అభ్యర్థుల ఖర్చు వారి ఖాతాల్లోనే జమ
జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రాజన్, ఆనందకుమార్, ఆకాష్దీప్ ఆదేశించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ నాగలక్ష్మి, చిత్రంలో వ్యయ పరిశీలకులు
విజయనగరం ఉడాకాలనీ, న్యూస్టుడే: జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రాజన్, ఆనందకుమార్, ఆకాష్దీప్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సహాయ వ్యయ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నందున అభ్యర్థికి సంబంధించిన ఖర్చులను వారి ఖాతాల్లోనే జమ చేయాలని సూచించారు. బ్యాంకుల్లో జరిగే లావాదేవీలపై దృష్టి సారించాలని, ఈ మేరకు రోజూ నివేదికలను అందించాలని స్పష్టం చేశారు.
రూ.92 లక్షలు స్వాధీనం : జిల్లాలో మార్చి 16 నుంచి శుక్రవారం వరకు రూ.92 లక్షల నగదు, రూ.42 లక్షల విలువైన మద్యం, రూ.29 లక్షల మత్తు పదార్థాలు, రూ.1.81 కోట్ల విలువైన బంగారు, వెండి వస్తువులు, రూ.74 లక్షల విలువైన ఇతర సామగ్రిని సీజ్ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. జేసీ కార్తీక్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఎస్పీ దీపిక ఎం.పాటిల్, అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, డీఆర్వో అనిత తదితరులు పాల్గొన్నారు.
నేడు రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలి రాక
విజయనగరం ఉడాకాలనీ, న్యూస్టుడే: రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగం శనివారం జిల్లాకు రానున్నారు. శ్రీకాకుళం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయనగరం చేరుకుంటారు. రాత్రి 7 గంటల వరకు కలెక్టర్, వ్యయ పర్యవేక్షణ బృందాలతో సమీక్షిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న ఎన్నో విలువలు నేర్పారు
[ 03-05-2024]
తన తండ్రి, దివంగత డా.పీవీజీ రాజు ఎన్నో విలువలు నేర్పించారని, ఆయన ఆశయాలతో ముందుకెళుతున్నానని కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. -
త్వరితగతిన పోస్టల్ బ్యాలెట్ల తరలింపు
[ 03-05-2024]
విజయనగరంలోని కలెక్టరేట్లో గురువారం పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. బ్యాలెట్ పేపర్లు, ఇతర పత్రాలు, అభ్యర్థుల పేర్లను జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. -
ప్రాణాంతకమైన నకిలీ మద్యం పట్టివేత
[ 03-05-2024]
కొత్తవలస మండలం మంగళపాలేనికి సమీపంలోని ఓ ఇంట్లో ప్రాణాంతకమైన నకిలీ మద్యం తయారుచేస్తున్న ఇద్దరిని విశాఖ జిల్లాకు చెందిన ఎస్ఈబీ అధికారులు అరెస్టు చేశారు. -
అవినీతి బొత్స.. అక్రమాల కోలగట్ల
[ 03-05-2024]
చీపురుపల్లి, విజయనగరం సభల్లో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ మరో అభినవ అంబేడ్కర్. ఆయన అమలు చేసిన పథకాలన్నీ ప్రజలకు ఆమోదయోగ్యమైనవి. -
అక్కసుతో.. ‘ఇంత’ కర్కశత్వమా?
[ 03-05-2024]
ఇదేం ప్రభుత్వం.. ఇదెక్కడి అరాచకం.. అభ్యాగులపై ఇంత పగ ఎందుకు.. అందరూ 60 ఏళ్లు దాటిన వృద్ధులే.. అనారోగ్యంతో కొందరు.. దీర్ఘకాలిక వ్యాధులతో మరికొందరు.. నడుము వంగక కూర్చుని పాకేవారు ఇంకొందరు.. వీరితోనా మీ ఓటు రాజకీయం.. చేతికిచ్చే అవకాశం ఉన్నా.. ఎక్కడెక్కడి నుంచో బ్యాంకులకు మండుటెండలో రప్పించి ఏడిపిస్తారా. -
బాలయ్య అన్స్టాపబుల్!
[ 03-05-2024]
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ సభ గురువారం సాయంత్రం చీపురుపల్లిలో దిగ్విజయంగా జరిగింది. -
పాలకొండను బంగారు కొండగా మారుస్తా!
[ 03-05-2024]
‘పాలకొండను బంగారుకొండగా మారుస్తా. ఇక్కడ అపారమైన వనరులు ఉన్నందున పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. -
నీడ కరవు.. భోజనం బాగోలేదు
[ 03-05-2024]
రాజాం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా పీవోలు, ఏపీవోలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
మాజీ వాలంటీర్లతో ఐప్యాక్ బృందం సమావేశం?
[ 03-05-2024]
కొత్తవలస మండలంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లతో ఐప్యాక్ బృందం అర్ధానపాలెంలోని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయం ఆవరణలో గురువారం ప్రత్యేకంగా భేటీ అయిందని తెలిసింది. -
జగ‘మొండి’.. ‘న’డవని బండి..!
[ 03-05-2024]
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనేది నినాదం.. డొక్కు బండిలో ప్రయాణం భయం.. భయం నేటి వాస్తవం.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు