూస్టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలిలో సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన బుధవారం ఖరారైంది. ముందుగా చంద్రబాబు ప్రజా సంకల్పయాత్ర జరిగిన చోట సభాస్థలం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. మళ్లీ మంగళవారం సాయంత్రం అర్ధాంతరంగా బొబ్బిలి కోట ఉత్తర ద్వారం ఎదురుగా సభాస్థలి మార్చారు. బొబ్బిలి కూటమి అభ్యర్థి బేబినాయన ఇంటికి ఎదురుగా సమావేశం నిర్వహించడం పట్ల ఆయన ప్రతినిధి, న్యాయవాది గంట శర్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ దీపిక ఎం.పాటిల్, ఆర్వో సాయిశ్రీ, ఎన్నికల కమిషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. జనసమీకరణ చేస్తున్న నేపథ్యంలో ఇంటి దగ్గరలో సమావేశం నిర్వహించడంతో తమ కుటుంబానికి సరైన భద్రత ఎలా ఉంటుందని, పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని బేబినాయన కోరారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. వేదికను మార్చాలని కోరారు. కోట ఉత్తర ద్వారం మూడు రహదారుల కూడలి కావడంతో జనం ఎక్కువగా కనిపించే విధంగా ఉండేలా అక్కడకు మార్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..